సీఎం కార్యాలయానికి గన్నవరం పంచాయితీ
గన్నవరం వైకాపాలో వర్గపోరు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)కు చేరింది. గత కొంతకాలం నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య
నేడు కీలక సమావేశం
వంశీ, దుట్టాలకు పిలుపు
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే: గన్నవరం వైకాపాలో వర్గపోరు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)కు చేరింది. గత కొంతకాలం నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరడంతో నియోజకవర్గంలో అధికార పార్టీలో గందరగోళం నెలకొంది. వంశీనే గన్నవరం బాధ్యతలు చూస్తారంటూ గతంలో స్వయంగా సీఎం జగన్ స్పష్టం చేసినా ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. తెదేపా నుంచి వచ్చిన వంశీతో దుట్టా మొదట్లో బాగానే ఉన్నా రానురాను వివాదాలు మొదలయ్యాయి. రహదారుల కాంట్రాక్టులు, మైనింగ్ తవ్వకాలు, భూ సేకరణకు సంబంధించిన విషయాల్లో ఇరు వర్గాల మధ్య లుకలుకలు చోటుచేసుకున్నాయి. ఇటీవల కొందరు వంశీ మా కొద్ధు. కొత్త ఇన్ఛార్జిని నియమించాలంటూ విజయసాయిరెడ్డిని కలవడం, ఆ తర్వాత చలో తాడేపల్లికి ప్రయత్నించడం, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీర్మానం చేయడం వంటి పరిణామాలు కాక పెంచాయి. పక్క పార్టీ నుంచి వచ్చిన వారి పెత్తనమేమిటంటూ ఎమ్మెల్యేపై తరచుగా దుట్టా వర్గీయులు విమర్శలు చేయడం, దుట్టా అల్లుడు శివభరత్రెడ్డి జోక్యం కారణంగానే నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నాయని వంశీ వర్గీయులు ఆరోపించడం వర్గపోరుకు మరింత ఆజ్యం పోశాయి. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లో తనపై దుట్టా వర్గీయులు దుష్ప్రచారం చేస్తున్నారంటూ బాపులపాడు తహసీల్దార్ కలెక్టర్ వద్ద వాపోవడం, జగనన్న కాలనీలకు, గ్రామాల్లో ఇళ్ల స్థలాలకు మెరక తోలకుండా శివభరత్రెడ్డి నానా యాగీ చేస్తున్నారంటూ వివిధ గ్రామాల నాయకులు ప్రత్యక్ష ఆందోళనకు దిగడం వైకాపా ప్రతిష్ఠను బజారుకీడ్చాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీ పరంగా ఈ తరహా వర్గపోరు సరికాదనే ధోరణితో అధినాయకత్వం జోక్యం చేసుకుంది. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం సీఎంవోకు రావాల్సిందిగా వంశీ, దుట్టాలకు పిలుపు వచ్చింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయం చర్చనీయాంశమైంది. మరి కొంతసేటికి భేటీ జరుగుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా గురువారం సాయంత్రానికి వాయిదా పడినట్లు సమాచారం వచ్చింది. దీంతో గురువారం రాత్రికి గన్నవరం వైకాపా పగ్గాలు ఎవరికనే దానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అణువణువూ నిఘా!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సంచార నిఘా వాహనం ఏర్పాటు చేశారు. -
వైకాపా కూపన్లపై దర్యాప్తు ముమ్మరం
[ 30-04-2024]
అజిత్సింగ్నగర్లో ఆదివారం పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్లపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఓటమి భయంతో అవినాష్ అసత్య ప్రచారం
[ 30-04-2024]
వైకాపా విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్కు ఓటమి భయం పట్టుకుందని.. దీంతో హైదరాబాద్ గంగోత్రి పాఠశాల ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని వీడియోగా చిత్రీకరించి.. అది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా పాలనలో తాము చేసిన అభివృద్ధి అంటూ ఫేక్ ప్రచారాలు చేసుకునే స్థాయికి దిగజారిపోయారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుల నియామకం
[ 30-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
నాలుగేళ్లుగా నాన్చుడే పని
[ 30-04-2024]
-
వైకాపా అరాచకీయం!
[ 30-04-2024]
‘‘గుడివాడలో ఇటీవల రాజీనామాలు చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.లక్షల్లో తాయిలాలు ఇచ్చి.. వారిని పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వైకాపా తరఫున కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలుస్తోంది. -
రసబరితం..!
[ 30-04-2024]
‘‘నామపత్ర ఘట్టం పూర్తయింది. బుజ్జగింపులకు తెరపడింది. కొందరు బరి నుంచి వైదొలిగారు. పోటీపడే అభ్యర్థుల లెక్క తేలింది. -
కత్తిగట్టారు.. కుట్రపన్నారు!
[ 30-04-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 4,81,629 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి రూ.142.98 కోట్లు సొమ్ము పంచాలి. మొత్తంగా 1,113 వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. -
కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో.. మహోన్నత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ : బుద్ధప్రసాద్
[ 30-04-2024]
కూటమి ప్రుభుత్వం ఏర్పాటుతో ఆంధ్ర ప్రదేశ్ మహోన్నత రాష్ట్రంగా రూపొందుతుందని మాజీ ఉపసబాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. -
అత్యాచారం కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
[ 30-04-2024]
వివాహితపై సామూహిక అత్యాచారం చేసి ఆమెను చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష, రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం న్యాయాధికారి ఐ.శైలజాదేవి సోమవారం తీర్పు చెప్పారు -
గురువులపై దమనకాండ
[ 30-04-2024]
జగన్ ప్రభుత్వం తమపై కక్ష గట్టి, పోలీసులతో కేసులు పెట్టించి.. ఉద్యమాన్ని అణచివేసేలా వ్యవహరించిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాజధాని అమరావతితోనే నగరాభివృద్ధి
[ 30-04-2024]
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంతోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని జనసేన, భాజపా బలపరిచిన విజయవాడ పార్లమెంట్ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం