TS News: భార్య, కుమార్తెను గొడ్డలితో నరికి చంపేశాడు

నిజామాబాద్‌ జిల్లా రుద్రూరులో దారుణం చోటుచేసుకుంది. భార్య, కుమార్తెను భర్త హతమార్చాడు.

Updated : 23 Jul 2021 16:33 IST

రుద్రూర్‌: నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్య, కుమార్తెను భర్త హతమార్చాడు. భార్య మల్లీశ్వరి (30), కుమార్తె (13)ను భర్త గంగాధర్‌ గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం నిందితుడు తన ఇంటికి తాళం వేసి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. భార్యకు గల అక్రమ సంబంధమే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. ఘటనాస్థలిని ఏసీపీ రామారావు, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సై రవీందర్‌ పరిశీలించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలిస్తామని ఏసీపీ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని