అన్నమో జగనన్నా అనాల్సిందే..!
ముఖ్యమంత్రి జగన్ గొప్పగా చెప్పే మాటలివి.. మరి ఆసుపత్రుల్లో రోగులకు వండిపెట్టే నిర్వాహకులకు పది నెలలుగా సొమ్ములు చెల్లించడం లేదు. దీంతో భోజనంలో నాణ్యత తగ్గుతోంది.. మెనూ అమలు కావడం లేదు.
పదినెలలుగా భోజన బిల్లులు బకాయిలే
మా వల్ల కాదంటున్న నిర్వాహకులు
ఈనాడు, పాడేరు, న్యూస్టుడే, చోడవరం పట్టణం, చింతపల్లి
చోడవరం సీహెచ్సీలో ఇటీవల 30 మంది ఇన్పేషంట్లకు గుడ్లు, పండ్లు లేకుండా చిన్న క్యారేజీల్లో తెచ్చిన ఆహారం
ఆరోగ్యశ్రీ ద్వారా అందించే సేవలు విస్తరించాం.. వైద్యం ఖర్చు రూ.25 లక్షల వరకు పెంచాం..
ముఖ్యమంత్రి జగన్ గొప్పగా చెప్పే మాటలివి.. మరి ఆసుపత్రుల్లో రోగులకు వండిపెట్టే నిర్వాహకులకు పది నెలలుగా సొమ్ములు చెల్లించడం లేదు. దీంతో భోజనంలో నాణ్యత తగ్గుతోంది.. మెనూ అమలు కావడం లేదు. కొన్నిచోట్ల ఇళ్ల నుంచే రోగులకు క్యారేజీలతో ఆహారం తెచ్చుకుంటున్నారు. ఇదేంటని అధికారులు అడిగితే బిల్లులు సకాలంలో ఇచ్చి మాట్లాడండని నిర్వాహకులు ఎదురు చెబుతున్నారు.
అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని 16 ఆసుపత్రుల పరిధిలో సుమారు రూ.2 కోట్లకు పైగా డైట్ బిల్లులు బకాయిలున్నాయి. వాటిలో కొంతైనా చెల్లించకుంటే ఇకపై వండిపెట్టేది లేదని నిర్వాహకులు తేల్చిచెప్పేస్తున్నారు. ఇప్పటికే ఆసుపత్రుల అధికారులు, కలెక్టర్లకు వినతులు అందజేశారు. అయినా స్పందన కనిపించ లేదు. దీంతో బుధవారం నుంచి ఆసుపత్రులకు ఆహార సరఫరా నిలిపేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అదే జరిగితే రోగులు అన్నమో జగనన్నా అనాల్సిందే.
ఉమ్మడి జిల్లాలో వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో 16 ఆసుపత్రులు ఉన్నాయి. వాటిలో ఇన్ పేషెంట్లుగా చేరిన రోగులకు భోజనాలను అందించడానికి టెండర్ల ద్వారా ఏజెన్సీలకు అప్పగించారు. ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోజుకు సగటున 250 మంది వరకూ రోగులకు భోజనాలు పెడుతున్నారు. మిగిలిన 50 పడకలు, సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో రోజుకు 30 నుంచి 100 మంది వరకూ భోజనాలు అందిస్తున్నారు. ఒక రోగికి రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం ఆకుకూర, ఉడికించిన కోడిగుడ్డుతో భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందించాలి. దీనికి మొత్తం రూ.80 వరకు చెల్లించాల్సి ఉంది. గతంలో రూ.40 ఇచ్చేవారు. అది పెంచినా నెలల తరబడి సొమ్ములివ్వడం లేదు. దీంతో కిరాణా దుకాణాల దగ్గర అప్పు పుట్టడం లేదని భోజన నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న భోజనం
బకాయిలు భారం.. మెనూ దూరం..
భోజన నిర్వాహకులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో ఆసుపత్రుల్లో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. కొన్ని ఆసుపత్రుల్లో భోజన సరఫరాకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పెద్ద ఆసుపత్రుల్లో టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులకే వాటిని అదనంగా అప్పగించారు. ఒకే గుత్తేదారు మూడు, నాలుగు ఆసుపత్రుల్లో ఆహారం అందించాల్సి రావడంతో వారు స్థానికంగా మరొకరికి ఈ బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఇటీవల చోడవరం ప్రభుత్వాసుపత్రిలో పరిశీలించగా నిర్వాహకులు ఇంటి వద్ద భోజనం వండి ఆసుపత్రికి చిన్న క్యారేజ్ల్లో తీసుకువచ్చారు. భోజనం ఎలాఉందో వైద్యాధికారులు పర్యవేక్షణ చేయడంలేదు. నాణ్యతలేని భోజనం కారణంగా చాలామంది తీసుకునేందుకు ఇష్టపడటంలేదు. నక్కపల్లి, మిగతా చోట్లా భోజనం అంతంతమాత్రంగానే అందిస్తున్నారు. ఈ విషయమై జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి రమేశ్ కిశోర్ వద్ద ప్రస్తావించగా, ‘డైట్ బిల్లులు డిసెంబర్ వరకు సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసేశాం. త్వరలోనే అందుతాయి. నిర్వాహకులు బిల్లుల బకాయిలపై వినతులైతే ఇచ్చారు.. ఆహార సరఫరా నిలిపేస్తామని చెప్పలేదు. ఆ పరిస్థితి రాకుండా, రోగులకు ఇబ్బందుల్లేకుండా చూస్తామ’ని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూసేయడంలో తగ్గేదేలే!
[ 29-04-2024]
నాలుగు మూడు చేశాం.. మూడు రెండు చేశాం.. రెండు ఒకటి చేశాం.. రేపో, మాపో ఆ ఒక్కటీ లేకుండా చేస్తాం. -
కూటమి గెలిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్
[ 29-04-2024]
రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని, ఓటర్లు ఆలోచించి మద్దతు తెలపాలని పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. ఆదివారం అన్నవరం, లోతుగెడ్డ పంచాయతీల్లోని దోమలగొంది, -
అర్ధరాత్రి నిద్రిస్తుండగా కత్తితో నరికి..
[ 29-04-2024]
శుభ కార్యక్రమానికి వెళ్లి మేడపై నిద్రిస్తున్న వ్యక్తిని అర్ధరాత్రి వేళ కిరాతకంగా హతమార్చిన ఘటన పెదబయలు మండలంలో చోటుచేసుకుంది. పెదబయలు ఎస్సై మనోజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పాడేరు మండలం కాడెలి పంచాయతీ వర్తనపల్లి గ్రామానికి చెందిన శోభ హేమరాజ్(33), పెదబయలు మండలం ముసిడిపుట్టు గ్రామానికి చెందిన పల్లుల సుందర్రావుకు మధ్యలో రెండు సంవత్సరాలుగా గొడవలు ఉన్నాయి. -
అవ్వా తాతలకు అప్పుడే ధీమా
[ 29-04-2024]
తెదేపా హయాంలో తెలుపు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుని పింఛన్లు మంజూరు చేసేవారు. ఒకసారి లబ్ధిదారునిగా నమోదయ్యాక మధ్యలో తొలగించేవారు కాదు. -
జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి తెదేపాలో చేరిక
[ 29-04-2024]
రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు ఒడుగుల జ్యోతి ఆదివారం తెదేపాలో చేరారు. వట్టిగెడ్డలో నిర్వహించిన కార్యక్రమంలో రంపచోడవరం కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి పార్టీ కండువా కప్పి జ్యోతిని పార్టీలోకి ఆహ్వానించారు. -
ఓటేయాలంటే.. తుమ్మిలేరులో తంటాలే
[ 29-04-2024]
గోదావరి తీరంలో.. రహదారి సౌకర్యంలేని, మారుమూల పాపికొండల్లో ఉన్న చిన్న గ్రామం తుమ్మిలేరు. ఈ గ్రామంలో కొండపైన పోలింగ్ కేంద్రం ఉంది. -
సీఏం జగన్ మోసానికి రెండేళ్లు
[ 29-04-2024]
‘పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని వారం, పదిరోజుల్లో తరలించి న్యాయం చేస్తాం. అందుకు అవసరమైన రూ.58 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 28 ఏప్రిల్ 2022న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రకటించారు. -
జగన్కు ఓటేస్తే ఆటవిక పాలనను ఆహ్వానించినట్లే
[ 29-04-2024]
వైకాపా నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. -
నిర్మాణాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం..
[ 29-04-2024]
గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ఆ కోవకు చెందిందే మోతుగూడెం పంచాయతీ అతిథి గృహ భవన నిర్మాణం.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM