అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య
అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడేరు మండలంలో చోటు చేసుకుంది. జయపురం గ్రామానికి చెందిన ఆదినారాయణ(32) తన తండ్రి పేరిట ఉన్న 5 ఎకరాల భూమిలో కొన్నేళ్లుగా టమోట, మిరప, కళింగర పంటలు సాగు చేసేవాడు.
ఆదినారాయణ (పాతచిత్రం)
కూడేరు(ఉరవకొండ), న్యూస్టుడే: అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడేరు మండలంలో చోటు చేసుకుంది. జయపురం గ్రామానికి చెందిన ఆదినారాయణ(32) తన తండ్రి పేరిట ఉన్న 5 ఎకరాల భూమిలో కొన్నేళ్లుగా టమోట, మిరప, కళింగర పంటలు సాగు చేసేవాడు. రెండు మూడేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడి గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో రూ.12లక్షల వరకు అప్పులు అయ్యాయి. పంటలు పండక, వాటిని తీర్చే మార్గం కనిపించలేదు. అప్పులు తిరిగి చెల్లించాలన్నా ఒత్తిడి పెరిగింది. చేసేదేమి లేక మంగళవారం గ్రామ సమీపంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో పడి ఉండగా చికిత్స కోసం అనంతపురం తరలించగా బుధవారం మృతి చెందాడు. భార్య భూలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పెళ్లికాలేదని వాలంటీరు బలవన్మరణం
బుక్కపట్నం, న్యూస్టుడే : బుక్కపట్నంలో వాలంటీరుగా పనిచేస్తున్న చిల్లా ప్రభాకర్ (31) ఆత్మహత్యకు పాల్పడ్డారు. 30 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదని మనస్తాపానికి గురై మంగళవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. స్నేహితులను విచారించిన కుటుంబ సభ్యులు తమ పొలం వద్దకు వెళ్లారు. అక్కడ విషద్రావణం తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్న ప్రభాకర్ను చూసి.. వెంటనే ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్ఐ రంగ తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
మద్యం మత్తులో ఈతకు వెళ్లి.. విగతజీవిగా మారి..
పుట్టపర్తి గ్రామీణం, న్యూస్టుడే : మద్యం మత్తులో ఈత కొట్టేందుకు బావిలో దిగిన యువకుడు శవమై తేలాడు. ఈ ఘటన పుట్టపర్తి మండలంలోని కప్పలబండలో జరిగింది. గ్రామ రైతు చంద్రవర్ణచౌదరి వ్యవసాయ బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించి బుధవారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని బయటికి తీయించి పరిశీలించారు. బావి ఒడ్డున ఉన్న టీషర్ట్, ప్యాంట్లో ఉన్న సిమ్ కార్డుల ఆధారంగా విశాఖపట్నం చెందిన ఆముదాల పూజిత సూర్యకుమార్ (28)గా గుర్తించారు. రామకృష్ణనగర్, హెచ్పీ పెట్రోల్ బంకు చిరునామాగా కనుగొన్నారు. పోలీసుల విచారణ చేయగా.. సీకేపల్లి మండలం బసంపల్లికి చెందిన బండ్ల బానుచందర్, సూర్యకుమార్ కలిసి రైల్వే క్యాంటీన్లో పనిచేస్తుండగా.. ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. కరోనా సమయంలో బానుచందర్ స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి మంగళవారం కప్పలబండ వ్యవసాయ బావి వద్ద కలిసి మద్యం తాగారు. ఇంటికెళ్దామని పిలవగా.. బావిలో ఈత కొట్టి వస్తానని చెప్పడంతో బానుచందర్ వెళ్లిపోయాడు. బుధవారం అతను బావిలో శవమై తేలాడు. సూర్యకుమార్ ఈత రాక పోవడంతోనే మృతి చెందారా..? లేదా మరో కారణం ఏదైనా ఉందా..? అనేది పోస్ట్మార్టం రిపోర్ట్, దర్యాప్తులో తేలాల్సి ఉందని సీఐ జయనాయక్ తెలిపారు. మృతుని బంధువులు వచ్చాక వారు ఇచ్చే ఫిర్యాదును బట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు. సీఐతోపాటు ఎస్ఐ దాదాపీర్ సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంత మనవడినంటావు..గేట్లు గ్రీజుకూ డబ్బుల్లేవంటావు!
[ 07-05-2024]
మా అమ్మ వాళ్లది పెద్దపప్పూరు మండలం.. అనంతపురం జిల్లా మనవడిని అన్నావు.. సెంటుమెంట్తో ఓట్లు వేయించుకున్నావు. అదే పెద్దపప్పూరు మండలంలోని ప్రాజెక్టులను గాలికి వదిలేశావు. -
9 గంటల విద్యుత్తు.. ఎక్కడ జగన్?
[ 07-05-2024]
మాట తప్పను.. మడమ తిప్పను అన్నాడు.. సీఎం అయ్యాక మాట తప్పాడు.. హామీలను మడత పెట్టేశాడు. -
కలిసి పనిచేయండి.. విజయం సాధించండి
[ 07-05-2024]
అనంత నగరం ఆర్.కన్వెన్షన్ హాలులో సోమవారం ఉదయం తెదేపా అధినేత చంద్రబాబును కలిసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. -
బహిరంగంగా డబ్బు పంపిణీ
[ 07-05-2024]
అధికార వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది. ఎలాగైనా ఓట్లను కొనేసి గెలవడానికి అడ్డదారులను ఎంచుకుంటోంది. -
నిధులు, నీళ్లు ఇవ్వకుండా.. ఊళ్లెలా నిర్మిస్తావు జగన్
[ 07-05-2024]
ఇళ్లుకాదు.. ఊర్లే నిర్మిస్తున్నామంటూ పదేపదే గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన పేరుపై నిర్మిస్తున్న కాలనీల్లో సమస్యలు తాండవం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. -
చెరువులపై వైకాపా నాయకుల పంజా
[ 07-05-2024]
కరవునేల కదిరి ప్రాంతంలో అధికారపార్టీకి చెందిన కొందరు కబ్జా రాయుళ్ల కళ్లు చెరువులపై పడ్డాయి. -
‘సీఎం జగన్ ఓ పిచ్చోడు’
[ 07-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఓ పిచ్చోడని హిందూపురం ఎమ్మెల్యే, ప్రస్తుతం తెదేపా అభ్యర్థి బాలకృష్ణ ఆరోపించారు. -
ఎన్నికల ముందు అధికారిక తాయిలాలు
[ 07-05-2024]
ఎన్నికల ముందు గ్రామాల్లోని వైకాపా నాయకులకు జగన్ ప్రభుత్వం అధికారిక తాయిలాలు గుమ్మరిస్తోంది. -
తెదేపా ప్రచారంలో తప్పెట కొట్టాడని..
[ 07-05-2024]
తెదేపా ఎన్నికల ప్రచారంలో తప్పెట కొట్టాడని ఓ దళితుడిని వైకాపా సర్పంచి మరిది చితకబాదాడు. -
తాగునీరు కలుషితం.. 25 మందికి అస్వస్థత
[ 07-05-2024]
గుంతకల్లు మండలంలోని నెలగొండ గ్రామానికి చెందిన 25 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురై ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరారు. -
వైకాపా ప్రచారానికి వెళ్లలేదని మాజీ వాలంటీరుపై దాడి
[ 07-05-2024]
వైకాపా ప్రచారానికి వెళ్లలేదని పట్టణంలోని 19 వార్డు కౌన్సిలర్ భాగ్యమ్మ, ఆమె కుమారుడు మారుతి పరుష పదజాలంతో దుర్భాషలాడి దాడికి పాల్పడ్డారని మాజీ వాలంటీరు నళిని ఆరోపించారు. -
వైకాపా ఓటమి తథ్యం : పరిటాల సునీత
[ 07-05-2024]
రాప్తాడులో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి ఓటమి కోసం వైకాపా నాయకులంతా ఎదురుచూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ఓటమి తప్పదని మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి : మందకృష్ణమాదిగ
[ 07-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు, దేశ ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సారథ్యంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటైంది. -
అసమర్థ ప్రభుత్వాన్ని సాగనంపండి: కేశవ్
[ 07-05-2024]
తాగు, సాగు నీరు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. -
సాగు, తాగునీరు అందిస్తాం: అమిలినేని
[ 07-05-2024]
కుందుర్పి బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణాజలాలు తీసుకొచ్చి రైతులకు సాగు నీరు, అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తామని తెదేపా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. -
శింగనమలలో సుర్రుమన్న సూరీడు
[ 07-05-2024]
ఉమ్మడి అనంత జిల్లాలో సోమవారం శింగనమల మండలంలో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్