అపురూపం.. చరిత్రకు సాక్ష్యం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అపారమైన చారిత్రక వైభవాన్ని కలిగి ఉంది. అద్భుతమైన ఆలయాలు, జాలువారే జలపాతాలకు నిలయంగా ఉంది. ఊహకందని రీతిలో వందల సంవత్సరాల కిందటే నిర్మించిన అబ్బురపరిచే శిల్పసంపద, గత వైభవానికి చిహ్నంగా కోటలు దర్శనమిస్తాయి.
ప్రభుత్వం పట్టించుకుంటేనే ఆనవాళ్లకు రక్షణ
నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం
న్యూస్టుడే, ఆదిలాబాద్ వ్యవసాయం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అపారమైన చారిత్రక వైభవాన్ని కలిగి ఉంది. అద్భుతమైన ఆలయాలు, జాలువారే జలపాతాలకు నిలయంగా ఉంది. ఊహకందని రీతిలో వందల సంవత్సరాల కిందటే నిర్మించిన అబ్బురపరిచే శిల్పసంపద, గత వైభవానికి చిహ్నంగా కోటలు దర్శనమిస్తాయి. ఇవన్నీ వారసత్వంగా లభించిన సంపదలు. కానీ అవి శిథిలావస్థలో, ఆక్రమణలకు గురై, ఆదరణకు నోచుకోక నిర్లక్ష్యంగా ఉన్నాయి. వీటిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. గత వైభవానికి చిహ్నంగా ఉండే కట్టడాలను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దితే భావితరాలు గత చరిత్రను ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగించిన వారమవుతాం. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వారసత్వ సంపదపై ప్రత్యేక కథనం.
కమిటీ లేదు.. కనీస రక్షణ కరవు
వందల ఏళ్ల నాటి వారసత్వ సంపదను పరిరక్షించేందుకు వీలుగా గత ప్రభుత్వం రాష్ట్ర వారసత్వపు(రక్షణ, పరిరక్షణ, సంరక్షణ, నిర్వహణ) సంపద బిల్లు-2017ను అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు వేసి పరిరక్షణకు కృషి చేయాల్సి ఉంటుంది. జిల్లా పాలనాధికారి ఛైర్మన్గా వారసత్వ కమిటీలు వేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు చర్యలే లేవు. పురాతన ప్రదేశాల్లో గుప్త నిధులు ఉంటాయనే భావనతో అనేక ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాలతో మందమర్రిలోని గాంధారి కోట, నిర్మల్ ప్రాంతంలోని నిమ్మరాజులు నిర్మించిన బత్తీస్గడ్, శ్యాంగడ్, వంగల్పేట్ దర్వాజా ప్రాంతాలు తవ్వకాలతో ఆనవాళ్లు కోల్పోతున్నాయి.
- ఆదిలాబాద్ జిల్లాలో జైనథ్ ఆలయం, బేల మండలం సదల్పూర్లోని భైరాందేవ్ ఆలయం, ఇచ్చోడ మండలం సిరిచెల్మ ఆలయం, నేరడిగొండ మండలం వడూర్లో కోట, ఉట్నూరులోని విఠలేశ్వర మందిరం, గోండుల కోట, మెట్లబావి ఆనాటి వారసత్వ సంపదే. సహజ సిద్ధమైన కుంటాల, పొచ్చరతో పాటు మరో ఏడు జలపాతాలు అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి.
- నిర్మల్ జిల్లాలో భైంసా, దిలావర్పూర్, ముథోల్ తదితర ప్రాంతాల్లో ఉన్న పురాతన ఆలయాలు శిథిలమయ్యాయి. ఆనాటి రాజులు నిర్మించినట్లు చెబుతున్న శ్యామ్గడ్, సోన్గడ్, నిర్మల్ దుర్గం, బత్తీస్గడ్ కోటలు నిర్మల్ జిల్లాలో ఉన్నాయి. బాసర అమ్మవారి ఆలయం, ఆకాశ దీపస్తంభం, శిథిలమైన పాపేశ్వరాలయం, ఖానాపూర్లోని రాజుల కోటను వారసత్వ సంపదగా పురావస్తుశాఖ గుర్తించింది.
- మంచిర్యాల జిల్లాలో తాండూర్ కోట, బురుజు, మందమర్రి మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ శివారంలో గాంధారి ఖిల్లా ఉంది. తాండూర్లో కోట, బురుజులు శిథిలమవుతున్నాయి. చెన్నూరులోని కుందారంలో త్రికూటేశ్వరాలయంలో కాకతి కుందవాంబ వేయించిన శిలాశాసనం ఉంది.
- కుమురం భీం జిల్లా సమీపంలో పారేశ్వర్లోని రాతికట్టడాలు, వృక్షశిలాజాలు ఇప్పటికీ ఉన్నాయి. వాంకిడిలోని గంగాపూర్లోని పురాతన వేంకటేశ్వర ఆలయం, సిర్పూర్(టి)లోని కోట ఎన్నో సంవత్సరాల కిందట ఆసిఫాబాద్, వాంకిడిలోని శివ మందిరాలు నిర్మించారు.
నిధులు మంజూరైనా నిర్లక్ష్యమే..
ప్రాచీన సంపదను పరిరక్షించేందుకు, పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేసినా.. సకాలంలో పనులు చేయలేదు. కుంటాల జలపాతంలో సౌకర్యాలు, హోటల్, పర్యాటకులు ఉండేందుకు వీలుగా గదులు, రక్షణ చర్యలకు రూ.3.81 కోట్లు మంజూరు చేశారు. ఉట్నూరులోని కోట, మెట్లబావి, తదితర వాటితోపాటు మ్యూజియం ఏర్పాటుకు రూ.3.92 కోట్లు, కుమురంభీం జిల్లాలోని సప్తగుండాల జలపాతం సమీపంలో రోప్వే, వ్యూపాయింట్, ఫెన్సింగ్ తదితర వాటి నిర్మాణానికి రూ.1.35 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల్లో పురోగతి లేదు. జైనథ్ ఆలయాభివృద్ధికి రూ.1.10 లక్షలు నిధులు మంజూరు కాగా పనులు పూర్తి చేయలేదు. మధ్యలో ఆపేశారు.
ఉట్నూరులో గోండు రాజుల కోట పూర్తిగా రాతితో నిర్మించారు. చుట్టూ కందకం తవ్వి ఉంది. కోట లోపల కోనేరు, రాజాంతపురం, కోట ద్వారాలు, ఫిరంగి ఆనాటి వైభవానికి చిహ్నంగా ఉన్నాయి. దేవగిరి రాజుల సామంతులుగా గోండు రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో నిర్మించిన విఠలేశ్వర ఆలయం ఉట్నూరులో ఉంది. సమీపంలో కోనేరు ఉంది. రాతితో మెట్లతో నిర్మించారు. గోండు రాజుల వైభవానికి గుర్తుగా ఉన్న ఈ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
శ్రీ జైనథ్ లక్ష్మీనారాయణ ఆలయం అత్యంత ప్రాచీనాలయాల్లో ఒకటి. శాతవాహనుల కాలం నాటిదని చెబుతారు. దేవనాగర లిపిలో సూర్యుని స్తుతిస్తూ శ్లోకాలతో ఉన్న శిలాఫలకం ఉంది. ఆలయం ఎదుట పెద్ద చెరువు ఉంది. చెరువు మధ్యలో డోలారోహణ మండపంతోపాటు సమీపంలో మరి కొన్ని ఆలయాలు శిథిలమై ఉన్నాయి. ఆలయాన్ని పూర్తి స్థాయిలో బాగు చేస్తే పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా మారే అవకాశం ఉంది.
నేరడిగొండ మండలం వడూర్ చారిత్రక ప్రసిద్ధి చెందిన గ్రామం. ఇక్కడ నిర్మించిన గిరిదుర్గ పురాతనమైనది. ఇప్పటి వడూర్, రాజుల కాలంలో వైడూర్యపురంగా పేరు పొందింది. గోండు రాజులు, మహారాష్ట్ర పీష్వాల ప్రతినిధులకు, నిజాంషాహితోపాటు గోలకొండ రాజులకు కేంద్రంగా వడూర్ దుర్గం ఉంది. ఫిరంగులు, అంతఃపురాలు, ధాన్యాగారాలు, ప్రాకారకుడ్యాలు శిథిలరూపంలో ఉన్నాయి. వాటిని సంరక్షించకపోవడం, ప్రభుత్వాలు పట్టించుకోక కొన్నేళ్ల తర్వాత వాటి ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోయే అవకాశం ఉంది.
శ్రీ సిర్పూరును పూర్వం సూర్యపురం అని పిలిచేవారు. గోండురాజు బల్లాల్షా సిర్పూర్ను రాజధానిగా చేసుకుని పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ కోటను నిర్మించారు. ఇప్పుడు ఆ కోట మొత్తాన్ని ఆక్రమించారు. కోటను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే, గత చారిత్రక వైభవాన్ని పరిరక్షించడంతోపాటు అప్పటి చరిత్రను, ఆనాటి కట్టడాలను భవిష్యత్తుతరాలకు అందించినట్లు అవుతుంది.
ఈ రోజే ఎందుకు
ప్రపంచ దేశాలలోని వారసత్వ సంపద పరిరక్షణ అనే అంశంపై ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆఫ్రికాలోని ట్యూనిషియాలో 1982 ఏప్రిల్ 18న సమావేశం నిర్వహించారు. వారసత్వ సంపదను పరిరక్షించాలనే ఆలోచనతో సమావేశం జరిగిన రోజును ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ప్రకటించారు. వారసత్వ కట్టడాలపై ప్రజలను అవగాహన కలిగించడంతోపాటు వాటి పరిరక్షణకు తోడ్పడాలని నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
[ 30-04-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పరల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ రావు
[ 30-04-2024]
అదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ప్రభాకర్ రావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. -
లాండ్రీకి తీరిన నీటి సమస్య
[ 30-04-2024]
రిమ్స్లో నిర్వహిస్తున్న ల్యాండ్రీకి నేడు సమస్య పరిష్కారమైంది. -
సాహిత్య సదస్సుపై దాడి ముమ్మాటికీ ఉన్మాద చర్యే
[ 30-04-2024]
ఇటీవల వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 'లౌకిక విలువలు- సాహిత్యం' అనే సదస్సులో చొరబడి ఫాసిస్ట్ మూకలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ పేర్కొన్నారు. -
వ్యాను బోల్తా పడి.. 20 మందికి గాయాలు
[ 30-04-2024]
గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాను బోల్తాపడడంతో 20 మందికి గాయాలయ్యాయి. -
భారాస ఇంటింటి ప్రచారం
[ 30-04-2024]
తాంసి మండలం పాలోది, జామిడి గ్రామాల్లో మంగళవారం భారాస నాయకులు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అగ్రనేతలొస్తున్నారు
[ 30-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. -
కాంగ్రెస్కు ఓటేస్తే భవిష్యత్తుకు లేదు గ్యారెంటీ!
[ 30-04-2024]
హస్తం పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని, ఉచిత పథకాలు ఉత్తి మాటలేనని భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. -
పెరుగుతున్న ఎండ.. వసతులుంటేనే అండ
[ 30-04-2024]
రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా లోక్సభ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. -
దురాశకు పోయి.. దుఃఖానికి చేరువై
[ 30-04-2024]
ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం. -
చోదకుల నిర్లక్ష్యం.. గాలిలో ప్రాణాలు
[ 30-04-2024]
కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. -
ప్రజాప్రతినిధుల తీరు.. నాయకుల బేజారు
[ 30-04-2024]
జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. -
భారాసను గెలిపిస్తేనే హామీల అమలు
[ 30-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారాసను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ స్థానం భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
భాజపాకు కలిసొచ్చేనా?
[ 30-04-2024]
పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత పార్టీ మార్పు ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. -
ధనార్జనే ధ్యేయం.. వైద్యం ప్రాణాంతకం
[ 30-04-2024]
రెండ్రోజుల కిందట కాగజ్నగర్లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నిబంధనలకు లోబడి ఎన్నికల విధుల నిర్వహణ
[ 30-04-2024]
లోకసభ ఎన్నికల్లో భాగంగా సిర్పూరు, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు లోబడి సమర్థంగా నిర్వహించాలని ఆదిలాబాద్ పార్లమెంటు -
ఆదిలాబాద్ బరిలో 12 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. నామపత్రాల పరిశీలన అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
కొనసాగుతున్న సార్వత్రిక పరీక్షలు
[ 30-04-2024]
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది.