తేల్చుడులేదు.. నాన్చుడే!
‘‘కనిపించే మూడు సింహాలు.. చట్టానికి.. న్యాయానికి.. ధర్మానికి ప్రతిరూపాలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా.. పోలీస్’’ ..ప్రజాహితాన్ని కాంక్షించి..
ఈనాడు - రాజమహేంద్రవరం
‘‘కనిపించే మూడు సింహాలు.. చట్టానికి.. న్యాయానికి.. ధర్మానికి ప్రతిరూపాలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా.. పోలీస్’’ ..ప్రజాహితాన్ని కాంక్షించి.. నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ.. అక్రమాలు అరికట్టి.. శాంతిభద్రతలు కాపాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అన్యాయాన్ని ప్రతిఘటించే ప్రతి పోలీసుకూ ఈ వ్యాఖ్యలు సరిపోతాయి.. కానీ కాస్తోకూస్తో నిజాయతీగా పని చేద్దామనుకుని బాధ్యతలు చేపట్టిన వారి ముందరి కాళ్లకు రాజకీయ ఒత్తిళ్లతో బంధం వేస్తూ విచారణను నీరుగారుస్తున్నారు. వెరసి బలమున్నోడికో న్యాయం.. సామాన్యుడికో న్యాయం అన్నట్లుగా వ్యవహారం తయారైంది. ఓ నాయకుడు మట్టి లారీతో తొక్కించేస్తానని.. ఇంకో నాయకుడు భూమిలో కప్పెట్టేస్తానని హెచ్చరిస్తే.... మరో నాయకుడు ఏకంగా చంపేస్తానని బాహాటంగా బెదిరించిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసినా పోలీసులు కనీసం స్పందించే సాహసం చేయడంలేదు. ప్రజాప్రతినిధులు, నాయకుల పాత్ర ఉందనే ఆరోపణలున్న కీలక కేసులు కొలిక్కిరాని దయనీయమిది.
అనంత దారుణాలు చూడరే..
ఈ ఏడాది మే 19న ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. ఈ కేసులో నేటికీ పూర్తిస్థాయి ఛార్జిషీట్ పోలీసులు దాఖలు చేయలేదు. లోతుగా విచారణ చేయాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానం ముందు చెబుతున్నా.. ఆ దిశగా పురోగతి లేదు. కీలకమైన సెల్టవర్ లొకేషన్, ఇతర నిందితుల జాడే లేదు. డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును మే 23న అరెస్టు చేసిన పోలీసులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. పోలీసుల వైఫల్యాన్ని సాకుగా చూపి నిందితుడు బెయిల్ కోసం ప్రయత్నిస్తుంటే.. పోలీసులు మాత్రం విచారణ కొలిక్కి తేలేకపోతున్నారు. సుబ్రహ్మణ్యం కుటుంబీకులు గవర్నర్ను కలిసి కేసు సీబీఐకి అప్పగించి అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని కోరడంతోపాటు.. న్యాయం కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులను కూడా ఆశ్రయించారు.
రాజకీయ జోక్యంతో అలజడి..
అల్లర్లలో దహనమైన బస్సు
కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారంలో రాజకీయ జోక్యం అమలాపురాన్ని రణరంగంగా మార్చేసింది. మే 24 నాటి అల్లర్లలో మంత్రి, ఎమ్మెల్యే నివాసాలతోపాటు ప్రభుత్వ ఆస్తులనూ ఆందోళనకారులు తగలబెట్టారు. ఈ కేసులో ఇప్పటివరకు వివిధ పార్టీలకు చెందిన 256 మందిని పోలీసులు అరెస్టుచేశారు. అల్లర్లకు మరింత ఆజ్యం పోసేలా ఓ కీలక నాయకుడి కుమారుడు ఓ ప్రజాప్రతినిధిని చంపేస్తానని బెదిరించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసినా.. రాజకీయ ఒత్తిళ్లకు బెదిరి కనీసం వీటిపై విచారణకూ సాహసించలేదు. అమలాపురం అల్లర్ల కేసులో అన్ని పార్టీల వారి ప్రమేయాన్ని పోలీసులు గుర్తించినా.. కుట్రకు సూత్రధారి ఎవరనేది నేటికీ తేల్చలేకపోయారు.
ప్రాణం పోయినా పట్టింపేది?
మా ఇల్లు పడగొట్టేశారు.. మా బిడ్డలను మాకు కాకుండా చేస్తున్నారు.. చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. మీకో దండం.. పురుగుల మందు తాగి చస్తున్నామని సెల్ఫీ వీడియో తీసుకుని బిక్కవోలు మండలం బలభద్రపురం శివారు మామిడితోటకు చెందిన తల్లీకొడుకు కోటిపల్లి కామాక్షి, మురళీకృష్ణ నవంబరు 14న ఆత్మహత్యాయత్నం చేశారు. వైకాపా నాయకుల వేధింపులే కారణమని బాధితులు, బాధిత కుటుంబికులు అప్పట్లో ఆరోపించారు.
పురుగు మందు తాగిన వారిలో తల్లి కామాక్షి మృత్యువాత పడితే.. కొడుకు ఆరోగ్యం పూర్తిస్థాయిలో కుదుటపడలేదు. ఇంత బాహాటంగా బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి చాటినా.. ఆ నలుగురే కారణమంటూ పేర్లు చెప్పి మరీ ఆరోపించినా.. ఆ వారిని కనీసం ప్రశ్నించే సాహసం పోలీసులు చేయలేదు. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
గతితప్పుతోంది...
రాజమహేంద్రవరంలో ఉద్రిక్తత (పాత చిత్రం)
కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూ.గో. జిల్లాల్లో ఇటీవల వివాదాస్పదమైన కీలక కేసుల్లో రాజకీయ ప్రమేయంపై ఆరోపణలు వస్తున్నాయి. శాంతిభద్రతలు గతితప్పడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడం ఏంటన్న ఆక్షేపణ వ్యక్తమవుతోంది. రాజమహేంద్రవరంలో అమరావతి రైతుల పాదయాత్రపై దాడి కేసులో రైతులు ఇచ్చిన ఫిర్యాదుపై నేటికీ కదలిక లేదు.. బీ రామచంద్రపురంలో రథం నుంచి హార్డ్డిస్క్ల స్వాధీనం వ్యవహారంపైనా స్పష్టత లేదు. అల్లర్లకు, శాంతిభద్రతలు గతితప్పడానికీ నిఘా వ్యవస్థ సమర్థంగా లేకపోవడం.. ఉదాసీనతే కారణంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీసిన కేసుల్లోనూ పురోగతి కనిపించని పరిస్థితి పోలీసుల పనితీరునే ప్రశ్నిస్తోంది.
దాడి చేసినా దాపరికమే
భవానీ భక్తుడిలా వచ్చి తునికి చెందిన తెదేపా సీనియర్ నేత పోల్నాటి శేషగిరిరావుపై కత్తితో ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. హత్యాయత్నం కుట్ర వైకాపా నాయకులదే అని తెదేపా నాయకులు ఆరోపిస్తుంటే.. భూవివాదాలు, ఆర్థిక లావాదేవీ విషయంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చని వైకాపా నాయకులు అంటున్నారు. కేసు విచారణపై భిన్నస్వరాలు వినిపిస్తున్నా.. నిజాలేంటో పోలీసుల విచారణలో తేల్చాల్సి ఉంది. శేషగిరిరావుపై హత్యాయత్నం కేసులో పోలీసులు అరెస్టు చేసిన నిందితుడిని కోర్టు అనుమతితో పోలీసులు మూడు రోజులు కస్టడీకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా పెద్దాపురం డీఎస్పీ మురళీమోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సాక్ష్యాల సేకరణతోపాటు.. ఇతర నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. దాడికి ఉపయోగించిన కత్తి అనకాపల్లి జిల్లా నామవరం ప్రాంతంలో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
8 మంది వాలంటీర్లు తెదేపాలో చేరిక
[ 10-05-2024]
జగ్గంపేట తెదేపా కార్యాలయంలో నాయకులు నంది బాలకృష్ణ, గ్రామ ఉపసర్పంచ్ నంది రాజారావు ఆధ్వర్యంలో 8 మంది వాలంటీర్లు తెదేపాలో చేరారు. -
ఓటర్ స్లిప్ చూపించు.. రూ.3 వేలు తీసుకో..! జోరుగా వైకాపా నగదు పంపిణీ
[ 10-05-2024]
కొత్తపల్లి మండలంలో గత రెండు రోజులుగా నిత్యం అర్ధరాత్రి వరకు ఓటుకు నోట్ల పంపిణీ జరుగుతోంది. వైకాపా నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటరు స్లిప్పుల ఆధారంగా ఒక్కో ఓటుకు రూ.3వేలు చొప్పున అందజేస్తున్నారు. -
ప్రశ్నిస్తే దాడి.. పోరాడితే కేసు
[ 10-05-2024]
వైకాపా పాలనలో ఎవరైనా ప్రశ్నిస్తే దాడే.. పోరాడితే కేసే..పేదల నుంచి పెద్దల వరకు ఎదుర్కొన్న అణచివేత ఇది. విధ్వంసం నుంచి మొదలై.. వినాశనం వరకు అయిదేళ్ల పాలన సాగింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని నిలదీస్తే.. సామాన్యుడైనా, ప్రతిపక్ష నేతైనా నిర్బంధం, కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. -
అప్పుల ఆంధ్రాగా మార్చేశారు
[ 10-05-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసిందని ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
అయిదేళ్లలో రైతులను నిండా ముంచారు!
[ 10-05-2024]
ఎర్రకాలువకు వరదొస్తే నిడదవోలు, నల్లజర్ల, దేవరపల్లి, చాగల్లు మండలాల రైతులు వణికిపోతున్నారు. దీని ప్రవాహ సామర్థ్యం 20 వేల క్యూసెక్కులు. -
అన్నంపెట్టినా.. కడుపు మంటేనా!
[ 10-05-2024]
హాట్ బాక్సుల్లో వేడివేడి పదార్థాలు ఆకలితో అక్కడికి అడుగుపెట్టేవారికి ఆహ్వానం పలికేవి. రూ.5 నామమాత్రంగా చెల్లించి అన్నదాతా.. సుఖీభవ అని దీవించి వెళ్లేవారు. ఇదీ తెదేపా హయాంలో అన్న క్యాంటీన్ల వద్ద నిత్యం కనిపించే పరిస్థితి. -
జగన్ ఏలుబడి.. పర్యాటకం చతికిలపడి..!
[ 10-05-2024]
‘వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పర్యాటకం అంటే ప్రజలు అంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తాం..’ అంటూ జగన్’ ఊదరగొట్టినా.. అయిదేళ్లలో కొత్త ప్రాజెక్టుల ఊసే లేకపోగా ఉన్న పర్యాటకం పడకేసింది. -
రాజీ మార్గంలో కేసులు పరిష్కరించాలి
[ 10-05-2024]
రాజీ పడదగిన అన్ని రకాల కేసులను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. -
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: రుద్రరాజు
[ 10-05-2024]
కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ప్రజల నుంచి స్పందన వస్తోందని రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. -
ఆహ్లాదానికి రుసుం.. అడిగితే అభివృద్ధి జపం
[ 10-05-2024]
నగరం నడిబొడ్డున ఉన్న కంబాల చెరువును రూ.13 కోట్లు పెట్టి అభివృద్ధి చేశారు. లోపలకు అడుగుపెట్టి ఆస్వాదించాలంటే ఒక్కరికి తక్కువలో తక్కువ రూ.500 జేబులో ఉండాలి. -
ఓట్లకు ‘సామాజిక’ గాలం
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాల్లో వారు మునిగితేలుతున్నారు. ప్రధానంగా అమలాపురం నియోజకవర్గంలో ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. -
ఈ ఇంట్లో ఓట్లు అమ్ముకోం!
[ 10-05-2024]
ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు తాయిలాల పంపిణీపై దృష్టి సారించారు. ఈ తరుణంలో స్థానిక రథం సెంటరులో 90 ఏళ్ల వృద్ధురాలు భమిడిపాటి శేషారత్నం తన ఇంటి వద్ద ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీ ఆకట్టుకుంటోంది. -
ఏ తల్లి కన్నబిడ్డో..!
[ 10-05-2024]
ఏ తల్లి కన్నదో తెలియదుకాని.. అభంశుభం తెలియని ఓ శిశువు మురుగు కాలువలో మృతదేహంగా కనిపించడం స్థానికులను ఆవేదనకు గురిచేసింది. రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. -
అటు ఎన్నికలు.. ఇటు సెలవులు
[ 10-05-2024]
ఇటు ఆర్టీసీలో, అటు రైల్వేలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దూరప్రాంత సర్వీసులకు టికెట్ రిజర్వేషన్ దొరకని పరిస్థితి నెలకొంది. వరుస సెలవులు.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో మరింత రద్దీ పెరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్