62 కేజీల గంజాయి పట్టివేత
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
పట్టుబడిన గంజాయి, నిందితులతో పోలీసులు
మోతుగూడెం, న్యూస్టుడే: రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వై.రామవరం డిప్యూటీ తహసీల్దార్ సుధాకరరావు, వీఆర్వో సందీపాచార్యులు సమక్షంలో తన సిబ్బందితో పోలీసు స్టేషన్ చెక్పోస్టు వద్ద బుధవారం వాహన తనిఖీలు చేసినప్పుడు గంజాయి పట్టుబడిందన్నారు. తొలుత ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన పెనుమల బాబు, పర్వతం సురేష్ను అరెస్టు చేసి రూ.పది వేల విలువైన రెండు కేజీల గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీలోని బర్రిగూడ గ్రామానికి చెందిన కిలో రాందాస్, తెలంగాణ రాష్ట్రం చిట్యాలకి చెందిన గొర్రె కృష్ణలను అరెస్టు చేసి రూ. 3 లక్షల విలువైన 60 కేజీల గంజాయి, ఆటోను సీజ్ చేశారు. నిందితులను రంపచోడవరం కోర్టుకు తరలించామన్నారు. ఈ రెండు కేసుల్లో గంజాయి అక్రమ రవాణాపై ముందస్తు సమాచారం సేకరించి, నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన హెడ్ కానిస్టేబుళ్లు కల్యాణ్, శ్రీనివాసరావు, ఆర్.శ్రీనివాస్ గౌడ్, కానిస్టేబుళ్లు పోసయ్య, గంగరాజులను అదనపు ఎస్పీ రాహుల్ మీనా, సీఐ గజేంద్ర కుమార్, ఎస్సై శివకుమార్ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్మికులపై కరకు మనసు!!
[ 01-05-2024]
‘మాట్లాడితే చాలు పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ’ అని చెబుతుంటారు సీఎం జగన్. మరి అదే పేదలు కంపెనీల్లో ఒళ్లు గుల్ల చేసుకుని పని చేస్తూ అనారోగ్యాల బారిన పడుతున్నా వారిపై కనీస కనికరం కూడా చూపడం లేదు ఆయన. -
సముచిత స్థానం కల్పిస్తాం
[ 01-05-2024]
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను పాడేరుకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేశ్నాయుడు మంగళవారం ఉండవల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
వైకాపా పాలనలో కానరాని అభివృద్ధి
[ 01-05-2024]
అరకు అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని సినీ నటి, భాజపా నేత ఖుష్బూ పిలుపునిచ్చారు. అరకులోయలో మంగళవారం కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కొత్తపల్లి గీత, పాంగి రాజారావులతో కలిసి ఆమె రోడ్షో నిర్వహించారు. -
విపక్షాలపై పగ.. పండుటాకులకు సెగ
[ 01-05-2024]
సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఉన్నతాధికారుల తీరు అంతా జగన్నాటకంగానే కనిపిస్తోంది. గత నెలలో మండుటెండలో పింఛన్లు అందుకోవడానికి సచివాలయానికి వెళ్లి పదుల సంఖ్యలో వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. -
అరకు వైకాపాకు తిరుగు‘పోటు’
[ 01-05-2024]
ఆంధ్రాఊటీ అరకులోయలో రాజకీయం వేడెక్కుతోంది. అరకులోయ అసెంబ్లీ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిసి మొత్తం 17 మంది బరిలో ఉన్నారు. వీరిలో వైకాపాలోని తిరుగుబాటు అభ్యర్థులే అధికంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. -
కూటమి గెలుపుతోనే భవిష్యత్తు
[ 01-05-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో గిరిజనులకు ఒరిగిందేమీ లేదని రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు. -
మండుతున్న ఎండలు... తాగునీటికి అవస్థలు
[ 01-05-2024]
వేసవి తీవ్రత పెరుగుతోంది. గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువ అవుతోంది. బోర్లు, బావులు అడుగంటిపోతున్నాయి. రూ.లక్షల ఖర్చుతో నిర్మించిన నీటి పథకాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. -
గుర్తుందా.. జగన్ ఏలేరు పైపులైను..!
[ 01-05-2024]
విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేస్తాం.. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టారు జగన్.. వైకాపా పాలన ఐదేళ్లు పూర్తయింది. ఇప్పుడు చూస్తే నగరాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. -
వైకాపా పాలన అంతమే కూటమి లక్ష్యం
[ 01-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లగా సాగుతున్న వైకాపా రాక్షస పాలన అంతమే లక్ష్యంగా ప్రజల కోసం కూటమి ఏర్పడిందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జగన్ని ఇంటికి పంపిద్దాం
[ 01-05-2024]
కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించి, అవినీతి ముఖ్యమంత్రి జగన్ను ఇంటికి పంపిద్దామని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ అన్నారు. -
వైకాపా పాలనలో మహిళలపై పెరిగిన అకృత్యాలు
[ 01-05-2024]
వైకాపా పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయి భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయని తెలంగాణా తెదేపా నాయకులు, స్టార్ కాంపెయినర్ నర్సిరెడ్డి తెలిపారు. -
ప్రజల ఆస్తులను దోచుకోవడానికే జగనన్న భూ యాజమాన్య చట్టం
[ 01-05-2024]
ప్రజల సొంత ఆస్తులను దోచుకోడానికి జగనన్న భూ యాజమాన్య హక్కుల చట్టం తీసుకొచ్చారని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. -
కార్మికులపై జగన్ కాఠిన్యం
[ 01-05-2024]
వైకాపా పాలనలో కార్మిక రంగాలన్నీ పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. కార్మికులు లేనిదే ఏ పనీ జరగదు. అటువంటి కీలకమైన ఈ రంగానికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి కనీస వేతనం అమలు కావడం లేదు. -
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ల జమ
[ 01-05-2024]
ఎన్నికల నియమావళికి అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి మే, జూన్ నెలల్లో సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత మంగళవారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
-
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
-
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
-
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్