రాష్ట్రపతి పర్యటనకు చకచకా ఏర్పాట్లు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన నేపథ్యంలో పోరంకిలో వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న కలెక్టర్ రంజిత్ బాషా,ఎస్పీ జాషువా,
ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఓఎస్డీ శశిధర్ రెడ్డి, ఇతర అధికారులు
పోరంకి, గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన నేపథ్యంలో పోరంకిలో వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణం మురళీ రిసార్ట్స్కు వెళ్లే పోరంకి - నిడమానూరు మార్గానికి రెండు వైపులా దట్టంగా పెరిగిన పిచ్చి చెట్లను, ముళ్ల కంపను యంత్రాలతో తొలగిస్తున్నారు. రహదారులపై గుంతలను పూడ్చి వేస్తున్నారు. నారాయణపురం కాలనీ సమీపంలో విశాలమైన ప్రదేశంలో వాహనాల పార్కింగ్కు ఎంపిక స్థలాన్ని బుల్డోజర్లతో చదును చేస్తున్నారు. కి.మీ దూరం నుంచి సభాప్రాంగణం వరకు రోడ్డుకు రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పోరంకి - నిడమానూరు రోడ్డులో అధునాతన ఎత్తయిన స్తంభాలను నూతనంగా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్ రాక సందర్భంగా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ జాషువా, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఓఎస్డీ శశిధర్ రెడ్డి తెలిపారు. పోరంకి మురళీ రిసార్ట్స్లో జరుగుతున్న పౌరసన్మాన ఏర్పాట్లను పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు శుక్రవారం పర్యటించారు. ఐదుగురు డీఎస్పీలు, 14 మంది సీఐలు, 36 మంది ఎస్సైల ఆధ్వర్యంలో 400 మంది పోలీస్ సిబ్బందిని భద్రత కోసం కేటాయిస్తున్నట్లు తెలిపారు.
* కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్మ్రణ్య రెడ్డి, ఎస్కార్ట్ అధికారి మేరీ ప్రశాంతి, అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు, డీఎస్పీ కె. విజయపాల్, సీఐలు గోవిందరాజు, వెంకటనారాయణ, ఉయ్యూరు ఆర్డీవో ఎన్. విజయ్ కుమార్, డీఈవో తాహెరా సుల్తానా, తహశీల్దార్ సతీష్, మున్సిపల్ కమిషనర్ ఎన్. ప్రకాశరావు పాల్గొన్నారు.
పోలీసుల వలయంలో విమానాశ్రయం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 4న (ఆదివారం) విజయవాడలో పర్యటించనున్న నేపథ్యంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పోలీసు భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. శుక్రవారం ఉదయం విమానాశ్రయం పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మరోవైపు రన్వే, చెన్నై-కోల్కతా జాతీయ రహదారి, విమానాశ్రయం పరిసరాల్లో ముందస్తు గస్తీ నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులతో జిల్లా ఎస్పీ జాషువా విమానాశ్రయంలో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. తొలిసారి రాష్ట్రపతి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమ నిర్వహణ ఉండేలా చూడాలన్నారు. ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలని ఎస్పీ ఆదేశించారు. మరోవైపు భద్రత చర్యల్లో పాల్గొనే వైద్య, పోలీసు, ఇతర విభాగాల సిబ్బందికి పలు పరీక్షలు నిర్వహించారు. చెన్నై-కోల్కతా జాతీయ రహదారి మీదుగా విజయవాడ రాజ్భవన్కు రాష్ట్రపతి వెళ్లనుండగా... హైవేపై పారిశుద్ధ్య పనులు చేపట్టారు. నేడు ముందస్తు ట్రైల్ రన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విమానాశ్రయం నుంచి గూడవల్లి వరకు ఉన్న కృష్ణా జిల్లా పరిధిలో మొత్తం సుమారు 800 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విమానాశ్రయం పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దాలని, ఎటువంటి లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. ఇంటెలిజెన్స్ భద్రత విభాగం ఓఎస్డీ శశిధర్రెడ్డి, ఏలూరు ఎస్పీ రాహుల్దేవ్వర్మ, జేసీ అపరాజితాసింగ్, ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యరెడ్డి, ఉన్నతాధికారులు మేరీప్రశాంతి, విమానాశ్రయ డైరెక్టర్ ఎమ్ఎల్కే.రెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య