పట్టణ వనాలపై పట్టింపు శూన్యం
జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోని 80 వార్డుల్లో 52 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా రూ.లక్షల నిధులు వ్యయం చేస్తున్నా నిర్వహణ లేకపోవడంతో అందులోని నాటిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి.
నిర్మల్-భైంసా, న్యూస్టుడే: జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోని 80 వార్డుల్లో 52 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా రూ.లక్షల నిధులు వ్యయం చేస్తున్నా నిర్వహణ లేకపోవడంతో అందులోని నాటిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. చాలా చోట్ల మొక్కలు కనిపించకుండా పోయాయి. వాటిల్లో ఏర్పాటుచేసిన ఆట వస్తువులు పనికిరాకుండా తప్పుపడుతున్నాయి. ఈ మూడు పట్టణాల్లో ఏర్పాటుచేసిన పట్టణ ప్రకృతి వనాలపై గురువారం ‘న్యూస్టుడే’ బృందం పరిశీలన చేపట్టింది. ఎక్కడా కూడా ఈ వనాల్లో పచ్చదనం కనిపించడం లేదు. కొన్ని చోట్ల మోడు వారిన మొక్కలు, మరికొన్ని ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు కనిపిస్తుండగా ఇంకొన్ని మొక్కలు లేక మైదానాలు తలపిస్తున్నాయి.
కరవైన నిర్వహణ
పట్టణాల్లోని ప్రజలకు ఆహ్లాదం పంచడానికి ప్రతి వార్డుల్లో ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాటిల్లో మొక్కలు నాటడంతోపాటు పచ్చదనం ఉట్టిపడేలా గడ్డి పెంచారు. రక్షణగా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా ఆట వస్తువులు సమకూర్చారు. కొన్నాళ్లు పట్టణ వాసులకు ఆహ్లాదం పంచిన ఈ ప్రకృతి వనాలపై మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వహణను మరిచారు. ఎక్కడికక్కడ మొక్కలు ఎండిపోయాయి. అందులో ఏర్పాటుచేసిన ఆట వస్తువులన్నీ దెబ్బతిని పనికిరాకుండా పోతున్నాయి. ఇప్పటికైనా వీటిని వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
ఎండుతున్న మొక్కలు
జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్లో ఏర్పాటుచేసిన పట్టణ ప్రకృతి వనం ఆరంభంలో పచ్చదనంతో కనువిందు చేసింది. రూ. 2.50 లక్షలతో అలంకరణ, పూల మొక్కలు, నడవడానికి పచ్చిక ఏర్పాటు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అక్కడ బోరు వేసి నిత్యం ఈ మొక్కలకు నీరందించడంతో ఆహ్లాదకర వాతావరణం కనిపించింది. ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటు చేయడంతో సాయంత్రం సమయంలో చిన్నారులతో సందడిగా కనిపించేది. ఇప్పుడు మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ కరవైంది. బోరు మోటారు పనిచేయడం లేదు. మొక్కలకు నీరందించక ఎండిపోతున్నాయి. ఆట వస్తువులు పనికిరాకుండా పోయాయి. ఇలా పట్టణంలో మిగతా 19 ప్రాంతాల్లోనూ ఏర్పాటుచేసిన పట్టణ వనాల పరిస్థితి ఇలాగే ఉంది.
ఇక్కడ మాయం
మైదానాన్ని తలపిస్తున్న పట్టణ ప్రకృతి వనం
ఖానాపూర్ పట్టణం శ్రీరానగర్ కాలనీ సమీపంలో గోదావరి చెంత ఎల్లమ్మ ఆలయ వెనుక ప్రాంతంలో ఏర్పాటుచేసిన పట్టణ ప్రకృతి వనంలో మొక్కలన్నీ మాయమయ్యాయి. ఆరంభంలో మొక్కలు నాటి రక్షణ కోసం చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వాటి సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అక్కడున్న మొక్కలన్నీ ఎండి కనిపించకుండా పోయాయి. ఫెన్సింగ్ కూడా దెబ్బతింటోంది. పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన పట్టణ ప్రకృతి వనం కొంత మేరకు బాగుంది. ఇక్కడ నాటిన మొక్కలను కాపాడటంతో చెట్లుగా మారి పచ్చదనం కనిపిస్తోంది.
ఇదీ ప్రకృతి వనమేనట
భైంసా పట్టణంలోని 14వ వార్డులో జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను ఆనుకుని పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. 10శ్రీ20 అడుగుల స్థలంలో వంద మొక్కలు నాటినా ఒక్కటీ కనిపించడం లేదు. ఇందులో పిచ్చిమొక్కలు పెరిగాయి. 11వ వార్డుకు సంబంధించి ప్రకృతి వనంలో నాలుగు చెట్లు పెరిగాయి. కేవలం రెండు సిమెంటు బెంచీలు వేసి వదిలేశారు. ఇక్కడ కూడా నాటిన మొక్కలు కనిపించడం లేదు. నిర్వహణ లేకపోవడంతో అంతటా పిచ్చిగడ్డి పెరిగింది. రూ. లక్షల వ్యయం చేసి ఏర్పాటుచేసిన ఈ పట్టణ ప్రకృతి వనంపై మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉపయోగంలో లేకుండా పోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమాలకే ప్రా‘ధాన్యం’?
[ 28-04-2024]
ఎక్కడ ముడిసరకు లభ్యమవుతుందో సాధారణంగా అక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ధాన్యం ఆశించిన రీతిలో పండకున్నా ఇక్కడ ఏకంగా తొమ్మిది రైస్ మిల్లులు ఏర్పాటయ్యాయి. -
భాజపా బలగాల మోహరింపు
[ 28-04-2024]
ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేలా భాజపా కార్యాచరణ చేపట్టింది. -
మండుటెండల్లో అంటుకుంటున్న అడవులు
[ 28-04-2024]
జిల్లాలో గతంకంటే ఈ ఏడాది ఎండల తీవ్రత అత్యధికంగా ఉండి ఉదయం పది గంటలకే ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. -
వంద ఎకరాలు కొట్టేసే పన్నాగం
[ 28-04-2024]
‘వడ్డించే వాడు మనవాడైతే చివర్లో కూర్చున్నా కంచంలోకి అన్నీ వచ్చి చేరుతాయి’ అన్న చందంగా అధికారులు, నేతలు కుమ్మక్కై వంద ఎకరాల భూమిని ఆక్రమించే ప్రయత్నం సాగుతోంది. -
నిధులు రాక.. నిర్వహణ లేక
[ 28-04-2024]
రైతులకు పండ్ల తోటల పెంపకంపై శిక్షణ ఇవ్వడం, మొక్కల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన ఉద్యానవన నర్సరీ, రైతు శిక్షణ కేంద్రాలు నిర్వహణ లోపంతో మూతపడే దశకు చేరుకున్నాయి. -
ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 28-04-2024]
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కార్యకర్తలకు సూచించారు. -
నేర ప్రవృత్తి మార్చుకోవాలి : ఎస్పీ
[ 28-04-2024]
జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె.సురేష్కుమార్ తెలిపారు. -
ఓటర్లు @ 15,96,430
[ 28-04-2024]
మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్టుడే: ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా కొలిక్కివచ్చింది. -
సిబ్బంది కొరత.. వసతుల లేమి
[ 28-04-2024]
జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత, వసతుల లేమితో సరైన సేవలు అందక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ను గెలిపించాలి
[ 28-04-2024]
మనిషికి చేతులు ఎంతముఖ్యమో.. దేశానికి చేతిగుర్తు పార్టీ అవసరం అంతే ఉందని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ కోరారు. -
అవగాహన లేక.. అనుమతి పొందక..!
[ 28-04-2024]
పెళ్లి.. రిసెప్షన్.. పుట్టినరోజు.. ఇలా వేడుకేదైనా చాలామంది ఎంతో ఆర్భాటంగా నిర్వహించాలనుకుంటున్నారు. -
నీతి ఆయోగ్ పథకం.. అమలైతే అభివృద్ధి యోగం
[ 28-04-2024]
మారుమూల గిరిజన ప్రాంతమైన పెంబి మండలం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. కనీస వసతులు, రవాణా సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనేకం. -
గుంపులున్న చోటుపై గురి..
[ 28-04-2024]
ఎన్నికల ప్రచారానికి మరో 14 రోజులు మాత్రమే గడువుంది. లోక్సభ పరిధిలో రెండు వేలకు పైగా గ్రామాలు, 380కి పైగా గూడేలు, తండాలు ఉన్నాయి. -
పెద్దపల్లిలో స్థానికేతరులకే పెద్దపీట
[ 28-04-2024]
పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ఎంపీలుగా ఎన్నికైనవారిలో ఇప్పటి వరకు స్థానికులెవరూ విజయం సాధించలేకపోయారు. -
మండే ఎండతో జాగ్రత్త..
[ 28-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆరెంజ్ జోన్లో ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. -
తూర్పున ఎంపీ.. పశ్చిమాన అభ్యర్థి
[ 28-04-2024]
జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామం మరోసారి తెరపైకి వచ్చింది. -
వేసవి తాపం.. కొబ్బరినీరే ఉపశమనం
[ 28-04-2024]
రామకృష్ణాపూర్లోని ఆర్కేపీ ఓసీ, సీహెచ్పీ, సింగరేణి ఏరియా ఆసుపత్రితో పాటు కాలనీల్లో భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్