డీజిల్ మాయాజాలం..?
కాకినాడ కార్పొరేషన్లో డీజిల్ బిల్లులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పారిశుద్ధ్య విభాగంలో వినియోగిస్తున్న వాహనాలకు నెలవారీ బిల్లులు అధికంగా చూపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాకినాడ కార్పొరేషన్ డిపోలో వాహనాలు
న్యూస్టుడే, బాలాజీచెరువు (కాకినాడ): కాకినాడ కార్పొరేషన్లో డీజిల్ బిల్లులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పారిశుద్ధ్య విభాగంలో వినియోగిస్తున్న వాహనాలకు నెలవారీ బిల్లులు అధికంగా చూపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెలకు రూ.10 లక్షల వరకు అదనంగా సమర్పిస్తున్నట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ప్రతీ నెలా ఆయా వాహనాలకు రూ.20 లక్షల వరకు ఇంధనం ఖర్చవుతుండగా రూ.30 లక్షల వరకు బిల్లులు పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉండగా నెలకు రూ.20 లక్షల వరకు డీజిల్ ఖర్చులు చూపేవారు. గత ఏప్రిల్లో ఆయన బదిలీపై వెళ్లడంతో అప్పటి నుంచి నెలకు రూ.30 లక్షల చొప్పున బిల్లులు సమర్పిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పద్దుల విభాగం అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. గత పది నెలల కాలంలో సమర్పించిన బిల్లులపై విచారణకు ఆయన ఆదేశించారు. వాహనాల లాగ్బుక్లు, బిల్లులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. పారిశుద్ధ్య విభాగంలోని ప్రతీ వాహనం రోజూ ఎన్ని కిలోమీటర్ల దూరం తిరిగింది.. ఎంత డీజిల్ ఖర్చయ్యింది.. ఆయా వాహనాలకు ఇంధనం సరఫరా చేస్తున్న బంకులో నమోదుచేసిన వివరాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీచేశారు. ఈ 10 నెలల కాలంలో దాదాపు రూ.కోటి వరకు అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కార్పొరేషన్ వాహనాలను ఏడాది కాలంలో ఏ అధికారి పర్యవేక్షంచారు, ప్రతీ నెలా ఎంతెంత బిల్లులు సమర్పించారనే విషయాలపై విచారణ చేపట్టారు. నగరంలో ఇంటింటా చెత్త సేకరణకు 108 హూపర్ టిప్పర్ వాహనాలను ప్రస్తుతం వినియోగిస్తున్నారు. వీటి నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఇవి కాకుండా పారిశుద్ధ్య విభాగంలో వినియోగిస్తున్న సొంత వాహనాలు, ట్రాక్టర్లు, కాంపెక్టర్లు, జేసీబీలు, ఇతర వాహనాలకు వినియోగించిన ఇంధన బిల్లులపై మళ్లీ విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే రూ.కోటి వరకు బిల్లులు సీఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉండగా వీటిని మంజూరు చేసేలోగా కార్పొరేషన్ పద్దుల విభాగానికి సమర్పించిన బిల్లులపై శల్య శోధన చేయనున్నారు. కార్పొరేషన్లో వాహనాలకు వినియోగిస్తున్న డీజిల్, పెట్రోల్పై థర్డ్ పార్టీతో విచారణ చేయిస్తే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ సొంత వాహనాల పరిస్థితి..
కార్పొరేషన్కు సొంతంగా 52 వాహనాలున్నాయి. వీటిలో 18 ట్రాక్టర్లు, 15 కాంపెక్టర్లు, నాలుగు టిప్పర్లు, ఒక జేసీబీ, ఒక బుల్, ఒక బ్లేడ్ తదితర వాహనాలను నగరంలోని 14 సర్కిళ్ల పరిధిలో వాడుతున్నారు. ఆయా వాహనాలకు స్థానికంగా ఓ పెట్రోల్ బంకు నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఏ వాహనం ఎక్కడ పనిచేసింది.. ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఎన్ని లీటర్ల డీజల్ ఖర్చయిందనే వివరాలను లాగ్బుక్లో రోజూ నమోదు చేస్తారు. దీని ఆధారంగానే ప్రతీ నెలా బిల్లులు సమర్పిస్తారు. ఈ విభాగాన్ని శానిటరీ ఇన్స్పెక్టర్ పర్యవేక్షిస్తారు. ఏడాది కాలంలో ఇద్దరు పనిచేశారు.
జీపీఎస్ అటకెక్కింది..
నగర పరిధిలోని వినియోగించే వాహనాలకు జీపీఎస్ పరికరాలు అమర్చారు. వెహికల్ ట్రాకింగ్ సిస్టం అమలు చేస్తున్నారు. దీన్ని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)కి అనుసంధానం చేశారు. గతేదాడి మార్చి నుంచి ఇది పనిచేయడంలేదు. నిర్వహణ సంస్థ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అప్పటి నుంచి కార్పొరేషన్ సొంత వాహనాలకు జీపీఎస్ పరికరాలున్నా అవెక్కడున్నానే పరిశీలన ప్రక్రియ నిలిచిపోయింది. ఈ కారణంగా గతేడాది మార్చి నుంచి ఇష్టారాజంగా బిల్లులు పెట్టినట్లు తెలుస్తోంది. ఐసీసీసీ మనుగడలో లేకపోవడం అక్రమాలకు తావిచ్చినట్లయింది.
ఏళ్ల తరబడి ఒకటే బంకు..
కార్పొరేషన్ పరిధిలోని సొంత వాహనాలకు స్థానికంగా ఓ పెట్రోలుబంకు నుంచే కొన్నేళ్లుగా డీజిల్, పెట్రోలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఐఏఎస్ కమిషనర్ తప్పుబట్టారు. నగరంలోని 14 శానిటేషన్ సర్కిళ్ల పరిధిలో ఏడు సర్కిళ్లకు పాత ఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న పెట్రోలుబంకు, మిగిలిన ఏడు సర్కిళ్లలోని వాహనాలకు స్థానిక కల్పన కూడలిలోని బంకులో డీజల్, పెట్రోలు తీసుకోవాలని నిర్ణయించి, అమలు చేశారు. ఇది ఎంతోకాలం నిలవలేదు. రాజకీయ పైరవీలతో మళ్లీ పాత పెట్రోల్ బంకు నుంచే ఆయిల్ కొనుగోలు చేసుకునేలా ఒత్తిడి తెచ్చిన కొందరు సఫలీకృతమయ్యారు.
ఫాగింగ్ యంత్రాలదీ అదే దారి..?
కార్పొరేషన్ పరిధిలో 24 ఫాగింగ్ యంత్రాలున్నాయి. ప్రతీ నెలా రూ.8 లక్షల వరకు డీజిల్, పెట్రోల్ బిల్లులు పెడుతున్నా ఇవి నగరంలో ఎక్కడా తిరిగినట్లు కనిపించడం లేదు. కార్పొరేషన్ స్పందనలోనూ దోమల బెడదపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. వీటిని పూర్తిస్థాయిలో వినియోగించకపోయినా, బిల్లులు మాత్రం యథావిధిగా సమర్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫాగింగ్, పారిశుద్ధ్య పనుల నిర్వహణకు రసాయనాలు, సామగ్రిని సరఫరా చేసేందుకు కార్పొరేషన్ ఓ స్టోర్ నిర్వహిస్తోంది. ఏటా ఇక్కడ రూ.కోటికి పైగా నిధులు వెచ్చిస్తున్నారు. దీనిపైనా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని అధికారులే చెబుతున్నారు.
విచారణకు ఆదేశించాం..
- కె.రమేశ్, కమిషనర్, కాకినాడ కార్పొరేషన్
పారిశుద్ధ్య వాహనాల బిల్లుల వ్యవహారం మా దృష్టికి వచ్చింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. గత ఏడాది కాలంలో బిల్లులపై అన్ని కోణాల్లోనూ తనిఖీ చేస్తాం. ప్రతీ బిల్లును సునిశితంగా పరిశీలిస్తాం. పారిశుద్ధ్య పనుల నిర్వహణకు అత్యవసరం కావడంతో స్థానికంగా బిల్లుల సొమ్ములు సర్దుబాటు చేస్తున్నాం. కొంత కాలంగా ఈ బిల్లులు ఎక్కువగా ఎందుకు సమర్పిస్తున్నారనే విషయమై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తాం. మరోవైపు కార్పొరేషన్ పరిధిలోని అన్ని వాహనాల నిర్వహణపై నిఘా పెడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?