logo

పుత్తూరులో ‘ప్రజాగళం’ రేపు

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు బుధవారం  పుత్తూరులో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించనున్నారని నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ పేర్కొన్నారు.

Published : 26 Mar 2024 04:32 IST

పుత్తూరులో మాట్లాడుతున్న గాలి భానుప్రకాష్‌

పుత్తూరు, నగరి, నిండ్ర, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు బుధవారం  పుత్తూరులో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించనున్నారని నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ పేర్కొన్నారు. నగరి, పుత్తూరు, నిండ్ర మండలాల్లో ఆయన నాయకులతో సమావేశం నిర్వహించారు. పుత్తూరు పట్టణం కార్వేటినగర్‌ రోడ్డు కాపువీధి కూడలి వద్ద మధ్యాహ్నం 2 గంటలకు సభ జరుగుతుందని, అందరూ కలసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పుత్తూరు సమీపంలో చంద్రబాబు దిగే హెలీప్యాడ్‌ పనులను ఆయన పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని