రాయితీ.. పక్కదారి!
జిల్లాలోని రెండు పురపాలికలు, పలు మండలాలు వ్యాపార, వాణిజ్యపరంగా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి. పారిశ్రామికంగా కాగజ్నగర్తోపాటు పరిసర ప్రాంతాల్లో హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పలు గ్యాస్తో నడిచే ఆటోలు, కార్లు ఎక్కువగా ఉన్నాయి.
గృహావసరాల సిలిండర్లు వ్యాపారానికి వినియోగిస్తున్న వైనం..
కాగజ్నగర్, న్యూస్టుడే: జిల్లాలోని రెండు పురపాలికలు, పలు మండలాలు వ్యాపార, వాణిజ్యపరంగా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి. పారిశ్రామికంగా కాగజ్నగర్తోపాటు పరిసర ప్రాంతాల్లో హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పలు గ్యాస్తో నడిచే ఆటోలు, కార్లు ఎక్కువగా ఉన్నాయి. వాటి వినియోగానికి నిబంధనల ప్రకారం.. వాణిజ్య సిలిండర్లను వినియోగించాలి. కానీ పలువురు గుట్టుచప్పుడు కాకుండా రాయితీ గృహావసరాల సిలిండర్లను వాడుతుండటంతో.. రాయితీ పక్కదారి పడుతోంది. దీంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500లకే సిలిండర్ ఇస్తుండటంతో.. మార్కెట్లో విచ్చలవిడిగా వీటినే వాడుతున్నారు. దీంతో గృహావసరాల వారికి కొరత ఏర్పడే పరిస్థితి నెలకొంది.
జిల్లాలోని ఏజెన్సీల్లో దాదాపు లక్షన్నరవరకు గృహావసర కనెక్షన్లు ఉన్నాయి. నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నవారికి ఏడాదికి దాదాపు ఆరు సిలిండర్ల వరకు వినియోగిస్తుంటారు. జిల్లాలోని ఏజెన్సీ, మారుమూల మండలాల్లో ఎక్కువగా ఇప్పటికీ వంట చెరుకునే వాడుతున్నారు. పొదువుగా వినియోగించే, వంట చెరుకు వినియోగించే వారి సిలిండర్లను దళారులు ఎంతో కొంత మొత్తానికి కొనుగోలు చేసి వాటిని రిఫిల్లింగ్ చేస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. డొమెస్టిక్ సిలిండర్ రిఫిల్లింగ్ చేస్తే కిలోకు రూ.63, కమర్షియల్ అయితే రూ.115 వరకు చెల్లిస్తున్నారు. సదరు వ్యాపారులు వాణిజ్య సిలిండర్లకు బదులుగా ఇళ్లలో వాడే వాటిని వినియోగిస్తూ పెద్ద మొత్తంలో దళారులు లాభాలు గడిస్తున్నారు.
పనిచేసే వారే సూత్రధారులు..
గ్యాస్ ఏజెన్సీల్లో పని చేసే పలువురు ఉద్యోగులే సూత్రధారులుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఏజెన్సీ నిర్వాహకులకు ఈ విషయం తెలియకపోవడంతో.. ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇటీవల కాగజ్నగర్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు దాదాపు 24 గృహావసర సిలిండర్లను వినియోగిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఏజెన్సీల నిర్వాహకులకు తెలియకుండానే అందులో పనిచేసే వారే ఇదంతా చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. యథేచ్ఛగా సాగుతున్నా అరికట్టాల్సిన అధికారులు ‘మామూలు’గానే వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు ఇలా ఎక్కడ పడితే అక్కడే వినియోగిస్తున్నా.. చర్యలు తీసుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులు రాయితీ సిలిండర్లను దుర్వినియోగం కాకుండా నిత్యం నిఘా పెట్టి అర్హులకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
అధికారులు స్వాధీనం చేసుకున్న రాయితీ సిలిండర్లు
జనవరి 20వ తేదీన కాగజ్నగర్ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రైవేటు గ్యాస్ దుకాణాలపై ఎన్ఫోర్సుమెంట్, రెవెన్యూ అధికారులు దాడులు చేయగా.. 24 రాయితీ సిలిండర్లు లభించాయి. రాయితీ సిలిండర్లను వ్యాపారానికి వినియోగిస్తున్నట్లు విచారణలో తేలింది. ముగ్గురు వ్యాపారులపై కేసు నమోదు చేసి, సిలిండర్లను స్వాధీనపర్చుకున్నారు. ముందస్తు ఫిర్యాదులు వస్తేనే అధికారులు తనిఖీలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షణ లేక గృహావసర సిలిండర్లను వాణిజ్యానికి వినియోగిస్తూ రాయితీని దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పలు ఆటోలు, కార్లు గ్యాస్తో నడుస్తుండగా.. పట్టణంలోని పెట్రోల్పంపు, మార్కెట్ ఏరియాల్లో ఉన్న దుకాణాల్లో రాయితీ సిలిండర్లనే వాడుతున్నట్లు తెలిసింది.
జిల్లా వివరాలు..
మొత్తం ఏజెన్సీలు : 12
గృహావసర కనెక్షన్లు : 1,30,076
ఉజ్వల : 12,512
వాణిజ్య కనెక్షన్లు : సుమారు 2 వేలు
గృహావసర సిలిండర్ ధర: రూ. 880
వాణిజ్యం: రూ. 2,020
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
[ 30-04-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పరల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ రావు
[ 30-04-2024]
అదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ప్రభాకర్ రావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. -
లాండ్రీకి తీరిన నీటి సమస్య
[ 30-04-2024]
రిమ్స్లో నిర్వహిస్తున్న ల్యాండ్రీకి నేడు సమస్య పరిష్కారమైంది. -
సాహిత్య సదస్సుపై దాడి ముమ్మాటికీ ఉన్మాద చర్యే
[ 30-04-2024]
ఇటీవల వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 'లౌకిక విలువలు- సాహిత్యం' అనే సదస్సులో చొరబడి ఫాసిస్ట్ మూకలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ పేర్కొన్నారు. -
వ్యాను బోల్తా పడి.. 20 మందికి గాయాలు
[ 30-04-2024]
గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాను బోల్తాపడడంతో 20 మందికి గాయాలయ్యాయి. -
భారాస ఇంటింటి ప్రచారం
[ 30-04-2024]
తాంసి మండలం పాలోది, జామిడి గ్రామాల్లో మంగళవారం భారాస నాయకులు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అగ్రనేతలొస్తున్నారు
[ 30-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. -
కాంగ్రెస్కు ఓటేస్తే భవిష్యత్తుకు లేదు గ్యారెంటీ!
[ 30-04-2024]
హస్తం పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని, ఉచిత పథకాలు ఉత్తి మాటలేనని భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. -
పెరుగుతున్న ఎండ.. వసతులుంటేనే అండ
[ 30-04-2024]
రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా లోక్సభ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. -
దురాశకు పోయి.. దుఃఖానికి చేరువై
[ 30-04-2024]
ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం. -
చోదకుల నిర్లక్ష్యం.. గాలిలో ప్రాణాలు
[ 30-04-2024]
కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. -
ప్రజాప్రతినిధుల తీరు.. నాయకుల బేజారు
[ 30-04-2024]
జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. -
భారాసను గెలిపిస్తేనే హామీల అమలు
[ 30-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారాసను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ స్థానం భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
భాజపాకు కలిసొచ్చేనా?
[ 30-04-2024]
పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత పార్టీ మార్పు ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. -
ధనార్జనే ధ్యేయం.. వైద్యం ప్రాణాంతకం
[ 30-04-2024]
రెండ్రోజుల కిందట కాగజ్నగర్లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నిబంధనలకు లోబడి ఎన్నికల విధుల నిర్వహణ
[ 30-04-2024]
లోకసభ ఎన్నికల్లో భాగంగా సిర్పూరు, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు లోబడి సమర్థంగా నిర్వహించాలని ఆదిలాబాద్ పార్లమెంటు -
ఆదిలాబాద్ బరిలో 12 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. నామపత్రాల పరిశీలన అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
కొనసాగుతున్న సార్వత్రిక పరీక్షలు
[ 30-04-2024]
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది.