ఆపత్కాలం.. అందని వైద్యం
వైద్యం జిల్లా పరిధిలో ఇటీవల వాహన రద్దీ విపరీతంగా పెరిగింది. రోడ్లు సైతం అధ్వానంగా మారడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో క్షతగాత్రులకు సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలమీదకు వస్తోంది. రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడి
ఆసుపత్రిలో మూసి ఉన్న ట్రామాకేర్ వార్డు
కోరుకొండ మండలానికి చెందిన ఓ వ్యక్తి గత నెలలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తలకు గాయం కావడంతో ప్రథమ చికిత్స చేయించి రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రికి తీసుకొచ్చారు. న్యూరో సర్జన్ సేవలు అవసరం కావడంతో ఇక్కడ వైద్యుడు లేరు. సంబంధిత వైద్యుడు కాకుండా మరో స్పెషాలిటీ వైద్యుడు సేవలందిస్తుండడంతో కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా శస్త్రచికిత్స చేశారు.
నగరంలోని లాలాచెరువు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ద్విచక్రవాహనంపై జాతీయ రహదారిపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన రాజమహేంద్రవరం వైద్యశాలకు తరలించారు. తలకు గాయం కావడంతో అతనికి ప్రథమ చికిత్స చేసి కాకినాడ జీజీహెచ్కు తరలించారు.
న్యూస్టుడే, రాజమహేంద్రవరం: వైద్యం జిల్లా పరిధిలో ఇటీవల వాహన రద్దీ విపరీతంగా పెరిగింది. రోడ్లు సైతం అధ్వానంగా మారడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో క్షతగాత్రులకు సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలమీదకు వస్తోంది. రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడి అత్యవసర పరిస్థితుల్లో వచ్చేవారికి ప్రత్యేక వైద్యం అందేలా 2010లో ఏర్పాటు చేసిన ట్రామాకేర్ సేవలు మూలకు చేరాయి. దీంతో తలకు తీవ్ర గాయాలతో వచ్చేవారికి ప్రాథమిక చికిత్స చేసి కాకినాడ జీజీహెచ్కు పంపేస్తున్నారు. దీంతో కొందరు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతుంటే, నిరుపేదలు చేసేదిలేక కాకినాడ వెళ్లి చికిత్స పొందుతున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వైద్యకళాశాల బోధనాసుపత్రిగా మారినా పూర్తిస్థాయిలో సేవలు అందడానికి మరొక ఏడాది పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రామాకేర్ సెంటర్ సేవలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది.
వసతులున్నా వైద్యుల్లేరు..
రాజమహేంద్రవరం ఆసుపత్రిలో 15 పడకలతో ట్రామాకేర్ విభాగానికి అత్యాధునిక సదుపాయాలు, వసతులు కల్పించడంతోపాటు అప్పట్లో 11 మంది వైద్యులు, 21 మంది నర్సులతోపాటు మరో 43 మంది ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం వైద్యుడు, స్టాఫ్ నర్సులు, ఈసీజీ టెక్నీషియన్, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర విభాగాల్లో సిబ్బంది అందుబాటులో లేరు. ఇందులో ప్రస్తుతమున్న 25 మంది సిబ్బందిని ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో వినియోగిస్తున్నారు. ఎనిమిది నెలలకోసారి వేతనాలు ఇస్తుండడంతో ఉద్యోగులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రామాకేర్ వార్డు మూసి ఉంచడంతో లోపల పరికరాలు దెబ్బతింటున్నాయి. ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగంలో పది మంది సీఎంవోలు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రామాకేర్లో వైద్యులను భర్తీ చేసినా ఆసుపత్రిలో అత్యవసర వైద్యసేవలకు ఆటంకం లేకుండా ఉంటుందని రోగులు కోరుతున్నారు.
మూతపడిన విభాగం
జాతీయ రహదారికి అనుకుని ఉన్న ఆసుపత్రుల్లో ట్రామాకేర్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రమాదం జరిగిన గంటలోపే వారికి పూర్తిస్థాయి వైద్యసేవలు అందించడంతోపాటు ప్రాణనస్టాన్ని నివారించేలా కేంద్రం ప్రభుత్వం 2010లో చర్యలు చేపట్టింది. అయిదేళ్లు పూర్తిస్థాయిలో సేవలందినా తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాయి. అప్పటి నుంచి వైద్యసేవలందడం లేదు. దీంతో ప్రమాదాల్లో గాయపడిన వారు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ప్రైవేటు ఆసుపత్రులు, కాకినాడ జీజీహెచ్కు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటోంది.
మూలకు చేరిన సీటీ స్కాన్
రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయమై ప్రభుత్వాసుపత్రికి వచ్చేవారికి సీటీ స్కాన్ తీసేవారు. రెండేళ్ల నుంచి ఈ యంత్రం కూడా మూలకు చేరింది. ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశాల్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా మోక్షం లభించలేదు. సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.1.30 కోట్ల వ్యయంతో యంత్రాన్ని కొనుగోలు చేయాలని చూసినా నేటికీ కొలిక్కి రాలేదు.
అధికారుల మాటిదీ..
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వైద్యకళాశాల, బోధనాసుపత్రిగా మారడంతో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ఆసుపత్రి ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏపీ పవర్గ్రిడ్ కంపెనీ నుంచి సిటీ స్కాన్ యంత్రం తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..