అక్రమంగా తవ్వి.. అడ్డంగా పోస్తూ!
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అయినా అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోవడం లేదు.
మట్టి తరలిస్తున్నా పట్టించుకోని అధికారులు
రహదారులు ఛిద్రమయ్యేలా టిప్పర్ల రాకపోకలు
ఈనాడు, అమరావతి, గుడివాడ (నెహ్రూచౌక్), న్యూస్టుడే
చెరువు కట్టను అక్రమంగా మూసేసి మరీ మెరక
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అయినా అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోవడం లేదు. తాజాగా గుడివాడ పట్టణంలోని నాగవరప్పాడు శివారు వ్యవసాయ భూముల్లోకి ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి పగలు టిప్పర్లతో పెద్దఎత్తున మట్టిని తెచ్చి పోస్తున్నారు. పక్కనే ఉన్న నందివాడ మండలం పుట్టగుంటలో ఆక్రమిత ప్రభుత్వ భూముల్లో అక్రమంగా తవ్వి తీసుకొచ్చిన మట్టిని ఇక్కడ పోస్తున్నారు. వ్యవసాయ భూమిని మెరక చేసి భారీగా వెంచరు వేస్తున్నారు. ఇది స్థానిక ఎమ్మెల్యే కీలక అనుచరుడి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు సమాచారం. అందుకే ఇటువైపు అధికారులెవరూ కన్నెత్తి చూడడం లేదు.
పుట్టగుంట నుంచి ఈ మట్టి లారీలు నాగవరప్పాడులోని ప్రైవేటు వెంచర్కు తీసుకెళ్లాలంటే మధ్యలో జనార్థనపురంలో ఉన్న ఆర్డీవో ట్రాక్ మీదుగానే రావాలి. టన్నుల కొద్ది అధిక లోడుతో టిప్పర్లు మట్టితో వస్తుండడంతో రహదారులు కూడా ధ్వంసమవుతున్నాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. అయినా.. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు ఉండడంతో అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోతున్నారు. వ్యవసాయ భూమిని.. వ్యవసాయేతరగా మార్చుకునేందుకు అనుమతి తీసుకున్నారంటూ గుడివాడ తహసీల్దారు కార్యాలయ అధికారులు చెబుతున్నారు. ఐదు ఎకరాలను వ్యవసాయేతరగా మార్చుకునేందుకు అనుమతులు తీసుకున్నారని చెబుతున్నారు. ఈ మట్టి గురించి మాత్రం తమకేమీ తెలియదంటూ తప్పించుకుంటున్నారు. ఆ మట్టిని తవ్విన దగ్గరే అనుమతులున్నాయా.. లేదా.. అనేది చూడాలని, తర్వాత ఎక్కడైనా తెచ్చి పోసుకోవచ్చంటూ.. దానితో తమకేం సంబంధం లేదంటూ చెబుతుండడం గమనార్హం. నందివాడలోని పుట్టగుంటలో ఆక్రమిత ప్రభుత్వ భూమిలో ఈ మట్టిని విచ్చలవిడిగా తవ్వుతూ.. దర్జాగా గుడివాడకు తెచ్చి ప్రైవేటు స్థలంలో పోస్తున్న విషయం అధికారులందరికీ తెలుసు. అయినా నందివాడ, గుడివాడ రెండు మండలాల్లోనూ రెవెన్యూ, మైనింగ్ సహా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా.. తవ్వుతున్నది మా దగ్గర కాదని ఒకరు, మట్టిని పోస్తున్నది మా దగ్గర కాదంటూ మరొకరూ సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు.
భారీ టిప్పర్లతో యథేచ్ఛగా తరలిస్తున్న మట్టి
అనుమతులపై అనుమానాలు..
నాగవరప్పాడులో మెరక చేస్తున్న భూమికి ఆనుకుని చెరువు, మురుగు కాల్వ ఉన్నాయి. వీటిని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చెరువు కట్టను మట్టితో కప్పేశారు. ఇవి రాష్ట్ర రహదారికి పక్కనే ఉండడంతో చెరువు, కాలువపై అక్రమార్కుల కన్ను ఎప్పటి నుంచో ఉంది. మెరక చేస్తున్న భూమిలో ఎన్ని సర్వే నంబర్లున్నాయి, నాలాలో దేనికోసం అనుమతి తీసుకున్నారనేది చెప్పకుండా అధికారులు సైతం గోప్యంగా ఉంచుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
పేదల ఇళ్ల లేఔట్లకు మాత్రం లేదట...
నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ మండలాల్లో పేదల ఇళ్ల కోసం కేటాయించిన జగనన్న లేఔట్లను మెరక చేసేందుకు మట్టి లేదనే కారణంతో పట్టించుకోకుండా వదిలేశారు. ఒక్క నందివాడ మండలంలోనే జగనన్న కాలనీ లేఔట్లు 27 ఉండగా.. వాటిలో కేవలం జొన్నపాడు తప్ప మరెక్కడా మెరక చేయలేదు. 26 లేఔట్లను మట్టి లేదనే సాకుతో గలికొదిలేశారు. గుడివాడ రూరల్, గుడ్లవల్లేరుల్లో ఇలాంటివి చాలానే ఉన్నాయి. ప్రస్తుతం పుట్టగుంటలో అక్రమంగా తవ్వి ఇప్పటివరకూ తరలించిన మట్టితో కనీసం 15 నుంచి 20 లేఔట్లను మెరక చేసేయొచ్చు. కానీ మట్టికి భారీ డిమాండ్ ఉండడంతో హనుమాన్జంక్షన్ సహా పలు ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ఒక్కో టిప్పర్ మట్టి నందివాడ మండలంలో రూ.10వేలు, బయటకు వెళితే.. రూ.12 నుంచి రూ.15వేల వరకూ అమ్ముకుంటున్నారు. అటు మట్టి తవ్వకాలు అక్రమమే, ఇటు అరకొర అనుమతులు తీసుకున్న ప్రైవేటు స్థలాల్లో దానిని పోయడమూ అక్రమమే.. అయినా అధికారులకు మాత్రం పట్టడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?