మొరాయించిన సమీకృత హాజరు యాప్..
రాష్ట్రంలో ఉపాధ్యాయులంతా మంగళవారం నుంచి విధిగా తొమ్మిది గంటల్లోగానే హాజరు వేయాలి. అది కూడా కొత్తగా రూపొందిన సిమ్స్ యాప్లోనే ముఖచిత్ర పద్ధతిలో నమోదు చేయాలి..
ఉపాధ్యాయులకు పరీక్షగా మారిన సర్వర్లు
అద్దంపల్లిలో ఉదయం 8.35 నుంచి హాజరు వేయడానికి పాట్లు
న్యూస్టుడే, పామర్రు, మండపేట: రాష్ట్రంలో ఉపాధ్యాయులంతా మంగళవారం నుంచి విధిగా తొమ్మిది గంటల్లోగానే హాజరు వేయాలి. అది కూడా కొత్తగా రూపొందిన సిమ్స్ యాప్లోనే ముఖచిత్ర పద్ధతిలో నమోదు చేయాలి.. లేకపోతే అర్హత ఉన్న సెలవుగా డీడీవో పరిగణిస్తారని విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో క్షేత్రస్థాయిలో ఈ ఆదేశాలు కచ్చితంగా అమలు కావడానికి తగిన ఏర్పాట్లు చేయడంలో మాత్రం విఫలమయ్యారు. తొలుత ఉపాధ్యాయులంతా తమ చరవాణిలో సంబంధిత యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. తరువాత వీరిని ప్రధానోపాధ్యాయులు తమ లాగిన్లో రిజిస్టరు చేయాలి పలువురికి మంగళవారం ఉదయానికి కూడా ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. ఏదోలాగ పాట్లు పడి చాలా మంది రిజిస్టరు చేశారు. మంగళవారం ఉదయం అన్ని పాఠశాలల్లో కూడా ఉదయం 8.35 నుంచే ఉపాధ్యాయులు కొత్త సమీకృత యాప్లో హాజరు వేయడానికి ప్రయత్నించారు. 8.30 గంటలకు ప్రయత్నించిన కొంత మందికి అయ్యిందని తరువాత ఎవరికీ అవ్వలేదని చెబుతున్నారు. ఓ పక్క ఉపాధ్యాయ సంఘాలు, ఫ్యాప్టో నాయకులు ఈ యాప్ను ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకోవద్దని చెప్పారు. అయినా కూడా చాలా మంది హాజరు వేయడానికే మొగ్గు చూపి ప్రయత్నించినా కూడా ఫలితం దక్కలేదు. సుమారు అరగంట పైగా ఎంతో సహనంతో పలు రకాలుగా ప్రయత్నించామని, కొత్త యాప్లో హాజరు నమోదు కాలేదని ఉపాధ్యాయులు చెప్పారు. పాత రిమ్స్ యాప్లో వేద్దామనుకున్నా అది కూడా సరిగా పని చేయలేదని చెప్పారు. యాప్లను సరిగా రూపాందించాలని, తగిన సర్వర్లును ఏర్పాటు చేయాలని అలా చేయలేని పక్షంలో ఎప్పటికీ ఈ పాట్లు తమకు తప్పవని అంటున్నారు. ఇది పరోక్షంగా బోధన మీద కూడా ప్రభావం చూపుతుందని విశదపరుస్తున్నారు.
సాంకేతిక ఇబ్బందులు సరిచేస్తారు..
కొత్త సమీకృత యాప్లో మంగళవారం నుంచి ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరును కచ్చితంగా నమోదు చేయాలని రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఇప్పటికే చాలా మంది ఉపాధ్యాయులు యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా కొంత మంది ఇన్స్టాల్ చేసుకోకపోవడం, డీడీవోలు రిజిస్టరు చేయకపోవడం జరిగింది. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల ఉపాధ్యాయులు అందరూ బుధవారం ఉదయానికి తప్పకుండా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఉపాధ్యాయుల నమోదులో ఎంఈవోలు, హెచ్ఎంలు అలసత్వం ప్రదర్శించవద్దు. తొలిరోజు యాప్ సర్వర్ సామర్థ్యం తక్కువగా ఉండడం, యాప్ వాడే చరవాణి అంతర్జాల వేగం అంతగా ఉండక పోవడం, క్యాప్చా వేలిడేషన్ కాలంతో జతకాకపోవడం తదితర కారణాలతో యాప్ పనిచేయలేదు. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖకు తెలియచేశాం. యాప్ నిర్వహిస్తున్న టీసీఎస్ అధికారులతో మాట్లాడి సాంకేతిక ఇబ్బందులు సరిచేస్తామన్నారు. ఉపాధ్యాయులకు సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా యాప్ను మెరుగు దిద్దుతాం. అందరూ కూడా ప్రభుత్వ ఆదేశాలు విధిగా పాటించాలి. -ఎన్.వి.రవిసాగర్, జిల్లా విద్యాశాఖాధికారి, డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్