జనగోదారి.. సమర భేరి
తెలుగు దండు కదిలివచ్చింది. ఎండైనా... వానైనా... అడ్డంకులు ఎదురైనా... అన్నీ దాటుకుంటూ మహానాడు బహిరంగసభకు తరలివచ్చారు. అంచనాలకు మించి వచ్చిన జనంతో వేమగిరిలోని ప్రాంగణం జనసంద్రమైంది. ఉదయం నుంచి భానుడు భగభగలతో భయపెట్టినా... సాయంత్రానికి వరుణుడు కురిపించిన జల్లులను అంతా ఆస్వాదించారు.
ఈనాడు, రాజమహేంద్రవరం, కాకినాడ, న్యూస్టుడే, కాకినాడ నగరం, పిఠాపురం, జగ్గంపేట ఈనాడు- రాజమహేంద్రవరం, కాకినాడ
తెలుగు దండు కదిలివచ్చింది. ఎండైనా... వానైనా... అడ్డంకులు ఎదురైనా... అన్నీ దాటుకుంటూ మహానాడు బహిరంగ సభకు తరలివచ్చారు. అంచనాలకు మించి వచ్చిన జనంతో వేమగిరిలోని ప్రాంగణం జనసంద్రమైంది. ఉదయం నుంచి భానుడు భగభగలతో భయపెట్టినా... సాయంత్రానికి వరుణుడు కురిపించిన జల్లులను అంతా ఆస్వాదించారు. అధినేత ఉత్సాహ పూరిత ప్రసంగాన్ని మదినిండా నింపుకొని వచ్చే ఎన్నికల్లో విజయభేరి మోగిస్తామంటూ తిరుగుపయనమయ్యారు.
చారిత్రక నగరిలో మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమయ్యింది. మహా సంబరం అంబరాన్ని తాకింది. తెదేపా అధినాయకత్వం రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం.. మహానాడు వేడుక ఆదివారంతో పరిపూర్ణమయ్యింది. గోదావరి తీరాన జన జాతరలో.. శకపురుషుని శతజయంతి వేడుక అట్టహాసంగా సాగింది. మహానాడు వేదికగా ప్రజాహితమే నినాదంగా.. అభివృద్ధే అజెండాగా ఎన్నికల సంగ్రామానికి తెదేపా అధినేత చంద్రబాబు సమర శంఖం పూరించారు. తెదేపా శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపారు.
ఎండలు మండుతున్నా..
ఉష్ణోగ్రతలు భారీగా ఉంటాయనే హెచ్చరికలున్నా.. గుండెల నిండా అభిమానంతో మహానాడుకు అభిమాన జనం పోటెత్తారు. జెండాలు చేతపట్టుకుని పార్టీకి జై కొడుతూ ముందుకు సాగారు. కొందరు కాలినడకన.. ఇంకొందరు ఆటోల్లో, ప్రైవేటు వాహనాల్లో మహానాడు ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. తొలిరోజు ప్రతినిధుల సభ జరిగిన ప్రాంగణంలోనే వచ్చిన ప్రతి ఒక్కరికీ కడుపు నిండా వివిధ రుచులతో భోజనం పెట్టించారు.
గుండెల్లో గోదారి..
ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆయా నియోజకవర్గ బాధ్యుల సారథ్యంలో లక్షలాది మంది వరకు రాజమహేంద్రవరం వచ్చారు. ఆయా ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహన ర్యాలీలు, ఆటోలు, కార్లు, ప్రైవేటు బసుల్లో తరలివచ్చారు. వడగాడ్పులు వీయడంతో ముందస్తుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. ఎనిమిది మంది వడదెబ్బకు గురవ్వడంతో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోవడంతో ప్రాథమిక వైద్యం అందించి వైద్యశాలకు తరలించారు.
అడుగడుగునా అడ్డంకులే..
మహానాడుకు ఆర్టీసీ బస్సులు ఇవ్వడానికి నిరాకరించడంతో అధిక సంఖ్యలో అభిమానులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. పలు జిల్లాల నుంచి ద్విచక్ర వాహనాలపై రాజమహేంద్రవరం వచ్చారు. తొలిరోజు ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో విఫలమైన పోలీసులు.. రెండోరోజు జిల్లా ముఖ ద్వారాల వద్ద, పలుచోట్ల ట్రాఫిక్ పేరుతో కట్టడి చేయడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఆత్మీయ వీడ్కోలు
మహానాడుకు వచ్చిన లక్షల మంది కోసం 10 లక్షల నీటి సీసాలు, మజ్జిగ ప్యాకెట్లు అందించారు. సభ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణం అయ్యే కార్యకర్తల కోసం తొమ్మిదిచోట్ల ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి ఆహార పొట్లాలు అందించారు. ఇళ్లకు క్షేమంగా చేరుకోవాలని చంద్రబాబు, లోకేశ్లు శ్రేణులకు సూచించారు.
ఎన్టీఆర్ ముత్తాత... చంద్రబాబు తాత
తిరుపతికి చెందిన టి.చిరంజీవి, రేవతి దంపతులు నాలుగేళ్ల కుమారుడు అనిల్కుమార్తో మహానాడుకు వచ్చారు. ఎన్టీఆర్ ముత్తాత... చంద్రబాబు తాత అంటూ అనిల్ ముద్దులొలికే మాటలు చెబుతూ వారిద్దరిపై పాట ఆలపించాడు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు విజయం తథ్యమని ఈ దంపతులు చెప్పారు.
మనోహరం
చీరాలకు చెందిన మనోహర్ తెదేపా వీరాభిమాని. ఎక్కడ మహానాడు జరిగినా ఇలా తెదేపా రంగుల దుస్తులు, ఎన్టీఆర్ బొమ్మలను కిరీటంగా ధరించి హాజరవుతానని తెలిపారు. ఇప్పటికే 41 మహానాడు వేడుకల్లో పాల్గొన్నానన్నారు.
బాబును గెలిపించుకుంటాం...
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన మహిళలు మహానాడు ప్రాంగణం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, అభివృద్ధి అనేదే లేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే మహానాడుకు వచ్చామన్నారు. అందరం కలిసికట్టుగా కృషి చేసి చంద్రబాబును గెలిపించుకుంటామన్నారు.
వయోభారమైనా వడివడిగా...
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన దొండపాటి నారాయణ వయసు 80 సంవత్సరాలు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ పార్టీ అంటే ఎనలేని అభిమానం. వృద్ధాప్యంలోనూ ఆయన మహానాడుకు తరలివచ్చారు. రానున్న ఎన్నికల్లో జగన్ ఓటమి తథ్యమని, చంద్రబాబు రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రతీ గురువారం ఎన్టీఆర్కు నివాళి
ఈయన పేరు కేశేపల్లి సాంబశివరావు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన ఆయన వయసు 72 ఏళ్లు. తాను ఎన్టీఆర్ అభిమానినని, 1974 నుంచి తారకరామ అసోసియేషన్ను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1996లో ఎన్టీఆర్ మహాభినిష్క్రమణం తరువాత గుంటూరు ఆటో స్టాండ్ వద్ద ఆయన విగ్రహం ఏర్పాటు చేసి ప్రతీ గురువారం పూలమాల వేసి నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. గత 27 ఏళ్లలో తాను ఈ కార్యక్రమాన్ని ఒక్క వారం కూడా ఆపలేదని సాంబశివరావు తెలిపారు.
చంద్రన్నను మరిపించేలా...
చంద్రబాబు రూపంలో నంద్యాలకు చెందిన వెంకటసుబ్బయ్య అనే అభిమాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అతనితో సెల్ఫీలు దిగేందుకు మహానాడుకు వచ్చిన జనం ఆసక్తి చూపారు.
ఉరిమిన ఆకాశం.. ఉప్పొంగిన అభిమానం..
ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. హోరుగాలి, జోరువాన ఇబ్బందిగా మారింది. ప్రాంగణంలోని హోర్డింగులు, ఫ్లెక్సీలు, మహానాడు వేదిక ఎదురుగా టెంట్లు కూలిపోయాయి. రాకపోకలు స్తంభించాయి.. దీంతో కొందరు చెల్లాచెదురైనా.. మిగిలినవారంతా హోరుగాలులతో కళ్లలోకి మట్టి చెలరేగుతూ ఇబ్బంది పెడుతున్నా.. వాన కుదిపేస్తున్నా ప్రతిష్టాత్మక కార్యక్రమం విజయవంతం కావాలనే కాంక్షతో కుర్చీలు, ఫ్లెక్సీలు అడ్డుపెట్టుకుని అక్కడే ఉండిపోయారు. పరిస్థితి కుదుటపడ్డాక ప్రాంగణం వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు.
ప్రాణాలకు తెగించి.. 300 మందిని కాపాడి..
భారీ గాలులు, వర్షం కురవడంతో సభ వద్ద ఫ్లడ్లైట్ల స్తంభం పడిపోబోతుంటే ఏలూరు జిల్లా పట్టిసీమకు చెందిన బావమరుదులు విజయ్, నాగరాజు దాన్ని పట్టుకున్నారు. ఆ సమయంలో అక్కడ సుమారు 300 మంది కూర్చోగా... వెళ్లిపోమని గట్టిగా అరిచారు. విద్యుత్తు స్తంభం తీగల రాపిడికి నిప్పురవ్వలు ఎగసి పడటంతో ప్రమాదం జరుగుతుందని దాన్ని పక్కకు వదిలేశారు. ఈ క్రమంలో వారు గాయపడగా విజయ్కు 13 కుట్లు, నాగరాజ్కు ఏడు కుట్లు పడ్డాయని, ఇద్దరి పరిస్థితి మెరుగ్గానే ఉండటంతో వాళ్ల ఇంటికి తరలించామని నిర్వాహకులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..