ప్రాణం తీసిన పసరు మందు
నాటువైద్యం ఓ బాలుడి ప్రాణం తీసింది. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ బాలుడికి తల్లిదండ్రులు అవగాహన లోపంతో రోజు పసరు మందు పట్టారు. చివరకు పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే అపస్మారక
పసర మందు పట్టిన బాలుడికి పరీక్షిస్తున్న వైద్యురాలు హిమబిందు
నాటువైద్యం ఓ బాలుడి ప్రాణం తీసింది. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ బాలుడికి తల్లిదండ్రులు అవగాహన లోపంతో రోజు పసరు మందు పట్టారు. చివరకు పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
చింతపల్లి గ్రామీణం, న్యూస్టుడే: గూడెంకొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీ గొడుగుమామిడి గ్రామానికి చెందిన మూడో తరగతి విద్యార్థి వంతల వెంకట్ని కుటుంబ సభ్యులు తీవ్ర ఆనారోగ్యంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యాధికారి హిమబిందు పరీక్షలు నిర్వహించి, పసరు మందు పట్టినట్టు గుర్తించి తల్లిదండ్రులను ప్రశ్నించారు. వారం రోజులుగా జ్వరం వస్తుండటంతో స్థానికంగా లభించే పసరు మందులు పట్టామని, వ్యాధి తగ్గకపోవడంతో ఆసుపత్రికి తీసుకువచ్చామని తండ్రి కేశవరావు తెలిపారు. బాలుడు అప్పటికే అపస్మారక స్థితికి చేరాడు. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారి చొరవతో తల్లిదండ్రులు బాలుడిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి అంబులెన్సులో తీసుకువెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ రాత్రి తొమ్మిది గంటల సమయంలో బాలుడు మృతిచెందాడు. పసరు మందు పట్టడం పిల్లల ప్రాణాలకు ప్రమాదమని స్థానిక సామాజిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి హిమబిందు అన్నారు. ఆదివాసీలు నాటు వైద్యం, మూఢనమ్మకాలు విడిచిపెట్టాలని, వ్యాధి సోకిన వెంటనే ఆసుపత్రికి తీసుకురావాలన్నారు. విద్యార్థి వెంకట్కు వారంపాటు పసర మందులు పట్టడం వల్ల ఆరోగ్యం క్షీణించి ప్రాణంమీదకు వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిషేధమన్నావు.. నిషాలో ముంచావు!
[ 08-05-2024]
మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. మూడు దశల్లో మద్యం నిషేధిస్తాం. 2024 ఎన్నికల్లో ఓటడిగే సమయానికి మద్యం దుకాణాలే లేకుండా చేస్తాం. -
వైకాపాను తరిమికొడదాం
[ 08-05-2024]
వైకాపాను తరిమికొట్టి, తెదేపాను గద్దెనెక్కిద్దామని ఎన్డీఏ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. జి.మాడుగుల వారపు సంతలో కూటమి నాయకులు, కార్యకర్తలు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. -
జగన్కు పల్లకీ మోత.. గిరిజనులకు డోలీమోత
[ 08-05-2024]
మన్యంలో మరణమృదంగం మోగుతూనే ఉంది. కొండపై నివసించే గిరిజనుల బతుకులు తరచూ కొండెక్కిపోతున్నాయి. -
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
[ 08-05-2024]
చింతపల్లి నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం ప్రమాదానికి గురైంది. -
పోలవరం నిర్వాసితులను మోసంచేసిన వైకాపా
[ 08-05-2024]
కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అరకు ఎంపీ కూటమి అభ్యర్థిని కొత్తపల్లి గీత అన్నారు. -
సర్కారు తీరుతో పింఛను కష్టాలు
[ 08-05-2024]
ప్రతి నెలా ఒకటో తేదీన అందాల్సిన పింఛను రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఈ నెల ఏడో తేదీ వరకు అందలేదు. దీంతో వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. -
అంతకు మించి అన్నారు.. అలా వంచించారు!
[ 08-05-2024]
మత్స్యకారులు నా కుటుంబ సభ్యులు. వారి జీవితాలను బాగుచేస్తాం. వైకాపా అధికారంలోకొస్తే ఇంటికో ఉద్యోగం, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఏపీఐఐసీ పైపులైను పరిహారం చెల్లిస్తాం. -
జగన్ ప్రచార సభ వెలవెల
[ 08-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గాజువాక కూడలిలో నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభ పేలవంగా సాగింది. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీర్ దుర్మరణం
[ 08-05-2024]
బొలెరో వాహనం అదుపు తప్పి ఇంజినీర్ దుర్మరణం పాలైన ఘటన మంగళవారం హుకుంపేట మండలంలో చోటుచేసుకుంది. -
ఆదివాసీల ఐక్యతకు కృషిచేసేవారిని గెలిపించండి
[ 08-05-2024]
ఆదివాసీల హక్కులు, ఐక్యతకు కృషి చేసే ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారాట్ పేర్కొన్నారు. -
గందరగోళం.. పోస్టల్ బ్యాలెట్
[ 08-05-2024]
నాలుగు రోజులుగా ఇక్కడ నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. -
రాష్ట్రంలో వైకాపా నియంత పాలన
[ 08-05-2024]
రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు.