వాగులు దాటేదెలా.. గమ్యం చేరేదెలా?
జిల్లాలోని ఉట్నూరు ఏజెన్సీలో ఉన్న మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లే దారుల్లోని వాగులపై వంతెనలు లేక ఆయా గ్రామాలవాసులు నిత్యం అవస్థలు పడుతున్నారు.
వంతెనలు లేక గిరిజనుల అవస్థలు..
గత వర్షాకాలంలో అల్లికోరి నుంచి కాన్పు కోసం ఎడ్ల బండిపై గర్భిణిని తీసుకెళ్తున్నారిలా.. (పాత చిత్రం)
ఇంద్రవెల్లి, న్యూస్టుడే : జిల్లాలోని ఉట్నూరు ఏజెన్సీలో ఉన్న మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లే దారుల్లోని వాగులపై వంతెనలు లేక ఆయా గ్రామాలవాసులు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఏటా వర్షాకాలంలో నాలుగు నెలలపాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాల్సిన దుస్థితి. ఇంద్రవెల్లి, ఉట్నూరు, నార్నూరు, సిరికొండ, ఆదిలాబాద్ గ్రామీణం తదితర మండలాల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక వాగులు దాటి రాకపోకలు సాగించడం పరిపాటి. ఈ వాగులపై వంతెనలు నిర్మిస్తే రాబోయే వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ఉండవని ఆయా గ్రామాలావాసులు కోరుతున్నారు.
ఏజెన్సీలో సమస్యలు ఇలా..
* ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని అల్లికోరి పంచాయతీ కేంద్రానికి వెళ్లాలంటే అడ్డుగా వాగు ఉంది. గత వర్షాకాలంలో గర్భిణులను ప్రసూతి కోసం ఎడ్లబండ్లతో వాగులు దాటించి ఇంద్రవెల్లి పీహెచ్సీకి తీసుకొస్తుండగా వాగు పక్కన ప్రసవం అయింది. అల్లికోరి గ్రామంలో 75 కుటుంబాల్లోని 305 మంది వాగు దాటి రావాల్సిన పరిస్థితి ఉందని గ్రామ పటేల్ గంగారాం తెలిపారు.
* ఇంద్రవెల్లి మండల కేంద్రం నుంచి ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చిద్దరి, ఖానాపూర్, అల్లికోరి తదితర పంచాయతీల పరిధి గ్రామాలతోపాటు ఇంద్రవెల్లి మండలం మర్కాగూడ పంచాయతీకి తారు రోడ్డుపై సట్వాజిగూడ వాగు అడ్డుగా ఉంది. దీనిపై రోడ్డు డ్యాం నిర్మించారు. భారీ వర్షాలు కురిసి వాగు పొంగితే వరద తగ్గేవరకు గంటల తరబడి వర్షంలో వేచి ఉండాల్సిన పరిస్థితి. అప్పటి ఐటీడీఏ పీవోలు భవేష్ మిశ్రా, అంకిత్లతోపాటు పలువురు అధికారులు పరిశీలించి రోడ్డు డ్యాంపై కల్వర్టు నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఏళ్లు గడుస్తున్నా.. మంజూరు కాలేదు.
* ఇంద్రవెల్లి మండలంలోని వడ్గాం పంచాయతీ పరిధి జైత్రాంతండా, జెండాగూడ గ్రామాలకు వెళ్లేందుకు వాగులు అడ్డంగా ఉన్నాయి. ఈ వాగులపై వంతెనలు నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ పంచాయతీ పరిధిలోని గోపాల్పూర్ గ్రామానికి వెళ్లాలంటే సిరికొండ మండలం కన్నాపూర్ పంచాయతీ పరిధిలోని కన్నాపూర్ వాగు దాటి వెళ్లాలి.
* ఉట్నూరు మండలం నర్సాపూర్(జే), వంకతుమ్మ, వడ్గల్పూర్ గ్రామాలకు వెళ్లేందుకు వాగులపై వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం గతేడాది నిధులు మంజూరు చేసింది. అయితే పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు.
* ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ పంచాయతీ పరిధిలోని మామిడిగూడ(జి), మామిడిగూడ(బి) గ్రామాలకు రోడ్డు సౌకర్యంతో పాటు వడ్గాం వాగుపై వంతెన లేక వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారు. 2020లో అప్పటి పాలనాధికారి దివ్య దేవరాజన్ వడ్గాం దాటి మామిడిగూడ గ్రామానికి వెళ్లి రోడ్డు నిర్మాణానికి రూ.18 లక్షలు మంజూరు చేసినా ఇంకా ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులు పనులు ప్రారంభించలేదు. గత వర్షాకాలంలో గర్భిణిని కాన్పుకోసం తీసుకొస్తుండగా వాగు పొంగిపోవడంతో వాగు పక్కన ప్రసవించింది.
ఆదిలాబాద్ మండలం అల్లికోరి గ్రామ పంచాయతీ కేంద్రానికి వెళ్లడానికి అడ్డంగా ఉన్న వాగు
ప్రతిపాదనలు పంపాం
ఉట్నూరు డివిజన్లో వాగులు దాటి పోయే గ్రామాల వివరాలు, వంతెనల నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇంకా మంజూరు రాలేదు. ఇంద్రవెల్లి మండలం మర్కాగూడ పంచాయతీ పరిధిలోని తారు రోడ్డుపై వర్షాకాలంలో కొట్టుకుపోయిన వంతెన నిర్మాణానికి రూ.12 లక్షలు మంజూరయ్యాయి.
పవార్ రమేష్, డిప్యూటీ ఈఈ, పీఆర్, ఉట్నూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలి
[ 26-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూ 138వ మేడేను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ పిలుపునిచ్చారు. -
26 నుంచి యోగా-ధ్యానం అంశాలపై తరగతులు
[ 26-04-2024]
జిల్లా కేంద్రంలోని పతంజలి యోగా శిక్షణ కేంద్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజుల పాటు యోగా -ధ్యానం అంశాలపై ఉచిత అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు యోగా గురువు తిరుపతి రెడ్డి తెలిపారు. -
క్రీడా ప్రాంగణంలో భాజపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
దూసుకెళ్తున్న వినియోగం.. షెడ్డుకొస్తున్న నియంత్రికలు
[ 26-04-2024]
జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి. -
రెఫరీగా మారి.. ప్రచారం చేసి!
[ 26-04-2024]
సిరికొండ మండలం వాయిపేట్, రాజన్పేట్, చెమ్మన్గూడ తదితర గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గురువారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. -
సివిల్స్ ర్యాంకర్కు గవర్నర్ సన్మానం
[ 26-04-2024]
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 790 ర్యాంకు సాధించిన రేకులవార్ శుభంతో పాటు వారి తల్లిదండ్రులు జీవిత, సత్యనారాయణలను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సన్మానించారు. -
పేదలకు అండగా.. గిరిజన క్యాంటిన్
[ 26-04-2024]
టీ తాగాలన్నా కనీసం రూ.6 వెచ్చించాల్సిందే. అలాంటి పరిస్థితిలో కేవలం రూ.5 లకే అందిస్తున్న భోజనం ఉట్నూరువాసుల కడుపు నింపుతోంది. ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ను ఆదుకునేందుకు ఐటీడీఏ అధికారులు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. -
రిమ్స్ సంచాలకుడిని బ్లాక్మెయిల్ చేసే యత్నం
[ 26-04-2024]
తాను స్పెషల్ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్ సంచాలకుడు రాఠోడ్ జైసింÞ్ను, గజానంద్ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్ నుగుర్వార్ను బ్లాక్ మెయిల్ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
[ 26-04-2024]
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. -
జేఈఈ మెయిన్స్లో గిరిజన విద్యార్థిని ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. -
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం