సిబ్బంది కొరత.. వసతుల లేమి
జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత, వసతుల లేమితో సరైన సేవలు అందక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లా రవాణాశాఖ కార్యాలయం దుస్థితి
లైసెన్సుల కోసం వరుసలో నిల్చున్న వాహనచోదకులు
హాజీపూర్, న్యూస్టుడే: జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత, వసతుల లేమితో సరైన సేవలు అందక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండుతున్న ఎండలకు కార్యాలయం సిబ్బంది, వాహనదారులు అనేక అవస్థలు పడుతున్నారు. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లా రవాణాశాఖ కార్యాలయంలోని సమస్యలపై ‘న్యూస్టుడే’ కథనం.
జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత వాహనదారులకు అందించే సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కార్డులు ముద్రించేందుకు తగినంత సిబ్బంది కరవయ్యారు. లక్షల ఆదాయం సమకూరే కార్యాలయంలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముగ్గురు ఎంవీఐలు, ఓ ఏఎంవీఐ ఉన్నారు. జిల్లా రవాణాశాఖ అధికారిని నియమించకపోవడంతో ఇన్ఛార్జితోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే క్రమంలో స్థానికంగా వాహనాల తనిఖీల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్యాలయంలో అన్ని పనులు అటెండర్లు, హోంగార్డులే చేస్తున్నారు. సిబ్బంది కొరతపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినప్పటికీ ఫలితం కానరావడం లేదు. కార్డుల పంపిణీ, ముద్రణలో తీవ్ర జాప్యం ఏర్పడుతుంది. సకాలంలో కార్డులు అందకపోవడంతో జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్యాలయ ఆవరణలో ఎండ వేడిమిని తట్టుకునేందుకు ఓ చెట్టుకింద నిలిపిన వాహనం
వసతుల కల్పనలోనూ నిర్లక్ష్యమే...
జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి నిత్యం వందలాది మంది వస్తుంటారు. వీరందరికీ సరిపడా మరుగుదొడ్లు, తాగునీరు, నీడ వసతులు లేవు. మహిళల ఇబ్బందులు వర్ణనాతీతం. కొద్దిపాటి వర్షం కురిసినా కార్యాలయ ఆవరణంతా బురదతో నిండిపోతోంది. వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్లు, డ్రైవింగ్ పరీక్షలు బురదలోనే చేస్తుంటారు. వాహనదారులు రోజంతా చెట్ల నీడలో సేద తీరుతున్నారు. నామమాత్రంగా ఓ రేకుల షెడ్డు వేసినప్పటికీ పూర్తిస్థాయిలో ఉపయోగపడడం లేదు. దీనికి తోడు సర్వర్ సాంకేతిక సమస్యలు పలుమార్లు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
సేవలు అందేలా కృషి చేస్తాం
సంతోష్కుమార్, ఇన్ఛార్జి జిల్లా రవాణాశాఖ అధికారి, మంచిర్యాల
వేసవిలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా అవసరమైన వసతులు కల్పిస్తున్నాం. తాగునీరు ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఎన్నికల కారణంగా సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో కొంతమేరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ఎలాంటి జాప్యం లేకుండా సేవలు అందేలా కృషిచేస్తున్నాం.
జిల్లాలోని వాహనాలు, ఫీజుల వివరాలివే...
మొత్తం వాహనాలు: 2.46 లక్షలు
రిజిస్ట్రేషన్లు (రోజుకు): 30
లైసెన్సులు: 40 ఫిట్నెస్లు: 25
రోజువారీ ఆదాయం పన్నులు, ఫీజుల ద్వారా : రూ. 2.3 కోట్లు (సుమారుగా)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ సర్పంచులు కాంగ్రెస్లో చేరిక
[ 10-05-2024]
తాంసి మండలం జామిడి, బండల్ నాగాపూర్ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
బంగారం దుకాణాల్లో సందడి
[ 10-05-2024]
అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని బంగారం దుకాణాల్లో వినియోగదారుల సందడి నెలకొంది. -
పండగ రోజులా భావించి ఓటేసేందుకు రండి
[ 10-05-2024]
‘ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. కోరుకున్న ప్రభుత్వ విధానాలు అమలు కావాలన్నా.. నచ్చిన ప్రభుత్వం ఏర్పడాలన్నా ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. -
మోసగించే పార్టీలకు బుద్ధి చెప్పాలి
[ 10-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం బాగుపడ్డదా..తెలంగాణ అప్పుడెట్లుండే. ఇప్పుడెట్లైంది.. కేసీఆర్ ఆనాడే అన్నారు కాంగ్రెస్, భాజపాల మాటలకు మోసపోతే గోసపడుతారని, ఇప్పుడు 5 నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింద’ని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. -
గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం
[ 10-05-2024]
పదేళ్లు అధికారంలో ఉన్న భారాస, భాజపాలు జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. -
సరిహద్దుపై నజర్
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించింది. ఎన్నికలు సజావుగా సాగేలా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. -
బాధ్యతగా ఓటేద్దాం
[ 10-05-2024]
ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ఓటు హక్కును ప్రతి ఓటరు వినియోగించుకోవాలి. అప్పుడే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. -
గిరిజన కోటలో.. గిరిజనేతరుల ఓట్లే కీలకం
[ 10-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపులో గిరిజనులతో పాటు గిరిజనేతరుల ఓట్లు కీలకంగా మారాయి. -
ఓటరు చీటీ అందలేదా.. ఇలా తెలుసుకోండి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఓటరుకు సంబంధించి ఓటరు చీటీలను ఇంటింటా బీఎల్వోల సాయంతో పంపిణీ చేస్తున్నారు. -
ఎంపీగా గెలిచిన వారికి వసతులు బోలెడు
[ 10-05-2024]
ఎంపీగా గెలిచిన వారికి కేంద్ర ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తోంది. -
గ్రామస్థులను పలకరించి... కన్నీళ్లు పెట్టుకొని
[ 10-05-2024]
‘పార్టీలను పక్కన పెట్టి మీ ఊరి బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. ఈ గ్రామంలో పేరుకు పోయిన సమస్యలను పరిష్కరిస్తాను. -
ఓటు వేయడం.. బాద్యతగా భావిద్దాం
[ 10-05-2024]
జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 13న నిర్వహించనున్న ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. -
ఉద్ధృతంగా ఇంటింటి ప్రచారం
[ 10-05-2024]
ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలు కీలక నేతలు తమ ప్రచారపంథాను పూర్తిగా మార్చివేశారు. -
ప్రత్యేక కేంద్రం.. శతశాతం లక్ష్యం
[ 10-05-2024]
ప్రజాస్వామ్యంలో మంచి పాలకులను ఎన్నుకోవడానికి ఓటు హక్కు వజ్రాయుధం. ఇందుకోసం ఇప్పటికే జిల్లా అధికారులు ఓటరు నమోదు శాతం పెంపునకు కళాజాత బృందాలతో ప్రదర్శనలు, 2కే రన్, విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. -
ఇక రెండు రోజులే..
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మూడు రోజులు మాత్రమే గడువు ఉండగా.. ప్రచారం శనివారం సాయంత్రానికే పరిసమాప్తం కానుంది. -
అనుమతి ఒకటి.. చేసేది మరొకటి!
[ 10-05-2024]
రహదారి నిర్మాణం కోసం అవసరమైన మొరం కోసం అనుమతులు తీసుకుని యథేచ్ఛగా వెంచర్లకు లారీల్లో మొరం తరలిస్తున్న ఉదంతం ఇది. -
ఫోన్ చేయండి.. కథలు వినండి!
[ 10-05-2024]
కథల పుస్తకాలు చదవడం ద్వారా పిల్లల్లో జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని పెంపొందించవచ్చని మండల విద్యాధికారి ఎం.వెంకటేశ్వరస్వామి అన్నారు. -
చరవాణికి బానిసై విద్యార్థి ఆత్మహత్య
[ 10-05-2024]
చరవాణికి బానిసైన తొమ్మిదో తరగతి విద్యార్థి (17) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామంలో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం