logo

మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. పోరంకి శ్రీనివాసనగర్‌లో నివాసం ఉండే గండి శ్రీరామ్‌ప్రకాష్‌, సత్యఅనిత సింధు భార్యాభర్తలు. వారికి పదేళ్ల క్రితం వివాహం కాగా ఓ కు

Published : 24 Jan 2022 05:04 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. పోరంకి శ్రీనివాసనగర్‌లో నివాసం ఉండే గండి శ్రీరామ్‌ప్రకాష్‌, సత్యఅనిత సింధు భార్యాభర్తలు. వారికి పదేళ్ల క్రితం వివాహం కాగా ఓ కుమార్తె ఉంది. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంటారు. అతడి కుటుంబానికి కాకినాడలో ఓ ఇల్లు ఉండగా.. దానిని అత్తింటివారు ఇటీవల విక్రయించారు. తమకు రావాల్సిన వాటాను అత్తింటివారు ఇవ్వడం లేదని ఈమె తరచూ తన సోదరుడితో చెప్పి బాధపడేది. అత్తింటివారిని అడుగుతున్నా వాటా ఇవ్వాల్సిన పనిలేదంటూ ఈమెతో వివాదానికి దిగుతూ వేధించేవారు. ఈ నెల 22న అనితసింధుకు అనారోగ్యంగా ఉందని వెంటనే బయల్దేరి రావాలంటూ ఆమె భర్త రాజోలులోని తన బావమరిది రాజశేఖర్‌కు సమాచారం అందించగా అతను పోరంకి వచ్చారు. అప్పటికే తన సోదరి అనితసింధు పురుగులమందు తాగి మృతిచెంది ఉండడాన్ని రాజశేఖర్‌ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తింటి వేధింపులే తన సోదరి మృతికి కారణమంటూ రాజశేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్త శ్రీరామ్‌ప్రకాష్‌, అత్త అనంతలక్ష్మి, మామ రామకృష్ణ, బంధువులు కొల్లేపల్లి శారదకామేశ్వరి, వెంగలశెట్టి ప్రసన్నలక్ష్మి, వెంగలశెట్టి అచ్చర్లరావు, కొల్లేపల్లి శ్రీనివాసరావులపై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని