కార్మిక క్షేత్రం.. ఉపాధికి కేంద్రం
కార్మిక ప్రాంతాలకు ప్రధాన కేంద్రంగా మంచిర్యాల జిల్లా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ సింగరేణి బొగ్గు గనులు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం, చిన్నతరహా పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. ఫలితంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉద్యోగ, వ్యాపార రీత్యా వచ్చి స్థరపడ్డారు. భవన నిర్మాణ రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతుండటంతో వలస కార్మికులకు ఉపాధి లభిస్తుంది.
మంచిర్యాల పట్టణం, న్యూస్టుడే
కార్మిక ప్రాంతాలకు ప్రధాన కేంద్రంగా మంచిర్యాల జిల్లా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ సింగరేణి బొగ్గు గనులు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం, చిన్నతరహా పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. ఫలితంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉద్యోగ, వ్యాపార రీత్యా వచ్చి స్థరపడ్డారు. భవన నిర్మాణ రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతుండటంతో వలస కార్మికులకు ఉపాధి లభిస్తుంది. మరో పక్క గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన జీవనాధారంగా వ్యవసాయం మారింది. గతంలో ఉన్నత విద్య, వైద్య సేవలు కావాలంటే గుంటూరు, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లేవేరు. ఆ రెండు రంగాలు ఇప్పుడు జిల్లాలోనే అభివృద్ధి చెందుతున్నాయి.స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ..జిల్లా ప్రజలు ప్రగతి ఫలాలు అనుభవిస్తున్నారు.
సింగరేణి సిరులలో..
జిల్లాలో 13 భూగర్భ గనులు, 5 ఉపరితల గనులు ఉన్నాయి. 17 వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా, లక్ష మందికిపైగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఏడాదికి దాదాపు 15 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఏటా దాదాపు రూ.4000 కోట్ల ఆదాయం వస్తుందని సమాచారం. జైపూర్ మండలంలో సింగరేణి బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం నిర్మించారు. 1200 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయగా, జైపూర్, మందమర్రి రెండు ప్రాంతాల్లో 20 మెగావాట్ల సోలార్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి తయారు చేస్తున్నారు. జిల్లాలో బొగ్గు పరిశ్రమలే కాకుండా సిమెంట్, సిరామిక్స్ తదితర చిన్ని తరహా పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. వీటి ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు.
జలమొచ్చి.. భూమికి బలమిచ్చి
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 3.60 లక్షల ఎకరాలు సాగు చేస్తూ 1.50 లక్షల మంది రైతులు వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. 1.90 లక్షల ఎకరాల్లో పత్తి, 1.60 లక్షల ఎకరాల్లో వరి, మరో 10 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. భూములకు కడెం, ర్యాలీవాగు, నీల్వాయి, గొల్లవాగు జలాశయాలు, ఎల్లంపల్లి జలాశయం బ్యాక్ వాటర్ గూడెం ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 850 చెరువుల ద్వారా కూడా సాగునీరు అందుతుంది. వ్యవసాయ రంగంలో జిల్లా ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన కూలీలు ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉపాధి పొందుతున్నారు.
అద్దాల మేడలు వెలుస్తూ..
జిల్లాలో వివిధ పరిశ్రమలు విస్తరించి ఉండటంతో మంచిర్యాల, నస్పూరు, క్యాతన్పల్లి పట్టణాల్లో భవన నిర్మాణ రంగం అభివృద్ది చెందుతోంది. ఇక్కడికి ఉద్యోగ, ఉపాధి కోసం వచ్చిన అనేక మంది స్థిరపడి పోయారు. ఇక్కడే భూములు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుంటున్నారు. ఒక మంచిర్యాలలోనే ఏటా 450 నుంచి 500 ఇళ్లు నిర్మిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడి వచ్చి ఉపాధి పొందుతున్నారు.
అక్షరం.. అల్లుకుంది
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యారంగం అభివృద్ధి చెందుతోంది. గతంలో విద్య, నైపుణ్య శిక్షణ కోర్సుల కోసం ఇక్కడి విద్యార్థులు ఇతర జిల్లాలకు వెళ్లేవారు. ఇప్పుడు జిల్లాలోనే అందులో పాలిటెక్నిక్ శిక్షణ కేంద్రాలు, ఐటీఐ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 2,855 పాఠశాల్లో 1.03 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయిదు ఆదర్శ పాఠశాల్లో 3,642 మంది, 18 కస్తూర్బాగాంధీ పాఠశాల్లో 4,057 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. ఇక్కడ ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి.
‘నాడి.. ఆడుతోంది
జిల్లా ప్రజలు ఇంతకుముందు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగర ప్రాంతాలకు వెళ్లేవారు. ఇప్పుడు ఇక్కడే మెరుగైన వైద్యం అందుతోంది. మంచిర్యాలలో 200 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఉండగా, 130 పడకలతో మాతాశిశు సంరక్షణ ఆసుపత్రి నిర్మించారు. జిల్లా ప్రజలకే కాకుండా కుమురంభీం, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలు, ప్రాణహితనది సరిహద్దులోని మహారాష్ట్ర ప్రజలు ఇక్కడికి వచ్చిన వైద్య సేవలు పొందుతున్నారు. మంచిర్యాల జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైంది. తరగతి గదుల నిర్వహణ కోసం తాత్కాలిక భవనం కూడా సిద్ధం చేశారు. కళాశాల నిర్వహణకు అనుమతులు రాగానే ఈ ఏడాది తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. చెన్నూరు, బెల్లంపల్లి పట్టణాల్లో సామాజిక ఆసుపత్రులు నిర్మాణ దశలో ఉండగా, లక్షెట్టిపేటలో పనులు ప్రారంభించాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దూసుకెళ్తున్న వినియోగం.. షెడ్డుకొస్తున్న నియంత్రికలు
[ 26-04-2024]
జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి. -
రెఫరీగా మారి.. ప్రచారం చేసి!
[ 26-04-2024]
సిరికొండ మండలం వాయిపేట్, రాజన్పేట్, చెమ్మన్గూడ తదితర గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గురువారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. -
సివిల్స్ ర్యాంకర్కు గవర్నర్ సన్మానం
[ 26-04-2024]
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 790 ర్యాంకు సాధించిన రేకులవార్ శుభంతో పాటు వారి తల్లిదండ్రులు జీవిత, సత్యనారాయణలను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సన్మానించారు. -
పేదలకు అండగా.. గిరిజన క్యాంటిన్
[ 26-04-2024]
టీ తాగాలన్నా కనీసం రూ.6 వెచ్చించాల్సిందే. అలాంటి పరిస్థితిలో కేవలం రూ.5 లకే అందిస్తున్న భోజనం ఉట్నూరువాసుల కడుపు నింపుతోంది. ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ను ఆదుకునేందుకు ఐటీడీఏ అధికారులు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. -
రిమ్స్ సంచాలకుడిని బ్లాక్మెయిల్ చేసే యత్నం
[ 26-04-2024]
తాను స్పెషల్ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్ సంచాలకుడు రాఠోడ్ జైసింÞ్ను, గజానంద్ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్ నుగుర్వార్ను బ్లాక్ మెయిల్ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
[ 26-04-2024]
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. -
జేఈఈ మెయిన్స్లో గిరిజన విద్యార్థిని ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. -
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.