గ్రామకంఠం భూములకు ఎసరు?
ఏర్పేడు మండలం శివగిరిపల్లె సర్వే నంబరు 327లో సుమారు 10.13 ఎకరాల గ్రామకంఠం భూమిలో 2.43 ఎకరాలు శ్రీభగవాన్ వెంకయ్యస్వామి ఆలయం పరిధిలో ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు వ్యక్తులు వీఆర్వో పేరుతో నకిలీ పొజిషన్ ధ్రువీకరణ పత్రాలు
నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు
పలమనేరు పరిధిలో ఇటీవల ఇలాగే జరిగింది. వీఆర్వో పేరుతో నకిలీ ధ్రువపత్రం సమర్పించారని తేలడంతో ఇప్పుడా అధికారికి సమస్యలు ఎదురవుతున్నాయి.
గ్రామకంఠం భూములు కొట్టేసేందుకు కొందరు అక్రమార్కులు తెగబడుతున్నారు. కొందరు నకిలీ పొజిషన్ ధ్రువపత్రాలు సృష్టించి తమకు అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటుండగా.. మరికొందరు ప్రభుత్వ భూమిని ఆనుకుని ఉన్న గ్రామకంఠం భూముల సర్వే నంబర్లను వేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. దీనివల్ల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇటువంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే తహసీల్దారు స్థాయి అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొచ్చుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్లకు అనుమతించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఈనాడు-తిరుపతి
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున భూసేకరణలు చేశారు. ఎప్పటికైనా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంది. ఈ క్రమంలో అక్కడున్న గ్రామకంఠంతోపాటు ప్రభుత్వ భూములకు ఎసరు పెడుతున్నారు. ఈ భూముల సర్వే నంబర్లు సేకరించి వాటిలో ఏళ్ల తరబడి నివాసర ఉంటున్నట్లు వీఆర్వోల పేరుతో నకిలీ ధ్రువపత్రాలు రూపొందించి.. ఆయా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తమ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేసుకుని క్రయవిక్రయాలు చేపడుతున్నారు. వీటిని కొనుగోలు చేసిన వ్యక్తులు, అక్కడ నివాసం ఉంటున్న అసలు యజమానుల మధ్య వాగ్వాదాలు జరిగి ఆ తర్వాత పోలీస్స్టేషన్ల వరకు వెళ్తున్నాయి. మొత్తం రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత తహసీల్దార్ల దృష్టికి వస్తుండటంతో వాటిని రద్దు చేయాలని సబ్రిజిస్ట్రార్లకు లేఖలు రాయాల్సి వస్తోంది.
ఇంకొందరు వ్యక్తులు ఒక ప్రాంతంలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువపత్రాలు తేవాలని ఒత్తిడి చేస్తుండటంతో తమకు అనుకూలమైన సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి దరఖాస్తు చేసుకుని వాటికి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. గ్రామకంఠం భూములే కాకుండా పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. అక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు అడ్డుకుంటే న్యాయస్థానాలను ఆశ్రయించి తమకు రిజిస్ట్రేషన్ చేశారని ధ్రువపత్రాలు చూపుతున్నారు. ఇలాంటి వ్యవహారాలన్నీ ఏర్పేడు మండలం, తిరుపతి పరిసర ప్రాంతాలు, పశ్చిమ మండలాల్లోని ప్రధాన కేంద్రాల్లో జరుగుతున్నాయి. ‘గ్రామకంఠం భూముల్లో అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములకు గ్రామకంఠం పేరుతో ధ్రువీకరణ పత్రాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని జేసీ రాజాబాబు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు నామినేషన్లు తిరస్కరణ
[ 26-04-2024]
తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. -
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య