భవిత బాగుకు కూటమి గెలవాలి
పట్టణంలోని రింగు రోడ్డు, ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో గురువారం కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ప్రచారం నిర్వహించారు.
మాట్లాడుతున్న కొణతాల రామకృష్ణ, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే పీలా, బుద్ద తదితరులు
లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), కశింకోట, న్యూస్టుడే: పట్టణంలోని రింగు రోడ్డు, ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో గురువారం కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ప్రచారం నిర్వహించారు. ఉదయాన్నే వాకింగ్ చేస్తున్న వారితో కలిసి నడిచారు. అధికారంలోకి రాగానే మార్కెట్ యార్డు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లిలో శారదా ట్యాంక్ బండ్ పార్కు నిర్మిస్తామన్నారు. ఉమ్మలాడ బ్యారేజ్ వరకు విస్తరించి స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. యోగా శిక్షకులతో పిల్లలకు ఉచితంగా యోగాపై శిక్షణ ఇస్తామని చెప్పారు. అనకాపల్లిలో ప్రభుత్వ అధికారులు అందరూ నివాసం ఉండే విధంగా భవన సముదాయాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మళ్ల సురేంద్ర, వాకర్స్ క్లబ్ సభ్యులు గౌరీపతి, ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 84వ వార్డు పరిధిలోని గొల్ల వీధిలో బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదంశెట్టి నీలబాబు ఆధ్వర్యంలో ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమం నిర్వహించారు. కొణతాల మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు కోసం యువత కూటమికి అండగా నిలవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, తెదేపా జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగజగదీశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కశింకోట: నర్సింగబిల్లి, చింతలపాలెం గ్రామాల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కొణతాల సమక్షంలో 50 మంది యువకులు జనసేనలో చేరారు. మురళీధô్, శ్రీనివాసరావు, రమణమూర్తి నిరంజన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎలమంచిలి, రాంబిల్లి: వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని కూటమి అభ్యర్థి సుందరపు విజయకుమార్ పేర్కొన్నారు. హరిపురంలోని జనసేన కార్యాలయంలో జడ్పీటీసీ మాజీ సభ్యురాలు బొద్దపు మణి భర్త దాసు, రాజకోడూరు సర్పంచి శంకరరావు, ఉప సర్పంచి కొరుప్రోలు దేవి మాణిక్యాలరావు, వార్డు సభ్యులు లాలం తాతారావు, సూరిశెట్టి సత్యవతి, ముత్తా అరుణకుమారితోపాటు మరో 50 మంది కార్యకర్తలు పార్టీలో చేశారు. ఎలమంచిలి పరిధిలోని మంత్రిపాలెం, నాగేంద్ర కాలనీలకు చెందిన ఊడిబాబులు అనుచరులతో జనసేనలో చేరారు. సత్యనారాయణ, శ్రీనివాసరావు, శేఖర్, రామదాసు, చందు, శివశంకర్, శ్రీరాందాసు, నూకన్నదొర, ప్రసాద్, నానాజీ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
[ 28-04-2024]
తెదేపా హయాంలో విశాఖ జిల్లాలో 80 వేలు వరకు ఉన్న వినియోగదారుల సంఖ్య వైకాపా ప్రభుత్వం వచ్చాక తగ్గిపోయింది. చాలా మంది కనెక్షన్లు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. -
చెప్పేది నా ఎస్టీ... చేసేది లూటీ
[ 28-04-2024]
రాష్ట్రంలో 14,132 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గిరిజన ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 36 గిరిజన మండలాలు, 613 గ్రామ పంచాయతీల పరిధిలో 4,765 గిరిజన గ్రామాలున్నాయి. -
కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని రంపచోడవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషాదేవి ఆరోపించారు. -
గిరిజనుల గోడు పట్టని వైకాపా
[ 28-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ఛార్జిషీట్ దాఖలు చేయాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. -
మన్యాన్ని గంజాయివనంగా మార్చిన జగన్
[ 28-04-2024]
ఎన్నికల ముందు గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విఫలమయ్యారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
ఆసరా ఆశలు ఆవిరేనా?
[ 28-04-2024]
ఆసరా పేరుతో ఆశలు రేపి ఇప్పటివరకు నాలుగో విడత నిధులు జమ చేయకపోవడంపై మహిళలు మండిపడుతున్నారు. -
పింఛన్ల పంపిణీ ఆలస్యానికి కుట్ర
[ 28-04-2024]
వచ్చే నెల ఒకటో తేదీన లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని కూటమి అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి సియారి దొన్నుదొర డిమాండ్ చేశారు. -
యువత చొరవతో మూగజీవికి ఊరట
[ 28-04-2024]
మురుగు ట్యాంకులో పడిపోయిన ఆవును యువకులు బయటకు తీసి, సపర్యలు చేయడంతో ప్రాణాలతో బయటపడింది. -
ఇంకా కష్టాల్లోనే ‘విశాఖ ఉక్కు’
[ 28-04-2024]
న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని గత 19 రోజులుగా నిర్వాసిత కార్మికులు గంగవరం పోర్టులో సమ్మె బాట పట్టారు. -
108 అంబులెన్సుల్లో ప్రసవాలు
[ 28-04-2024]
మండలంలోని వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు గర్భిణులు 108 వాహనాల్లోనే ప్రసవించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మారేడుమిల్లి మండలం తాడేపల్లి పంచాయతీ పరిధిలోని మద్దివీడు గ్రామానికి చెందిన బి.సన్యాసమ్మకు నెలలు నిండటంతో పురిటి నొప్పులు మొదలయ్యాయి. -
అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
[ 28-04-2024]
‘అనకాపల్లి ఎంపీగా గెలవగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అభివృద్ధికి చర్యలు చేపడతానని కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
గిరిజన సంక్షేమానికి వైకాపా తూట్లు
[ 28-04-2024]
గిరిజన సంక్షేమానికి 40 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏలు ఏర్పాటు చేసింది. తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు చేపట్టింది. -
గిరిజన గ్రామాల్లో కూటమి విస్తృత ప్రచారం
[ 28-04-2024]
డుంబ్రిగుడ మండలంలో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శనివారం కూటమి నాయకులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. -
22 నామినేషన్ల ఆమోదం
[ 28-04-2024]
అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో 28 మంది అభ్యర్థులు 44 నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి అభిషేక్ శనివారం తెలిపారు. -
జిల్లాలో ఓటర్లు 7,71,193 మంది
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలో ఓటర్ల తుది జాబితా శనివారం విడుదలైంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్