AP News: జనసేన నాయకుడి బార్‌పై పేర్ని కిట్టు అనుచరుల దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

మచిలీపట్నంలో జనసేన నాయకుడు కొరియర్‌ శ్రీను బార్‌పై వైకాపా నేతలు దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం..

Updated : 10 Apr 2024 10:41 IST

కృష్ణా: మచిలీపట్నంలో జనసేన నాయకుడు కొరియర్‌ శ్రీను బార్‌పై వైకాపా నేతలు దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి పేర్ని కిట్టు ఐదుగురు అనుచరులు అక్కడికి తాగేందుకు వచ్చారు. కౌంటర్‌లో ఉన్న నరహరశెట్టి రాము, దేవరకొండ మధుపై వారు బీరు సీసాలతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిద్దరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న చిలకపూడి సీఐ సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

కొరియర్‌ శ్రీను గతంలో పేర్ని నాని అనుచరుడిగా ఉండేవారు. ఇప్పటికే అనేకసార్లు ఆయన ఆఫీస్‌పై పేర్ని నాని అనుచరులు దాడి చేశారు. గత 6 నెలలుగా తనను టార్గెట్‌ చేస్తున్నారని శ్రీను ఆరోపించారు. ఇప్పుడు గంజాయి బ్యాచ్‌ను పంపి తమ వాళ్లపై దాడి చేయించారని తెలిపారు. వైకాపా నేతలకు కొంత మంది పోలీసులు కొమ్ముకాస్తున్నారని చెప్పారు. దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోగా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని