logo

స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఆదివారం వేలాది మంది భక్తులు దర్శించారు.

Published : 05 Dec 2022 05:35 IST

భక్తులతో నిండిన మోపిదేవి దేవాలయ ప్రాంగణం

మోపిదేవి, న్యూస్‌టుడే: మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఆదివారం వేలాది మంది భక్తులు దర్శించారు. అభిషేకాలు, రాహు, కేతు, సర్పదోషపూజలు, స్వామి కల్యాణం, చిన్నారుల మొక్కుబడులు, పాల పొంగళ్లు, తలనీలాలు తదితర మొక్కుబడులు తీర్చుకున్కారు. మహన్యాస ఏక రుద్రాభిషేకాలు 245, శాంతి కల్యాణంలో 70, కాలసర్పదోష పూజల్లో 222, సాధారణ అభిషేకాల్లో 261, తలనీలాలు 904 మంది, పాలపొంగళ్లు 251, శీఘ్రదర్శనంలో 1818 మంది పాల్గొన్నారు. సేవా టికెట్ల ద్వారా రూ.4.03 లక్షలు, శాశ్వత అన్నదానానికి రూ.20,349, నిత్యాన్నదానానికి రూ.85,300, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.1.50 లక్షలు మొత్తం రూ.7.62 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ సహాయ కమిషనర్‌ నల్లం సూర్య చక్రధరరావు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని