గురువుల బదిలీల్లో గందరగోళం
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది. పోస్టులు రద్దు, కొన్ని ఖాళీలను చూపకుండా బ్లాక్ చేయడం, దరఖాస్తుల అనంతరం అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో బదిలీల తీరుపై గురువులు అసంతృప్తితో ఉన్నారు.
ఈనాడు, పాడేరు, అనకాపల్లి
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది. పోస్టులు రద్దు, కొన్ని ఖాళీలను చూపకుండా బ్లాక్ చేయడం, దరఖాస్తుల అనంతరం అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో బదిలీల తీరుపై గురువులు అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా పాత స్టేషన్ పాయింట్ల లెక్కింపులో పారదర్శకత లోపించిందంటూ వందలాది మంది ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. జీవో నంబర్ 117, 128తో పాఠశాలల విలీనం, హేతుబద్దీకరణతో సుమారు 1400 పైగా ఎస్జీటీ పోస్టులు రద్దయిపోయాయి. ఇప్పటి వరకు ఆయాస్థానాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా వేరేచోటకు కదలాల్సిందే. ఈ ఎస్జీటీ ఖాళీల్లోనే 10 శాతం వరకు ప్రభుత్వం బ్లాక్ చేసింది. కేటగిరి వన్ పరిధిలో స్కూళ్లలో ఖాళీలను చూపకపోవడంతో వీరంతా మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ఖాళీలు చూపక ఆందోళన: బదిలీల్లో కీలకమైన వెబ్ ఆప్షన్ల ఎంపిక ఆరో తేదీ నుంచి మొదలైంది. తొలుత ప్రధానోపాధ్యాయులు వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. బుధవారం పాఠశాల సహాయకులు (ఎస్ఏ) ఖాళీలను ఎంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరక్టర్ (ఎస్ఏ పీడీ) ఖాళీలు 109 వరకు ఉన్నట్లు మొదట్లో ప్రకటించారు. అయితే ఆ మేరకు ఖాళీలను మాత్రం వెబ్ ఆప్షన్లలో చూపడం లేదు. సంఘాల నేతల ఒత్తిడితో కొన్ని అదనపు ఖాళీలను ప్రదర్శిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఎస్ఏ పీడీ ఖాళీలు చూపిస్తామని చెప్పినా వెబ్ ఆప్ష్న్లలో ఆ స్థానాలేవీ కనబడడం లేదు. బుధవారం రాత్రితోనే ఖాళీల ఎంపిక గడువు పూర్తికావడంతో వ్యాయామ ఉపాధ్యాయులంతా ఆందోళన చెందుతున్నారు. డీఈవో కార్యాలయానికి వెళ్లి తమ బాధలు చెప్పుకొన్నా ఫలితం లేకుండాపోయింది. ఎస్జీటీలు గురువారం ఖాళీలను ఎంచుకోవాల్సి ఉంది. వీరు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఒక్కొక్కరూ వంద నుంచి మూడు వందల పైగా ఖాళీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్జీటీ పోస్టులకు సంబంధించిన ఖాళీలను బ్లాక్ చేయడంతో చాలామంది పట్టణ, మైదాన ప్రాంతాల్లో బోధనకు దూరమవ్వనున్నారు.
చెప్పేదొకటి.. చేసింది మరొకటి: తెదేపా
ఉమ్మడి జిల్లాలో గ్రీవెన్స్కు 500 పైగా అర్జీలు వస్తే వాటిని పరిష్కరించడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మండిపడ్డారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన జీవోలో స్పష్టత లేదని.. ప్రభుత్వం గురువుల పట్ల కక్ష సాధింపు దిశగా ఈ బదిలీలను ఉపయోగించుకుంటోందని బుధవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. జీవోలో చెప్పిన అంశాలు ఒకలా ఉంటే.. బదిలీ దరఖాస్తులో అంశాలు మరోలా ఉన్నాయన్నారు. ఒక పాఠశాలలో పోస్టు పోతుందంటూ, మరలా అదే పాఠశాలలో కొత్తగా ఒక పోస్టు మంజూరైనట్లు ఖాళీలు చూపారంటే ఎంత అధ్వానంగా బదిలీల ప్రక్రియ చేపడుతున్నారో అర్థమవుతోందన్నారు.
సీపీఎస్ రద్దు చేయాల్సిందే
పాడేరు పట్టణం, న్యూస్టుడే: సీపీఎస్ను రద్దు చేయకుండా జీపీఎస్ అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్లో నిర్ణయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీసీపీఎస్ఏ సంఘం అధ్యక్షులు మాసాడ ఈశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ సీపీఎస్ రద్దు తప్ప దేన్నీ అంగీకరించమని స్పష్టంచేశారు. తక్షణమే కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పదోన్నతులు కల్పించాలి
* పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయులు కె.కొండబాబు, సత్యనారాయణ, రాంబాబు, కన్నయ్య, శోభన్బాబు తదితరులు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. 2019 నుంచి తమకు పదోన్నతులు కల్పించలేదన్నారు. దీనిపై ఐటీడీఏ స్పందనలో విన్నవించినా కనీసం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పార్వతీపురం, రంపచోడవరం, సీతంపేట ఐటీడీఏల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారని గుర్తు చేశారు.
కౌన్సెలింగ్కు హాజరైన ఉపాధ్యాయులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూసేయడంలో తగ్గేదేలే!
[ 29-04-2024]
నాలుగు మూడు చేశాం.. మూడు రెండు చేశాం.. రెండు ఒకటి చేశాం.. రేపో, మాపో ఆ ఒక్కటీ లేకుండా చేస్తాం. -
కూటమి గెలిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్
[ 29-04-2024]
రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని, ఓటర్లు ఆలోచించి మద్దతు తెలపాలని పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. ఆదివారం అన్నవరం, లోతుగెడ్డ పంచాయతీల్లోని దోమలగొంది, -
అర్ధరాత్రి నిద్రిస్తుండగా కత్తితో నరికి..
[ 29-04-2024]
శుభ కార్యక్రమానికి వెళ్లి మేడపై నిద్రిస్తున్న వ్యక్తిని అర్ధరాత్రి వేళ కిరాతకంగా హతమార్చిన ఘటన పెదబయలు మండలంలో చోటుచేసుకుంది. పెదబయలు ఎస్సై మనోజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పాడేరు మండలం కాడెలి పంచాయతీ వర్తనపల్లి గ్రామానికి చెందిన శోభ హేమరాజ్(33), పెదబయలు మండలం ముసిడిపుట్టు గ్రామానికి చెందిన పల్లుల సుందర్రావుకు మధ్యలో రెండు సంవత్సరాలుగా గొడవలు ఉన్నాయి. -
అవ్వా తాతలకు అప్పుడే ధీమా
[ 29-04-2024]
తెదేపా హయాంలో తెలుపు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుని పింఛన్లు మంజూరు చేసేవారు. ఒకసారి లబ్ధిదారునిగా నమోదయ్యాక మధ్యలో తొలగించేవారు కాదు. -
జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి తెదేపాలో చేరిక
[ 29-04-2024]
రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు ఒడుగుల జ్యోతి ఆదివారం తెదేపాలో చేరారు. వట్టిగెడ్డలో నిర్వహించిన కార్యక్రమంలో రంపచోడవరం కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి పార్టీ కండువా కప్పి జ్యోతిని పార్టీలోకి ఆహ్వానించారు. -
ఓటేయాలంటే.. తుమ్మిలేరులో తంటాలే
[ 29-04-2024]
గోదావరి తీరంలో.. రహదారి సౌకర్యంలేని, మారుమూల పాపికొండల్లో ఉన్న చిన్న గ్రామం తుమ్మిలేరు. ఈ గ్రామంలో కొండపైన పోలింగ్ కేంద్రం ఉంది. -
సీఏం జగన్ మోసానికి రెండేళ్లు
[ 29-04-2024]
‘పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని వారం, పదిరోజుల్లో తరలించి న్యాయం చేస్తాం. అందుకు అవసరమైన రూ.58 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 28 ఏప్రిల్ 2022న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రకటించారు. -
జగన్కు ఓటేస్తే ఆటవిక పాలనను ఆహ్వానించినట్లే
[ 29-04-2024]
వైకాపా నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. -
నిర్మాణాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం..
[ 29-04-2024]
గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ఆ కోవకు చెందిందే మోతుగూడెం పంచాయతీ అతిథి గృహ భవన నిర్మాణం.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్