Crime news: మాట్లాడటం మానేసిందని.. స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు పొడిచి!

తనతో మాట్లాడటం లేదన్న ఆగ్రహంతో ఓ యువకుడు.. 20 ఏళ్ల యువతిని స్క్రూడ్రైవర్‌తో పలుమార్లు పొడిచి హతమార్చాడు. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది.

Published : 27 Dec 2022 16:27 IST

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో ఒళ్లు గగుర్పొడిచే హత్యాఘటన వెలుగులోకి వచ్చింది. తనతో మాట్లాడేందుకు నిరాకరించిన ఓ యువతిని స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు పొడిచి హతమార్చాడో నిందితుడు. ఇక్కడి కోర్బా(Korba) జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే ఓ యువతి(20)కి, జశ్‌పూర్ జిల్లాకు చెందిన నిందితుడితో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అప్పట్లో అతను కండక్టర్‌గా పనిచేస్తున్న బస్సులో ఆమె ప్రయాణించేది. అనంతరం, అతను పని కోసం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు.

కొన్నాళ్లకు ఆమె అతనితో మాట్లాడటం మానేసింది. దీంతో వేధింపులు మొదలుపెట్టాడు. యువతి తల్లిదండ్రులనూ బెదిరించాడు. ఈ క్రమంలోనే.. డిసెంబరు 24న యువతి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా.. ఆమె అరిచేందుకు వీలు లేకుండా నోటిని దిండుతో మూసేసి, స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు పొడిచి, పారిపోయాడు. మృతురాలి సోదరుడు ఇంటికి వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో నిర్జీవంగా కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని