logo

విద్యుత్తు విజిలెన్స్‌ సీఐకి మూడు పురస్కారాలు

విద్యుత్తు విజిలెన్స్‌ విభాగంలో అత్యుత్తమ సేవలు అందించిన సీఐ గంగాభవానీకి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు అవార్డులు లభించారు.

Published : 27 Jan 2023 03:54 IST

విజయానంద్‌ చేతుల మీదుగా లాయల్టీ అవార్డు అందుకుంటున్న గంగాభవానీ

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : విద్యుత్తు విజిలెన్స్‌ విభాగంలో అత్యుత్తమ సేవలు అందించిన సీఐ గంగాభవానీకి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు అవార్డులు లభించారు. గుణదల విద్యుత్తు సౌధలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌ చేతుల మీదుగా లాయల్టీ అవార్డు, పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలోని ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ కార్యాలయంలో ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పద్మజనార్ధనరెడ్డి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం అందుకున్నారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన జిల్లా కార్యక్రమంలో కలెక్టర్‌ డిల్లీరావు చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని