కార్యదర్శుల సమావేశంలో అపశ్రుతి
అవనిగడ్డ మండల పరిషత్తు కార్యాలయంలో శనివారం జరిగిన ఐదు మండలాల పంచాయతీ ఈవోలు, గ్రామ సచివాలయాల కార్యదర్శుల సమావేశంలో అపశ్రుతి చోటుచేసుకుంది.
గోవిందుకు చికిత్స చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు
అవనిగడ్డ గ్రామీణం, న్యూస్టుడే: అవనిగడ్డ మండల పరిషత్తు కార్యాలయంలో శనివారం జరిగిన ఐదు మండలాల పంచాయతీ ఈవోలు, గ్రామ సచివాలయాల కార్యదర్శుల సమావేశంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కార్యాలయానికి సంబంధించి సమావేశంలో ఆధికారులు అడిగిన వాటికి కోడూరు మండలం విశ్వనాథపల్లి సచివాలయం కార్యదర్శి కె.గోవిందు వివరణ ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి మండలాలకు చెందిన పంచాయతీ, గ్రామ సచివాలయాల కార్యదర్శులకు మండల పరిషత్తు కార్యాలయంలో శనివారం జిల్లా పంచాయతీ అధికారి డి.నాగేశ్వర నాయక్, డీఎల్పీవో జ్యోతిర్మయి సమావేశం నిర్వహంచారు. ఇంటి పన్నుల వసూలు, జగనన్న స్వచ్ఛ సంకల్పం తదితర అంశాలపై డీపీవో నాగేశ్వరనాయక్ పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఇంటి పన్నుల వసూలుపై ఆరా తీస్తుండా గోవింద్ వివరణ ఇస్తూ సొమ్మసిల్లి పడిపోయాడు. అధికారులు అప్రమత్తమై వైద్యబృందానికి సమాచారమిచ్చారు. వారొచ్చి గోవిందుకు వైద్య సేవలు అందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్ను పంచుకున్న సముద్రఖని
-
Ap-top-news News
ఎమ్మెల్యే అనిల్ ఫ్లెక్సీకి పోలీసుల పహారా