logo

‘పార్టీ పదవి కంటే ఐకమత్యమే ముఖ్యం’

వైకాపా నాయకుడు తోట రామకృష్ణపై అదే పార్టీ నాయకులు ఇటీవల దాడి చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కాపుసంఘం అధ్యక్షుడు చిలిమలి వెంకటరాయుడు తెలిపారు.

Published : 17 Apr 2024 06:05 IST

మాట్లాడుతున్న వెంకటరాయుడు, నాయకులు

తాళ్లపూడి: వైకాపా నాయకుడు తోట రామకృష్ణపై అదే పార్టీ నాయకులు ఇటీవల దాడి చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కాపుసంఘం అధ్యక్షుడు చిలిమలి వెంకటరాయుడు తెలిపారు. తాళ్లపూడి మండలంలోని పెద్దేవంలో రామకృష్ణ ఇంటి వద్ద కాపు ప్రజాప్రతినిధులు, నాయకులు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వెంకటరాయుడు మాట్లాడారు. 18న కొవ్వూరులో నియోజకవర్గ కాపు నాయకుల సమావేశం జరుగుతుందన్నారు. ఈలోగా దీనిపై అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాలన్నారు. సంజాయిషీ ఇవ్వాలన్నారు. వైకాపా కొవ్వూరు మండల అధ్యక్షుడు సుంకర సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ పరంగా కాకుండా సామాజికవర్గ పరంగా ఐకమత్యంగా ఉండాలన్నారు. జరిగిన దాడిపై పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. అవసరమైతే పార్టీ పదవికి రాజీనామా చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని