వసూలు రూ. కోట్లు.. స్వాధీనం రూ.లక్షలు..!
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొలుసుకట్టు మోసాల సంస్థ సంకల్పసిద్ధి దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కొంతమంది నిందితులను అరెస్టు చేసి దాదాపు రెండు నెలలు గడిచినా.. ఆస్తులను గుర్తించిన దాఖలాలు లేవు.
పరారీలోనే కీలక పాత్రధారి
ఈనాడు, అమరావతి
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొలుసుకట్టు మోసాల సంస్థ సంకల్పసిద్ధి దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కొంతమంది నిందితులను అరెస్టు చేసి దాదాపు రెండు నెలలు గడిచినా.. ఆస్తులను గుర్తించిన దాఖలాలు లేవు. కొన్ని డాక్యుమెంట్లు లభించినా.. వాటి విశ్లేషణలు చేయలేదు. ఆస్తుల మదింపు జరగలేదు. మరోవైపు కీలక పాత్రధారి విదేశాలకు పరారుకాగా అసలు సూత్రధారులనే గుర్తించలేదు. ఓ లారీ క్లీనర్ తక్కువ కాలంలో రూ.కోట్లకు పడగలెత్తిన వైనం ఈ మోసంతో వెలుగు చూసింది. ఈ గొలుసు కట్టు సంస్థ వెనక ఇద్దరు కీలక నేతలు ఉన్నట్లు భారీగా ప్రచారం జరిగింది. ఆ నేతలకు భారీగా ఫండ్ వెళ్లినట్లు తెలిసింది. కానీ ఆ దిశగా దర్యాప్తు నడవలేదు.
రూ.కోట్ల ఆస్తులు ఎక్కడ..?
ప్రస్తుతం పోలీసులు గుర్తించిన వాటిలో నగదు చాలా తక్కువ లభించింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో కొనుగోలు చేసిన 150 ఎకరాల్లో ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలు పెంచే విధంగా ఒక అగ్రోస్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. మూడు పోలీసు బృందాలు కనిగిరి వెళ్లి విచారణ చేశాయి. ఇక్కడ మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి రూ.కోట్లలో ఉంటుంది. అక్కడే మరో 50 ఎకరాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. సంస్థ తరపున కాకుండా యజమాని గుత్తా వేణుగోపాలకృష్ణతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. బెంగళూరులోనూ స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇవేవీ ఇంకా దర్యాప్తులో మాత్రం వెలుగులోకి రాలేదు. అరెస్టు సమయంలో లభించాయంటున్న డాక్యుమెంట్ల వివరాలు ఏమిటనేది పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా వెల్లడించలేదు. సంస్థ యాప్లో వసూలు చేసిన సొమ్ము వివరాలు మొత్తం ఉన్నట్లు తెలిసింది. సైబర్ క్రైం పోలీసులు దీన్ని ఛేదించాల్సి ఉంది. ఈ సంస్థ ప్రారంభించన సమయంలో కొంతమందికి తాయిలాలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఓ పోలీసు అధికారి ఉన్నారు. వీరిపై చర్యలు లేవు. ఇతర వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారని భావించినా అడుగు ముందుకుపడలేదు.
ప్రజల నుంచి సేకరించిన సొమ్ము(అంచనా): రూ.1100కోట్లు
పోలీసులు వేసిన అంచనా : రూ.250 కోట్లు
స్వాధీనం చేసుకున్న సొమ్ము: రూ.51.60లక్షలు,
రెండు కార్లు, బంగారం: 728గ్రా, వెండి:9.5కేజీలు
అరెస్టైన నిందితులు : 12 మంది
ఈ కేసులో బెంగళూరుకు చెందిన కిరణ్ కీలక పాత్రధారిగా పోలీసులు గుర్తించారు. గత ఏడాది నవంబరు 28న అయిదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. తర్వాత మరి కొందరును అరెస్టు చేశారు. దీనిలో ప్రధాన పాత్రధారి గుత్తా వేణుగోపాల్. కిరణ్ కీలకంగా వ్యవహరించారు. అయిదో తరగతి చదివిన వేణుకు అంతగా అవగాహన లేదు. ప్రస్తుతం కిరణ్ వద్దనే కీలక పత్రాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆయన పోలీసులకు దొరకలేదు. మరోవైపు పోలీసులు మాత్రం అతనికి పాసుపోర్టు కూడా లేదని చెప్పుకొస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..