కబళిస్తున్న కాలుష్యం!
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గాలిలో సూక్ష్మ ధూళికణాల పరిమితి 40 ఉండాలి. కానీ ఉమ్మడి జిల్లాలో అంతకంటే ఎక్కువే నమోదవుతోంది.
ఉమ్మడి జిల్లాలోనూ జనం ఉక్కిరిబిక్కిరి
న్యూస్టుడే, ఆదిలాబాద్ వ్యవసాయం
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గాలిలో సూక్ష్మ ధూళికణాల పరిమితి 40 ఉండాలి. కానీ ఉమ్మడి జిల్లాలో అంతకంటే ఎక్కువే నమోదవుతోంది. ఒకప్పుడు పెద్ద పట్టణాలకే పరిమితమైన వాయు కాలుష్యం ఇప్పుడు జిల్లాలకు పాకుతోంది. వాహనాల సంఖ్య పెరగడం, పరిశ్రమలు ఏర్పడటంతో వేగంగా విస్తరిస్తోంది. గాలిలో సూక్ష్మధూళి కణాలు (పీఎం10) నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) గణాంకాల ప్రకారం గతంతో పోలిస్తే.. జిల్లాలో పది శాతం పెరుగుదల ఉంది.
పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడుతున్న ప్రమాదకర వాయువులు, ప్లాస్టిక్ వినియోగం పర్యావరణంపై ప్రభావం చూపుతాయి. గాలిలో సూక్ష్మ ధూళి కణాలు, ఓజోన్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి కాలుష్య ఉద్గారాలు గాలిని కలుషితం చేస్తున్నాయి. వీటిలో ప్రధానమైన పీఎం 10 ఉద్గారాలు జిల్లాలో పెరుగుతున్నాయి. పరిశ్రమలు అందులోనూ మైనింగ్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు మందమర్రిలో కాలుష్య నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సీజన్లో నెల వారీ వివరాలను పరిశీలిస్తే. అక్టోబరులో పీఎం 10 ఉద్గారాలు సగటు 65గా నమోదు అయింది.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
* ఉమ్మడి జిల్లాలో 869 పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో పత్తి ఆధారిత పరిశ్రమలతో పాటు సిమెంట్, మాంగనీస్ తదితర పరిశ్రమలు ఉన్నాయి. వీటితో పాటు 6,092 కుటీర పరిశ్రమలు ఉన్నాయి. వీటి నుంచి పెద్ద ప్రమాదం లేకపోయినా.. భారీ పరిశ్రమల నుంచి విడుదలయ్యే ప్రతి ఘనపు మీటరుకు 500 కార్బన్ రేణువులకంటే మించకూడదు. కానీ జిల్లాలో ఉన్న పరిశ్రమలు విడుదల చేస్తున్న విషవాయివులు అంతకంటే ఎక్కువ మోతాదులోనే గాలిలో కలుస్తున్నాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. .
* జిల్లాలో భారీ వాహనాలు 46,232 ఉండగా, ఇతర వాహనాలు 1.46 లక్షల వాహనాలు నిత్యం 1.50 లక్షల లీటర్లకు పైగా పెట్రోల్, డీజిల్ తదితర ఇంధనాలు వినియోగిస్తున్నారు. ఒక లీటర్, లేదా డీజిల్ ఉపయోగిస్తే 2.30 కిలోల విషవాయువులు ఏర్పడుతాయి. ఈ లెక్కన జిల్లాలో వినియోగిస్తున్న వాహనాలు లక్షల కిలోల విషవాయువును విడుదల చేస్తున్నాయి.
* పరిశ్రమలు, రైతులు పంట పొలాలకు చల్లే ఎరువులు, పురుగు మందులు వర్షం నీరు ద్వారా వాగులు, చెరువుల్లోకి చేరి కలుషితమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎరువుల వినియోగం సాధారణం కంటే 60 శాతం అధికంగా ఉండగా, పురుగు మందుల వినియోగం 38 శాతం ఎక్కువగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి.. మట్టిలో ఉదజని విలువ 8.4 కంటే ఎక్కువగా ఉంటే అలాంటి మట్టి పనికి రాదు.
జిల్లాలో 540 చెరువుల్లో నుంచి మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తే 90 శాతం చెరువుల్లోని మట్టిలో రసాయనాలు మిళితమై ఉన్నట్లు గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో నీటి కాలుష్యాన్ని గుర్తించేందుకు బాసర, మంచిర్యాలలోని పుష్కర్గాట్, బోథ్ మండలం పొచ్చెర వాటర్ఫాల్, ర్యాలీవాగు, మంచిర్యాల సమీపంలో కేంద్రాలు ఏర్పాటు చేశారు..
ఈ రోజు ఎందుకంటే..
మధ్యప్రదేశ్లోని భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో మృతి చెందిన వ్యక్తుల జ్ఞాపకార్థం డిసెంబరు 2వ తేదిన జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
కాలుష్య నియంత్రణ దినోత్సవం నిర్వహించి అవగాహన కలిగించాలని నిర్ణయించారు.
* 2020లో నిర్వహించిన సర్వే మేరకు ప్రపంచంలో అత్యంత కాలుష్య మొదటి 14 నగరాల్లో 13 భారతదేశంలోనే ఉన్నాయి. కాలుష్యం కారణంగా 12.5 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. గాలిలోని హానికరమైన వాయువుల బారిన పడి ప్రతి పది వేల మంది పిల్లలల్లో సగటున 8.5 శాతం అయిదేళ్లు నిండక ముందే చనిపోతున్నారు. 86 శాతం నదులు కలుషితంగా ఉన్నట్లు గుర్తించారు. భారత దేశంలో 351 నదులు కలుషితంగా ఉన్నాయి.
ప్లాస్టిక్ పెనుభూతమై..
జిల్లాలో ఏటా ప్లాస్టిక్ వినియోగం పెరుగుతోంది. ఏడాదికి వ్యక్తి తన సగటు జీవితంలో 384 ప్లాస్టిక్ సంచులు, ఎనిమిది ప్లాస్టిక్ సీసాలను ఉపయోగిస్తాడు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనల మేరకు 0-50 శాతం లోపు ఉంటే మంచిగా ఉన్నట్లుగా పరిగణిస్తారు.. 51-100 లోపు ఉంటే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నట్లుగా భావించాలి. ఉమ్మడి జిల్లాల్లో రహదారులు అధ్వానంగా ఉండటంతో దుమ్మూధూళి రేగి కాలుష్యానికి దారి తీస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్టోన్ క్రషర్లున్నాయి. గుట్టలను తవ్వి మొరం తరలిస్తున్నారు. మంచిర్యాలలో బొగ్గుతో పాటు మాంగనీసు, రైస్మిల్లులు ఎక్కువగా ఉండగా, ఆదిలాబాద్లో పత్తి, సోయా తదితర మిల్లులు ఉన్నాయి. జిల్లాల వారీగా కాలుష్య నమోదు కేంద్రాలు లేక తీవ్రత తెలియని పరిస్థితి ఉంది.
జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
లక్ష్మణ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ అధికారి
ఉమ్మడి జిల్లాలో వాయుకాలుష్య ప్రభావం పెద్దగా లేదు. మైనింగ్కు సంబంధించిన ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో సూక్ష్మధూళి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. కాలుష్య ప్రభావం ఉండే ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు కాలుష్య నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం నమోదైన వివరాల మేరకు కాలుష్య ప్రభావం ఎక్కువగా లేకపోయినా.. ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మందమర్రిలోని కాలుష్య పరిశీలన కేంద్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దూసుకెళ్తున్న వినియోగం.. షెడ్డుకొస్తున్న నియంత్రికలు
[ 26-04-2024]
జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి. -
రెఫరీగా మారి.. ప్రచారం చేసి!
[ 26-04-2024]
సిరికొండ మండలం వాయిపేట్, రాజన్పేట్, చెమ్మన్గూడ తదితర గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గురువారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. -
సివిల్స్ ర్యాంకర్కు గవర్నర్ సన్మానం
[ 26-04-2024]
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 790 ర్యాంకు సాధించిన రేకులవార్ శుభంతో పాటు వారి తల్లిదండ్రులు జీవిత, సత్యనారాయణలను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సన్మానించారు. -
పేదలకు అండగా.. గిరిజన క్యాంటిన్
[ 26-04-2024]
టీ తాగాలన్నా కనీసం రూ.6 వెచ్చించాల్సిందే. అలాంటి పరిస్థితిలో కేవలం రూ.5 లకే అందిస్తున్న భోజనం ఉట్నూరువాసుల కడుపు నింపుతోంది. ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ను ఆదుకునేందుకు ఐటీడీఏ అధికారులు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. -
రిమ్స్ సంచాలకుడిని బ్లాక్మెయిల్ చేసే యత్నం
[ 26-04-2024]
తాను స్పెషల్ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్ సంచాలకుడు రాఠోడ్ జైసింÞ్ను, గజానంద్ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్ నుగుర్వార్ను బ్లాక్ మెయిల్ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
[ 26-04-2024]
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. -
జేఈఈ మెయిన్స్లో గిరిజన విద్యార్థిని ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. -
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.