logo

రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిట

సంక్రాంతి పండగకు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చి తిరిగివెళ్లే ప్రయాణికులతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. రద్దీకి అనుగుణంగా సోమవారం ఇటు రైల్వే అటు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపాయి. జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి ఆయా జిల్లాలకు 54 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిచాయి. వీటిలో హైదరాబాద్‌కు 20,

Published : 18 Jan 2022 04:20 IST


ప్రయాణికులతో రద్దీగా ఉన్న రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: సంక్రాంతి పండగకు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చి తిరిగివెళ్లే ప్రయాణికులతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. రద్దీకి అనుగుణంగా సోమవారం ఇటు రైల్వే అటు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపాయి. జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి ఆయా జిల్లాలకు 54 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిచాయి. వీటిలో హైదరాబాద్‌కు 20, విశాఖకు 21, విజయవాడకు 9, బత్తిలి, సాలూరు, పార్వతీపురం తదితర దూరప్రాంతాలకు మరో నాలుగు ప్రత్యేక సర్వీసులు తిప్పినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మంగళ, బుధవారాల్లో ఈ సర్వీసులు మరిన్ని పెరగవచ్చని చెబుతున్నారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలకు తిరిగే షెడ్యూల్‌ బస్సుల్లోనూ ప్రయాణికులు రద్దీ కొనసాగింది. రాజమహేంద్రవరం-కాకినాడ నాన్‌స్టాప్‌ టికెట్‌ కౌంటర్‌ వద్ద ప్రయాణికులు క్యూ కట్టారు.

ఇటు దక్షిణ మధ్య రైల్వే జిల్లా మీదుగా మూడు ప్రత్యేక సర్వీసులు నడిపింది. కాకినాడ-లింగంపల్లి(07491), ఎలాహంకా-విశాఖపట్నం(08578), కాకినాడ-సికింద్రాబాద్‌(07539) ప్రత్యేక రైళ్లు నడిచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మంగళవారం జిల్లామీదుగా కాకినాడ-సికింద్రాబాద్‌(07537), విశాఖపట్నం -సికింద్రాబాద్‌(08585), కాకినాడ-సికింద్రాబాద్‌(07537) ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు