నాడు-నేడు.. దోచేశారు చూడు!
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు.
పాఠశాలల్లో పనులు పైనపటారం.. లోన లొటారం
నిర్మాణ సామగ్రికి ఉన్నతస్థాయిలోనే కమీషన్లు
ఈనాడు, పాడేరు - న్యూస్టుడే, హుకుంపేట, ఎలమంచిలి
బాలలంతా బడికెళ్తారు..
అక్షర జ్ఞానం పొందడానికి!
అధికార పార్టీ నేతలూ ఈ అయి దేళ్లు బడివైపే చూస్తూ వచ్చారు..
అక్షరాలా లక్షలు కొట్టేయడానికి..
నాడు-నేడు పనులతో సర్కారీ బడులు బాగుపడింది తక్కువే. ఆ పనులు చేయించిన, చేసిన అధికార పార్టీ నేతలు, వారి అనుచరులే ఎక్కువ బాగుపడ్డారు.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. ఉన్నత స్థాయిలో కమీషన్లు బొక్కేసి అవసరం లేనిచోట రూ. కోట్లు ఖర్చుచేసి, అవసరమైన చోట సొమ్ముల్లేక అసంపూర్తిగా నిర్మాణాలు వదిలేశారు.
అనకాపల్లి జిల్లాలో 616 పాఠశాల్లో రెండోవిడత నాడు-నేడు పనులు మంజూరయ్యాయి. మొత్తం అంచనా విలువ రూ. 239 కోట్లయితే దశలవారీగా రూ. 92 కోట్లు రివాల్వింగ్ ఫండ్గా విడుదల చేశారు. ఆ నిధులన్నీ ఎప్పుడో ఖర్చయిపోయాయి. తర్వాత విడుదల చేయాల్సిన సొమ్ములు రాకపోవడంతో తుదిదశలో ఉన్న పనులు అసంపూర్తిగా వదిలేశారు. ముఖ్యంగా అదనపు గదుల నిర్మాణానికి నిధులు చాలక ఎక్కడికక్కడ మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. అల్లూరి జిల్లాలోనూ 949 పాఠశాలల్లో రూ. 216 కోట్ల అంచనా విలువైన పనులు చేపట్టినప్పటికీ అన్నిచోట్ల అసంపూర్తి నిర్మాణాలే కనిపిస్తున్నాయి.
పాడేరులో ఓ ఆశ్రమ పాఠశాల చుట్టూ నాడు-నేడు నిధులతో నిర్మించిన ప్రహరీ కొద్దిరోజులకే కూలిపోయింది.
కశింకోట మండలంలోని ఓ పాఠశాలలో టైల్స్ నాసిరకం వేయడంతో మంత్రి అమర్నాథ్ ఆ పనులపై అసంతృప్తి వ్యక్తం చేయగా సదరు ఉపాధ్యాయునిపై వెంటనే సస్పెన్షన్ వేటు వేశారు.
నిధులు మేసి.. పనుల్లో నాసి..
- అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పెదకలవలాపల్లి పాఠశాలలో నాడు-నేడు కింద నిర్మించిన రక్షణగోడ చిన్నపాటి వర్షానికే నేలకొరిగింది. ఆ సమయంలో పిల్లలెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
- విశాఖ జిల్లా పద్మనాభం మండలం అర్చుకునిపాలెం పాఠశాలలో చేసిన నాసిరకం పనుల వల్ల తరగతి గదిలో కూర్చున్న విద్యార్థులపై పైకప్పు పెచ్చులుపడి ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
- విశాఖపట్నం తోటగురువు పాఠశాలలో ఖర్చు చేసిన నిధులు ఎక్కువ చేసిన పనులు తక్కువగా ఉండడాన్ని అధికారులే గుర్తించారు.
- కస్తూర్బా బాలికా విద్యాలయాల్లోనూ నాడు-నేడు పనుల్లో కమిటీలు భారీగా అక్రమాలకు పాల్పడ్డాయి.
ప్రాణాలు తీశాయి
- హుకుంపేట మండలంలోని ఉర్రడ, బొడ్డాపుట్టు ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు పనుల జాప్యం కారణంగా విద్యార్థులను ఆరుబయట కూర్చోబెట్టి బోధన సాగిస్తున్నారు. గతేడాది పాఠశాల సమీపంలో ఓ విద్యుత్తు ఓ స్తంభం విద్యార్థినిపై పడి చనిపోయింది. మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి.
- పాయకరావుపేట: దుర్గాకాలనీలో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్డి సన్షేడ్ పలక మీదపడి గతేడాది అక్టోబర్ 9న ఓ విద్యార్థి చనిపోయాడు. ఈ కుటుంబానికి రూ. 5 లక్షలిస్తామన్న సర్కారు రూ. 2 లక్షలు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకొంది.
కమీషన్ల కథ.. రూ.కోట్లలో వృథా
ఉమ్మడి జిల్లాలో 239 ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను సమీప ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేశారు. ఆయా పాఠశాలల్లో నాడు-నేడు పనులు అవసరం లేకపోయినా కమీషన్ల కోసం నిర్మాణ సామగ్రి పంపించేశారు. బెంచీలు, చాక్బోర్డులు కొత్తవి తెప్పించారు. మరుగుదొడ్లు, ప్రహరీలు నిర్మించారు. బడి మొత్తాన్ని రంగురంగుల బొమ్మలతో నింపేశారు. రూ. కోట్లు ఖర్చు చేసేశారు. తీరా పనులన్నీ పూర్తయ్యాక ఆ బడులను ఉన్నత పాఠశాలల్లో కలిపేయడం వల్ల ఈ ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ జమానాలో నైపుణ్యం లేదు.. నయవంచనే!
[ 30-04-2024]
ఘనకీర్తి అంతా గతమే అన్న చందంగా తయారైంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన యువత పరిస్థితి. -
కుట్రలు కట్టిపెట్టు.. పింఛను సర్దిపెట్టు..
[ 30-04-2024]
గ్రామ/వార్డు సచివాలయాల్లో సిబ్బంది వేలల్లో ఉన్నారు. వీరిని కూడా పింఛన్ల పంపిణీలో భాగస్వాములను చేస్తే ఒకరోజులోనే అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 3.94 లక్షల పింఛన్లు ఇంటికే తీసుకువెళ్లి అందించడానికి అవకాశం ఉంది. -
వైకాపాది దుర్మార్గ పాలన
[ 30-04-2024]
వైకాపాకు ఓటేస్తే మనకు మనమే ఉరేసుకున్నట్లవుతుందని అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. -
కూటమితోనే గిరిజన ప్రాంత అభివృద్ధి
[ 30-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే గిరిజన ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. -
వైకాపా సర్కారును సాగనంపేందుకు జనం సిద్ధం
[ 30-04-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని రంపచోడవరం కూటమి అభ్యర్థి మిరియాల శిరీషాదేవి అన్నారు. -
తండ్రీకూతురికి ఓటుతో బుద్ధి చెప్పండి: సీఎం రమేశ్
[ 30-04-2024]
గత ఎన్నికల్లో మాడుగుల ఎమ్మెల్యేగా బూడి ముత్యాలనాయుడిని గెలిపించడం ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారిందని అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
బీఎన్ రహదారి ఊసెత్తని జగన్చప్పగా ప్రసంగం.. నాయకగణం డీలా
[ 30-04-2024]
సీఎం జగన్ తన ప్రసంగంలో సరికొత్త బాణి ఎంచుకున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో బాదుడే... బాదుడు అన్న ఆయన ఈ ఎన్నికల్లో పదేపదే గోవిందా.. గోవిందా అన్నారు. -
మే నెలలో ప‘రేషన్’ తప్పదా..!
[ 30-04-2024]
మే నెలలో రేషను సరకుల పంపిణీ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
కాంగ్రెస్తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా
[ 30-04-2024]
రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. -
నేడు మహిళా శంఖారావం
[ 30-04-2024]
మహిళా సంక్షేమాన్ని పట్టించుకోని సీఎం జగన్మోహన్రెడ్డికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి కోరార¢ు. -
మా పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోనా?
[ 30-04-2024]
రెండు సెంట్లు పాకదిబ్బ మినహా ఎలాంటి భూమిలేదు. పశువులను మేపుకొనే జీవిస్తున్నా. -
నేను చనిపోతే.. పీవీ సురేషే కారణం..!
[ 30-04-2024]
విశాఖ పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు వైకాపా కార్పొరేటర్ పీవీ.సురేష్పై అదే పార్టీకి చెందిన మహిళా కార్యకర్త సోమవారం మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సచివాలయాలకు వెళ్లనవసరం లేదు
[ 30-04-2024]
మే నెల సామాజిక పింఛన్లకు సంబంధించి లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని డీఆర్డీఏ పీడీ శచీదేవి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
-
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
-
కేజ్రీవాల్ను కలిసిన పంజాబ్ సీఎం.. ఆయన ఏం చెప్పారంటే?
-
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం