మంత్రా.. మజాకా
ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం సుమారు ఏడాది కిందట రూ. 12 కోట్ల వ్యయంతో మహామండపం, అమ్మవారి ప్రధానాలయం నిర్మాణ పనులు చేపట్టారు.
పూర్తికాని భవనాలకు హడావుడి ప్రారంభోత్సవాలు..
లోవలో మహామండపాన్ని ప్రారంభిస్తున్న మంత్రి కొట్టు సత్యనారాయణ
తుని గ్రామీణం: ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం సుమారు ఏడాది కిందట రూ. 12 కోట్ల వ్యయంతో మహామండపం, అమ్మవారి ప్రధానాలయం నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తి కాకుండానే దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం అట్టహాసంగా ప్రారంభించేశారు. దేవస్థానంలో సుమారు రూ.2 కోట్ల వ్యయతో అమ్మవారి ఆలయాన్ని కృష్ణశిలతో నిర్మిస్తున్నారు. ఆలయంపై పనులు పూర్తికాక పోవడంతోపాటు తలుపులు ఏర్పాటు చేయలేదు. రూ. 6 కోట్ల మహామండపం నిర్మాణ పనులు కేవలం 70 శాతమే పూర్తయ్యాయి. సుమారు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎస్క్లేటర్లకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని నెలల్లో వీటన్నింటినీ అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం బాలాలయంలో భక్తులకు దర్శనం కల్పించామని ఉగాది నాటికి ప్రధానాలయంలో అమ్మవారి దర్శనం భక్తులకు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈవో విశ్వనాథ]రాజు తెలిపారు. దేవస్థానం ఛైర్మన్ గొర్లి అచ్చియ్యనాయుడు బొంగు ఉమారావు, మార్కెట్యార్డు ఛైర్మన్ బాబు పాల్గొన్నారు.
నిర్మాణ దశలో మహామండపం
అన్నవరం: అన్నవరం జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న సత్యదేవుని నమూనా ఆలయం ప్రాంగణంలో ప్రసాదం కౌంటర్ నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం ప్రారంభించేశారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన కొద్ది గంటల ముందు హడావుడిగా కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాంగణంలో నమూనా ఆలయం, దుకాణ సముదాయం, ప్రసాదం కౌంటర్ పనులు ఏవీ ఇంకా పూర్తి కాలేదనేది విదితమే. పిల్లర్లపై స్లాబు వేసి ఇంకా నిర్మాణంకాని ఈ భవనంలో అల్యూమినియం కౌంటర్ పెట్టి రిబ్బన్ కత్తిరించారు. స్టెయిన్లెస్ స్టీల్ ట్యాబ్లెట్ స్టోన్ పెట్టి.. దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈవో కె.రామచంద్రమోహన్లతో కలిసి మంత్రి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి సత్యదేవుని దర్శించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రసాద్ నిధులతో చేపట్టబోయే నిత్యాన్నదాన భవనం నిర్మాణానికి టెంకాయ కొట్టారు. కేంద్ర నిధులతో చేపట్టబోయే ఈ పనులకు ఈనెల 7న ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అవే పనులకు భూమిపూజ పేరిట టెంకాయకొట్టారంతే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రశ్నిస్తే దాడి.. పోరాడితే కేసు
[ 10-05-2024]
వైకాపా పాలనలో ఎవరైనా ప్రశ్నిస్తే దాడే.. పోరాడితే కేసే..పేదల నుంచి పెద్దల వరకు ఎదుర్కొన్న అణచివేత ఇది. విధ్వంసం నుంచి మొదలై.. వినాశనం వరకు అయిదేళ్ల పాలన సాగింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని నిలదీస్తే.. సామాన్యుడైనా, ప్రతిపక్ష నేతైనా నిర్బంధం, కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. -
అప్పుల ఆంధ్రాగా మార్చేశారు
[ 10-05-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసిందని ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
అయిదేళ్లలో రైతులను నిండా ముంచారు!
[ 10-05-2024]
ఎర్రకాలువకు వరదొస్తే నిడదవోలు, నల్లజర్ల, దేవరపల్లి, చాగల్లు మండలాల రైతులు వణికిపోతున్నారు. దీని ప్రవాహ సామర్థ్యం 20 వేల క్యూసెక్కులు. -
అన్నంపెట్టినా.. కడుపు మంటేనా!
[ 10-05-2024]
హాట్ బాక్సుల్లో వేడివేడి పదార్థాలు ఆకలితో అక్కడికి అడుగుపెట్టేవారికి ఆహ్వానం పలికేవి. రూ.5 నామమాత్రంగా చెల్లించి అన్నదాతా.. సుఖీభవ అని దీవించి వెళ్లేవారు. ఇదీ తెదేపా హయాంలో అన్న క్యాంటీన్ల వద్ద నిత్యం కనిపించే పరిస్థితి. -
జగన్ ఏలుబడి.. పర్యాటకం చతికిలపడి..!
[ 10-05-2024]
‘వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పర్యాటకం అంటే ప్రజలు అంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తాం..’ అంటూ జగన్’ ఊదరగొట్టినా.. అయిదేళ్లలో కొత్త ప్రాజెక్టుల ఊసే లేకపోగా ఉన్న పర్యాటకం పడకేసింది. -
రాజీ మార్గంలో కేసులు పరిష్కరించాలి
[ 10-05-2024]
రాజీ పడదగిన అన్ని రకాల కేసులను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. -
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: రుద్రరాజు
[ 10-05-2024]
కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ప్రజల నుంచి స్పందన వస్తోందని రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. -
ఆహ్లాదానికి రుసుం.. అడిగితే అభివృద్ధి జపం
[ 10-05-2024]
నగరం నడిబొడ్డున ఉన్న కంబాల చెరువును రూ.13 కోట్లు పెట్టి అభివృద్ధి చేశారు. లోపలకు అడుగుపెట్టి ఆస్వాదించాలంటే ఒక్కరికి తక్కువలో తక్కువ రూ.500 జేబులో ఉండాలి. -
ఓటర్ స్లిప్ చూపించు.. రూ.3 వేలు తీసుకో..!
[ 10-05-2024]
కొత్తపల్లి మండలంలో గత రెండు రోజులుగా నిత్యం అర్ధరాత్రి వరకు ఓటుకు నోట్ల పంపిణీ జరుగుతోంది. వైకాపా నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటరు స్లిప్పుల ఆధారంగా ఒక్కో ఓటుకు రూ.3వేలు చొప్పున అందజేస్తున్నారు. -
ఓట్లకు ‘సామాజిక’ గాలం
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాల్లో వారు మునిగితేలుతున్నారు. ప్రధానంగా అమలాపురం నియోజకవర్గంలో ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. -
ఈ ఇంట్లో ఓట్లు అమ్ముకోం!
[ 10-05-2024]
ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు తాయిలాల పంపిణీపై దృష్టి సారించారు. ఈ తరుణంలో స్థానిక రథం సెంటరులో 90 ఏళ్ల వృద్ధురాలు భమిడిపాటి శేషారత్నం తన ఇంటి వద్ద ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీ ఆకట్టుకుంటోంది. -
ఏ తల్లి కన్నబిడ్డో..!
[ 10-05-2024]
ఏ తల్లి కన్నదో తెలియదుకాని.. అభంశుభం తెలియని ఓ శిశువు మురుగు కాలువలో మృతదేహంగా కనిపించడం స్థానికులను ఆవేదనకు గురిచేసింది. రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. -
అటు ఎన్నికలు.. ఇటు సెలవులు
[ 10-05-2024]
ఇటు ఆర్టీసీలో, అటు రైల్వేలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దూరప్రాంత సర్వీసులకు టికెట్ రిజర్వేషన్ దొరకని పరిస్థితి నెలకొంది. వరుస సెలవులు.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో మరింత రద్దీ పెరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు