Crime News: శిల్పా చౌదరికి మరో రోజు కస్టడీ పొడిగింపు.. ఉప్పర్‌పల్లి కోర్టు ఆదేశాలు

పెట్టుబడుల ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని పోలీసులు మరో రోజు కస్టడీకి తీసుకోనున్నారు. ఈ మేరకు

Updated : 14 Dec 2021 10:13 IST

హైదరాబాద్‌: పెట్టుబడుల ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని పోలీసులు మరో రోజు కస్టడీకి తీసుకోనున్నారు. ఈ మేరకు కస్టడీకి అనుమతిస్తూ ఉప్పర్‌పల్లి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గతంలో కస్టడీకి అనుమతిస్తూ ఉప్పర్‌పల్లి కోర్టు విధించిన గడువు ఇవాళ్టితో ముగియడంతో పోలీసులు శిల్పా చౌదరిని కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసుల విజ్ఞప్తి మేరకు మరో రోజు కస్టడీకి అనుమతిచ్చింది. వాదనలు ముగిసిన వెంటనే శిల్పా చౌదరిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు.. తిరిగి 15వ తేదీ ఉదయం 11 గంటలకు ఆమెను కోర్టులో హాజరుపరుస్తారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని