logo

నీటి తొట్టెలో మునిగి బాలుడు..

ప్రమాదవశాత్తు ఇంటి ఆవరణలోని నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని నల్లగుట్లపల్లె తండాలో సోమవారం చోటుచేసుకుంది.

Published : 21 Mar 2023 04:10 IST

తేజేష్‌ నాయక్‌ (పాత చిత్రం)

పుంగనూరు: ప్రమాదవశాత్తు ఇంటి ఆవరణలోని నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని నల్లగుట్లపల్లె తండాలో సోమవారం చోటుచేసుకుంది. బాధిత తల్లిదండ్రులు, స్థానికుల కథనం మేరకు.. తండాకు చెందిన వెంకటరమణనాయక్‌, సింధు దంపతులకు ఏకైక కుమారుడు తేజేష్‌ నాయక్‌ (18 నెలలు) ఉన్నారు. పనుల కోసం తండ్రి బయటకు వెళ్లగా తల్లి ఇంటిపనిలో నిమగ్నమైంది. బాలుడ్ని ఆవరణలో వదిలేయడంతో పాకుతూ నీటి తోట్టె వద్దకు వెళ్లి అందులో పడిపోయాడు. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. కొంతసేపటి తర్వాత తల్లి చిన్నారి కోసం బయటకు రాగా తోట్టెలో మృతదేహమై కనిపించాడు. భీతిల్లిపోయిన ఆమె కేకలకు చుట్టుపక్కల వారు వచ్చి తొట్టెలో నుంచి మృతదేహాన్ని బయటతీశారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని