AP News: గణేశ్‌ మండపం వద్ద డాన్స్‌ చేస్తూ యువకుడి ఆకస్మిక మృతి

అనంతపురం జిల్లా గుత్తిలో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న గౌతమిపురి కాలనీలో ఏర్పాటు చేసిన గణేశ్‌ మండపం

Updated : 12 Sep 2021 10:13 IST

గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న గౌతమిపురి కాలనీలో ఏర్పాటు చేసిన గణేశ్‌ మండపం వద్ద ఓ యువకుడు నృత్యం చేస్తూ ఉన్నట్టుండి కూప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. నృత్యం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతోనే యువకుడు చనిపోయాడని వైద్యులు భావిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని