శిక్షణ.. ఉపాధి నిచ్చెన
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా నైపుణ్యంతో కూడిన డ్రైవింగ్ శిక్షణ అందించడానికి హెవీ డ్రైవింగ్ స్కూల్ను ప్రారంభించింది.
ఆర్టీసీలో హెవీ డ్రైవింగ్ స్కూల్
మహిళా డ్రైవర్ పూర్ణిమ
న్యూస్టుడే, తిరుపతి(ఆర్టీసీ): నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా నైపుణ్యంతో కూడిన డ్రైవింగ్ శిక్షణ అందించడానికి హెవీ డ్రైవింగ్ స్కూల్ను ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక స్కూల్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని తిరుపతి అలిపిరి డిపోలో నెలకొల్పారు. 2020 అక్టోబరు 14వ తేదీన ప్రారంభమైన స్కూల్లో బ్యాచ్కు 16 మంది అభ్యర్థుల చొప్పున ఇప్పటి వరకు మొత్తం 18 బ్యాచ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. 19వ బ్యాచ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 290 మందికిగాను 272 మంది అభ్యర్థులు శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుని హెవీ డ్రైవింగ్ లైసెన్సుకు అర్హత సాధించారు. వీరిలో 125 మంది ఎంబీఏ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ, డిగ్రీ చదివిన వారు కాగా... మిగిలిన 147 మంది ఇంటర్మీడియట్, ఐటీఐ, పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు.
రాష్ట్రంలో రెండో స్థానం
వీరిలో ప్రస్తుతం 25 మంది ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన నూతనంగా ప్రవేశపెట్టిన విద్యుత్తు ఏసీ బస్సులకు, 10 మంది కాల్ డ్రైవర్లు (రోజువారీ వేతనం)గా వివిధ డిపోల్లో, 12 మంది వివిధ డిపోల్లో పార్కింగ్ డ్రైవర్లుగా మిగిలిన వారు కళాశాల, పాఠశాలల బస్సులకు డ్రైవర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. 30 మంది డ్రైవర్లు కావాలని కరకంబాడీలోని అమరరాజ సంస్థ కోరింది. ఇలా యువతకు నైపుణ్యంతో కూడిన శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడంలో స్కూలు రాష్ట్రంలో రెండోస్థానంలో నిలిచింది.
ప్రభుత్వం స్పందిస్తే మరింత మందికి అవకాశం
శిక్షణ పొందడానికి రూ.23,600 (జీఎస్టీ)తో కలిసి చెల్లించాలి. అంతమొత్తంలో చెల్లించాలంటే నిరుపేద నిరుద్యోగ యువతకు కష్టమవుతుందని పలువురి అభిప్రాయ పడుతున్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువతకు కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా శిక్షణ ఇచ్చేవారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో సుగాలి, ఎరుకల (ఎస్టీ)లకు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీసీ- బికి మాత్రమే ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన యువతకు అవకాశం కల్పించకపోవడం గమనార్హం. కృష్ణా జిల్లా తరహాలో తిరుపతి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువతకు ఆయా కార్పొరేషన్ల ద్వారా చేయూతనిస్తే మరింత మందికి అవకాశం కలగనుంది.
డ్రైవింగ్పై శిక్షణ
తొలి మహిళా డ్రైవర్
శిక్షణలో హెవీ లైసెన్స్ పొందిన తొలి మహిళగా తిరుపతికి చెందిన పూర్ణిమ పేరు నమోదైంది. బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన ఆమె.. తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచింది. గత ఏడాదిలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నూతన విద్యుత్తు ఏసీ బస్సుల ప్రారంభోత్సవంలో విద్యుత్తు బస్సును నడిపి ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు ద్వారా ప్రశంసలు అందుకుంది.
నైపుణ్యం కలిగిన డ్రైవర్లకు డిమాండ్
- టి.రాము, హెవీ డ్రైవింగ్ స్కూల్ సమన్వయకర్త
ప్రస్తుతం హెవీ డ్రైవర్లకు అధిక డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టు నైపుణ్యం కలిగిన డ్రైవర్లు లేరు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా అందిస్తున్న నైపుణ్యంతో కూడిన హెవీ డ్రైవింగ్ శిక్షణ యువత సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం 20వ బ్యాచ్కు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. వివరాలకు 73828 82441 చరవాణి నంబరు ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు నామినేషన్లు తిరస్కరణ
[ 26-04-2024]
తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. -
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?