Rajamahendravaram: అధికారం చెల్లదని చించిపారేశారు..!
అధికారం చేతిలో ఉన్నంతవరకే భయానికో.. భక్తికో.. నాయకులకు దాసోహమయ్యేది.. ఆ తర్వాత ఎవరైనా ఒకటే.. అని చెప్పడానికి ఈ సంఘటన ఉదాహరణ. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగరంలో అధికారపార్టీ ప్రజాప్రతినిధి తనదైన శైలిలో ప్రచారానికి తెరతీశారు.
బోర్డులో ఫ్లెక్సీలను తొలగిస్తున్న లీజుదారుడు సిబ్బంది
టి.నగర్ (రాజమహేంద్రవరం) న్యూస్టుడే: అధికారం చేతిలో ఉన్నంతవరకే భయానికో.. భక్తికో.. నాయకులకు దాసోహమయ్యేది.. ఆ తర్వాత ఎవరైనా ఒకటే.. అని చెప్పడానికి ఈ సంఘటన ఉదాహరణ. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగరంలో అధికారపార్టీ ప్రజాప్రతినిధి తనదైన శైలిలో ప్రచారానికి తెరతీశారు. ఊరంతా పోస్టర్లతో నింపేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ పేరిట సిద్ధం పోస్టర్లుతో భారీ హోర్డింగులు ఆక్రమించగా.. మిగిలిన సందులు, రోడ్లు, కూడళ్లు వదలకుండా సదరు ప్రజాప్రతినిధి తన ప్రచారానికి పోస్టర్లు ఏర్పాటు చేసేశారు. నగరంలో చాలావరకూ హోర్డింగ్లు, వీధి దీపాల మధ్య ప్రకటన బోర్టులను నగరపాలక సంస్థ ప్రైవేటు లీజుదారులకు అప్పగిస్తుంది. నెలనెలా నిర్ణయించిన అద్దెను లీజుదారులు నగరపాలక సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నిక వేళ నగరంలో ప్రకటన బోర్టులను తన అధికార బలంతో ప్రజాప్రతినిధి ఆక్రమించేశారు. అధికారం చేతిలో ఉండడంతో లీజుదారులు నోరెత్తలేకపోయారు. ఒకపక్క అద్దె అడగలేక నగరపాలక సంస్థకు చేతిచమురు చెల్లించాల్సిన పరిస్థితి. ఆఖరికి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కోడ్ కూత కూస్తుందనగా.. అంతకుముందే లీజుదారులు తమ మనుషులతో ప్రజాప్రతినిధి పేరిట ఏర్పాటు చేసిన బోర్డులు చింపి అక్కడే పడేశారు. బోర్డులు తొలగిస్తున్నవారిని ప్రశ్నించగా.. ఇన్నాళ్లూ ప్రకటన బోర్డులు ద్వారా వచ్చే అద్దె ఆగిపోయిందని.. ముందుగా బుక్ చేసుకున్నవారు గగ్గోలు పెడుతున్నారని తెలియజేశారు. వాస్తవానికి కోడ్ వస్తే మున్సిపల్ ప్రణాళికా విభాగం యంత్రాంగం ఎలాగూ నగరంలో ఫ్లెక్సీలను తొలగిస్తుంది.. అంతకంటే ముందుగానే ఇలా లీజుదారులు తొలగించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
[ 29-04-2024]
కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కాటన్ దొర కట్టారు.. జగన్ చెడగొట్టారు
[ 29-04-2024]
సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ.. ఉభయ గోదావరి జిల్లాల కర్షకుల ఆశా దీపం. ఎక్కడి నుంచో వచ్చిన విదేశీయుడు ఈ ప్రాంత ప్రజలు, రైతుల కోసం అంతలా ఆలోచించి ఆనకట్ట కట్టారు. -
మార్పు కోరితే.. కూటమికి ఓటెయ్యండి
[ 29-04-2024]
ఉపాధి కావాలన్నా.. కష్టాలున్నా.. నేను వచ్చి మాట్లాడుతా.. నాకు లంచాలు అవసరం లేదు. రైతు కన్నీళ్లు తుడవగలిగితే.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాకు ఆనందం..రాష్ట్రంలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే ఒక్కరు మాట్లాడరు. -
ఆదర్శంగా తీర్చిదిద్దడమంటే ‘ఇదేనా ఎంపీ గారు..’
[ 29-04-2024]
‘‘కడియం మండలంలోని పొట్టిలంక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా. జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా’’ ఇదీ రాజమహేంద్రవరం ఎంపీగా మార్గాని భరత్రామ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకటన. -
వైకాపా అండ.. అక్రమ దందా
[ 29-04-2024]
అధికార పార్టీ నాయకులు అండదండలు, జిల్లా, స్థానిక అధికారులు ఆశీస్సులు ఉంటే ఎన్ని అక్రమాలు చేసినా.. అవినీతికి పాల్పడినా పట్టించుకోరన్న ధైర్యం స్థానిక వైకాపా నాయకుల్లో ఉంది.. -
మే 18 నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు
[ 29-04-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మే 18 నుంచి 24 వరకు జరగనున్న స్వామివారి కల్యాణోత్సవాలకు ఏర్పాట్లపై పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు అధ్యక్షతన సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది. -
వైకాపాకు ఓటేస్తే.. మీ ఆస్తులన్నీ తాకట్టే
[ 29-04-2024]
రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అన్ని వర్గాలకూ న్యాయం చేస్తుందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. -
మూగబోయిన జీవితాలు
[ 29-04-2024]
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం శివారు హైవేపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. -
బ్రాహ్మణ సమాజం ఏకం కావాలి: నాగబాబు
[ 29-04-2024]
బ్రాహ్మణ సమాజ అభ్యున్నతికి బ్రాహ్మణులంతా ఏకం కావాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు. ఆదివారం పిఠాపురంలో బ్రహ్మణ సంఘాలు నాగబాబును కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. -
పిఠాపురం.. కొరకరాని కొయ్య
[ 29-04-2024]
పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ను ఎదుర్కొనేందుకు అధికార వైకాపా చేయని కుటిల ప్రయత్నాలు లేవు. పోలింగ్కు పక్షం రోజుల ముందు నుంచే ఓటర్లను మచ్చిక చేసుకోడానికి నగదు ఎరవేస్తోంది. -
హోం ఓటింగ్కు 69 బృందాలు
[ 29-04-2024]
పోలింగ్ కేంద్రాల వరకు రావాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునేలా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం వైకల్యంతో ఉన్న దివ్యాంగ ఓటర్లకు ఎన్నికల కమిషన్ హోం ఓటింగ్ అవకాశాన్ని కల్పించడంతో దీనికోసం మొత్తం 400 మంది ఎన్నికల సిబ్బందితో 69 బృందాలను ఏర్పాటు చేశారు. -
రారండోయ్ వేడుక చేద్దాం.. ఓట్లు దండుకుందాం
[ 29-04-2024]
అధికార పార్టీ నేతలు నాలుగేళ్లుగా లేనిది ఈ ఏడాది ఇప్పుడే పుట్టినరోజులు, పెళ్లిరోజులు చేసుకుంటున్నారు. గతంలో పదిమందితో కలిసి వేడుక చేసుకునే వాళ్లు ఇప్పుడు 100మందిని పిలుస్తున్నారు. అంతా ఎన్నికల మహత్యం మరి!. -
ఆంధ్రాలో మార్పు కోసమే కూటమి
[ 29-04-2024]
ఆంధ్రాలో అరాచక పాలన అంతమొందించేందుకే తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ప్రజల ముందుకు వచ్చాయని, ఈ ఎన్నికల్లో వైకాపాను ఇంటికి పంపేందుకు ప్రజలంతా ‘సిద్ధం’గా ఉన్నారని రాజమహేంద్రవరం ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
డబ్బు.. బిర్యానీ చూపి జనానికి ఎర
[ 29-04-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అంబాజీపేటలో సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభ నిర్వహించనున్నారు. -
నేతలను ప్రసన్నం చేసుకోవాలని.. ప్రలోభాలతో వైకాపా కుటిలయత్నాలు
[ 29-04-2024]
పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ను ఎదుర్కొనేందుకు అధికార వైకాపా చేయని కుటిల ప్రయత్నాలు లేవు. పోలింగ్కు పక్షం రోజుల ముందు నుంచే ఓటర్లను మచ్చిక చేసుకోడానికి నగదు ఎరవేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!