YS Jagan: వై నాట్ 175 అన్నారు.. రెబల్ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారు..
వైనాట్ 175.. 175 నియోజకవర్గాల్లో గెలుస్తున్నాం.. వైనాట్ కుప్పం అంటూ.. రెండేళ్ల క్రితం కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. కుప్పం గెలిచేస్తున్నట్లు ప్రచారాలు సైతం చేసుకున్నారు.
కుప్పం పట్టణం, న్యూస్టుడే: వైనాట్ 175.. 175 నియోజకవర్గాల్లో గెలుస్తున్నాం.. వైనాట్ కుప్పం అంటూ.. రెండేళ్ల క్రితం కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి (YS Jagan) అన్నారు. కుప్పం గెలిచేస్తున్నట్లు ప్రచారాలు సైతం చేసుకున్నారు. అయితే కుప్పంలో వైకాపా శ్రేణుల మధ్య సఖ్యత లేక తరచూ జిల్లా పెద్దల వద్దకు పంచాయితీ చేరుకుంటోంది. అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి, పార్టీ మారి వచ్చిన వారికి ఛైర్మన్లుగా అవకాశం ఇస్తున్నారని.. ‘నష్ట పోయిన కార్యకర్తలు’ పేరిట అప్పట్లో వైకాపా నాయకులు సభ్యులుగా ఏర్పడి, అధికార పెద్దల వద్ద పంచాయితీ నిర్వహించడంతో వారు నచ్చజెప్పారు. ఇప్పటికే కుప్పంలో ఎమ్మెల్సీ, జిల్లా వైకాపా భరత్ రేసులో ఉండగా.. రెస్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు తాను రెబల్గా పోటీ చేస్తున్నట్లు వాసనాడు మాజీ సర్పంచి మురళి సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటిస్తున్నారు. కుప్పంలోని మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సైతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా రోజుకొకరు బరిలో ఉంటామని ప్రకటనలు చేస్తుండటంతో అధికార పార్టీకి రెబల్స్ బెడదగా మారింది.
మురళి
పార్టీ నాయకులు మోసం చేశారు..: అధికారం వస్తే సముచిత స్థానం కల్పిస్తామని ఆశ చూపి.. చివరికి అధికారం వచ్చిన తర్వాత సర్పంచి స్థానం కూడా కల్పించలేదని కుప్పం మండలం వాసనాడు గ్రామ పంచాయతీ పరిధిలోని మాజీ సర్పంచి మురళి తెలిపారు. తెదేపా అధికారంలో ఉన్న సమయంలో వైకాపా తరఫున సర్పంచిగా గెలుపొంది పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డానని, చివరికి పార్టీ అధికారం వచ్చిన తర్వాత తనను పక్కన పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు మురళి వెల్లడించారు. అధికార పార్టీ నాయకులు మోసం చేశారంటూ గతంలో ‘నష్టపోయిన కార్యకర్తలు’ పేరిట పలు కార్యక్రమాలు కుప్పం ప్రాంతంలో చేసినట్లు వివరించారు. అప్పట్లో స్థానికంగా కష్టపడిన నాయకులను గుర్తించి, సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో పార్టీ అభ్యున్నతికి తాము కష్టపడ్డామని చెప్పారు. కుప్పం వ్యవసాయ కమిటీ ఛైర్మన్గా అవకాశం కల్పించాలని అప్పట్లో జిల్లా స్థాయి నాయకులను కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు భరోసా.. సేవల్లో నిరాశ
[ 20-05-2024]
చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉండదనే విషయం వైకాపా పాలన ప్రారంభంలోనే రైతులకు అర్థమైపోయింది.. ఆర్బీకేల ద్వారా సాగు సలహాలు, సేవలందకపోయినా అన్ని రకాల ఎరువులు, విత్తనాలు అందుబాటులో లేకపోయినా.. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉత్పత్తుల రక్షణకు ముఖం చాటేసినా పంటి బిగువున భరించారు.. నష్టాలు చూడని రైతులు లేరు.. -
దూరవిద్య.. అనుమతులు అక్కర్లేదా?
[ 20-05-2024]
ఎస్వీయూకు ఉన్న 70 ఏళ్ల చరిత్ర ఆధారంగా దేశవ్యాప్తంగా.. ఎస్వీయూ దూరవిద్యా కేంద్రానికి ఉన్న గుర్తింపు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏ వర్సిటీకీ లేదు. ఎస్వీయూ పరిధిలో సాధారణ ప్రవేశాలతో పోల్చితే దూరవిద్యా కేంద్రం ప్రవేశాలు ఎక్కువగానే ఉంటాయి. -
ఇవేం పనులు రాజశేఖరా..?
[ 20-05-2024]
-
విచారణ తొక్కిపెట్టేసి..
[ 20-05-2024]
జడ్పీలో నిధుల దుర్వినియోగంపై లోకాయుక్త ఆదేశాలతో చేపట్టాల్సిన విచారణను ఆ కార్యాలయ పూర్వ అధికారి నిర్వాకంతో నెలలతరబడి నిలిచిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.. -
ఎర్రమట్టి కొల్లగొట్టి..కోట్లకు పడగలెత్తి
[ 20-05-2024]
ముఖ్యనాయకుడు.. ఇద్దరు అనుచరులు.. ఇక అడ్డేముంది.. కొండలు కరిగిపోయాయి. వందలాది టన్నుల ఎర్రమట్టి తరలిపోయింది.. ఆదాయంలో ముఖ్యనేతకు వాటా అందడంతో పూర్తి సహకారం అందించారు. ఇలా ఐదేళ్లలో ఆ ఇద్దరు నాయకులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. -
సీబీఎస్ఈ.. పాఠం బోధపడేనా?
[ 20-05-2024]
అ..ఆలు చదవలేని పరిస్థితి మన ప్రభుత్వ బడుల్లో నెలకొందని ఇటీవల ఆసర్ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం మాత్రం సీబీఎస్ఈ, ఐబీ, బైజూస్ కంటెంట్ అంటూ గందరగోళం చేస్తోంది. ప్రభుత్వ బడుల్లో గతేడాది సీబీఎస్ఈ పాఠాలు అమలుచేయగా ఈ ఏడాది పదిలో అమలు చేయాలని నిర్ణయించింది. -
ఆడపడుచు ఆరాధనకు వేళాయే..
[ 20-05-2024]
పంచభూతాలైన భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం.. దైవ స్వరూపాలు.. జలమంటే గంగమ్మ.. స్వచ్ఛత, నిర్మలత్వ స్వరూపం గంగా దేవి.. ప్రతి ఇంటి ఆడపడుచు గంగమ్మ తల్లి.. చైత్ర మాసంలో గంగమ్మను ఊరికి ఆహ్వానించి ఆరాధించే ఉత్సవమే గంగమ్మ జాతర.. -
కపిలతీర్థంపై కరుణ లేదా?
[ 20-05-2024]
తిరుపతిలో తితిదే ఆధ్వర్యంలోని ప్రధాన క్షేత్రాల్లో కపిలతీర్థం ఆలయం ఒకటి. ఈ శైవ క్షేత్రాన్ని దర్శించేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తూపోతూ ఉంటారు. -
ఏడు గంటలపాటు.. సిట్ విచారణ
[ 20-05-2024]
చంద్రగిరి నియోజకవర్గంలోని రామిరెడ్డిపల్లె, కూచువారిపల్లెలో పోలింగ్ రోజున జరిగిన గొడవలు, ఎన్నికల అనంతరం శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని స్ట్రాంగ్రూమ్ వద్ద జరిగిన దాడుల ఘటనపై దర్యాప్తు నిమిత్తం ఏర్పాటైన సిట్ బృందం ఆదివారం సుమారు ఏడుగంటలపాటు విచారణ చేపట్టింది. -
ముగిసిన శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
[ 20-05-2024]
శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం తిరుమలలో ఘనంగా ముగిశాయి. సాయంత్రం శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడ వాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. -
‘దళితుల మధ్య చిచ్చుపెట్టడం మంత్రి పెద్దిరెడ్డికి తగదు’
[ 20-05-2024]
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి, గొడవలు పెట్టడం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తగదని మండల పరిధిలోని భీమునిచెరువు దళితవాడకు చెందిన సర్పంచి మురుగేశం, గ్రామంలోని యువకులు ఆరోపించారు. -
గమ్యం చేరేలోగా మృత్యుఒడికి..
[ 20-05-2024]
ఉద్యోగోన్నతిపై ఉత్తరాఖండ్ వెళ్తూ పెనుమూరు మండలం గుంటిపల్లె పంచాయతీ కనికాపురం గ్రామానికి(చిత్తూరు సమీప మురకంబట్టు) చెందిన సైనికుడు రైలు నుంచి జారిపడి మృతిచెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు