ఏడు రోజులన్నారు.. ఏడిపిస్తున్నారు
సీపీఎస్.. ఈ విధానం రద్దుకు రాష్ట్రంలో ఉద్యోగులు తెలపని నిరసన లేదు.. చేయని ఆందోళన లేదు.
సీపీఎస్ రద్దు చేయని వైకాపా ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో 27,200 మంది ఉద్యోగుల వేదన ఇది
న్యూస్టుడే, పామర్రు
నాడు
‘అధికారంలోకి వస్తే.. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా. నా పిల్లలకు నేను బాగానే ముట్ట జెెప్పాననే సంతోషం ఉద్యోగుల ముఖాల్లో కనిపించేలా చూస్తా.’
ప్రతిపక్షనేతగా జగన్ మోహన్రెడ్డి అయిదేళ్ల క్రితం చెప్పిన మాటలివి.
నేడు
సీపీఎస్ రద్దు చేయలేం.. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది. దానికన్నా మెరుగైన జీపీఎస్ తెస్తాం.
సీపీఎస్.. ఈ విధానం రద్దుకు రాష్ట్రంలో ఉద్యోగులు తెలపని నిరసన లేదు.. చేయని ఆందోళన లేదు. పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు.. రాస్తారోకో, రైల్రోకోల్లో పాల్గొన్నారు.. సీపీఎస్పై సమరభేరి మోగించారు.. 2కె, 4కె పాదయాత్రలు.. పరుగులు నిర్వహించి సమస్యను వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇచ్చిన హామీని పక్కన పెట్టిన జగన్ సర్కారు.. ఉద్యోగులకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాని కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. ప్రశ్నించిన గొంతు నొక్కేయాలని.. ఆందోళనలను తొక్కేయాలని శతవిధాలా ప్రయత్నించినా.. అరెస్టులు చేసినా.. ఉద్యోగులు ఇప్పటికీ ముక్తకంఠంతో నినదిస్తూనే ఉన్నారు.
ఇతర రాష్ట్రాల్లో భారం పడదా?
ఓపీఎస్ పునరుద్ధరణ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని.. ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిపోతుందని కొత్త వాదన లేవనెత్తింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చలేమని, సీపీఎస్ రద్దు చేయడం కుదరదని చేతులెత్తేసింది. మరి ఇదే సమయంలో రాజస్థాన్, ఛత్తీస్ఘడ్, పంజాబ్, హిమాచల్ప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాలు ఎలా రద్దు చేశాయి.. కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా ప్రస్తుత ప్రభుత్వాలు సీపీఎస్ రద్దును ఎలా ప్రకటిస్తున్నాయి.. అని ఇక్కడి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
జీపీఎస్ అంటూ వక్రభాష్యం
సీపీఎస్కు ప్రత్యామ్నాయంగా జీపీఎస్(గ్యారెంటీ పింఛన్ స్కీం) తీసుకొస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ విధానంలో ఉద్యోగి పదవీ విరమణ తరువాత పింఛనుకు పూర్తి గ్యారంటీ అని అంకెల గారడీ చేసింది. ఈ లెక్కలన్నీ తప్పుల తడకలే అని ఉద్యోగులు అంటున్నారు.
ఇదీ రెండింటికీ తేడా..
- ఓపీఎస్(ఓల్డ్ పింఛను స్కీం): ఉద్యోగి పదవీ విరమణ చేశాక.. చివరి నెలలో ఉన్న వేతనంలో 50 శాతాన్ని సర్వీస్ పింఛను కింద ప్రభుత్వం చెల్లించేది. ఒకవేళ పింఛనుదారుడు చనిపోతే అతని భార్య, ఆ తరువాత వారిపై ఆధారపడిన దివ్యాంగులైన, పెళ్లికాని పిల్లలకు పింఛను అందించేవారు.
- సీపీఎస్(కాంట్రీబ్యూటరీ పింఛను విధానం): ఉద్యోగి చందా ఆధారిత స్కీం కింద వారి మూల వేతనం, డీఏ(కరవు భత్యం) నుంచి ప్రతి నెలా 10 శాతం చొప్పున కట్ చేస్తారు. దానికి ప్రభుత్వం మరో 10 శాతం జత చేసి మొత్తాన్ని ఎన్పీఎస్-ఎన్ఎస్డీఎల్కు బదిలీ చేస్తుంది. ఉద్యోగి పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబరులో ఈ మొతం జమ చేస్తారు. సదరు ఉద్యోగి పదవీ విరమణ చేశాక మొత్తం సొమ్ము నుంచి 60 శాతం చెల్లించేస్తారు. మరో 40 శాతం సొమ్మును షేర్ మార్కెట్లో కొనసాగిస్తూ.. వచ్చే లాభనష్టాలతో కలిపి ఎంతో కొంత ప్రతి నెలా పింఛను రూపంలో చెల్లిస్తారు.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
2004 జనవరి ఒకటో తేదీ తరువాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని శాఖల్లోనూ కలిపి 27,200 మంది వరకూ ఉద్యోగులు చేరి విధులు నిర్వర్తిస్తున్నారు. అందరూ కూడా తమకు ఓపీఎస్ విధానంలోకి మార్చాలని, సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జీపీఎస్ అంకెల గారడీ అంగీకరించం
మా కుటుంబాల ఆర్థిక ప్రయోజనాలూ మాకు ముఖ్యమే. ఓపీఎస్లో పలు రకాల అడ్వాన్సులు తీసుకునే అవకాశం ఉంది. జీపీఎస్ అనేది అంకెల గారడీ తప్ప ఏం లేదు. సీపీఎస్ రద్దు చేసే వారికే ఉద్యోగులంతా అండ ఉంటాం.
మద్దా బాపూజీ, వీఆర్వో సంఘ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు
మాయమాటలతో నమ్మించాలనుకున్నారు..
సీపీఎస్ రద్దుకు కేంద్రం ఒప్పుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం మాయమాటలు చెప్పి నమ్మించడానికి ప్రయత్నించింది. సీపీఎస్ను రద్దు చేసుకుని ఓపీఎస్ను అమలు చేసుకోవడం రాష్ట్రాల స్వయం నిర్ణయానికే వదిలేస్తున్నామని కచ్చితంగా కేంద్రం చెప్పడంతోనే పలు రాష్ట్రాలు ఈ దిశగా పయనిస్తున్నాయి. మరి మన రాష్ట్రాధినేతలకే ఈ మూర్ఖత్వం ఎందుకో అర్థం కావడం లేదు.
ఎం.వెంకటేశ్వర్లు, ఎన్జీవోల సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి
ఇది మంచి విధానం కాదు..
సీపీఎస్ రద్దుకు అనేక ఉద్యమాలు చేశాం. మా డిమాండును ప్రభుత్వం పట్టించుకోకుండా జీపీఎస్ను అమల్లోకి తెచ్చింది. ఇది మంచి విధానం కాదు. సీపీఎస్, జీపీఎస్ వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒరిగేది ఏమీలేదు. దీనివల్ల తీరని నష్టం ఏర్పడుతుంది.
డి.శ్రీనివాస్, ఛైర్మన్, జెఏసీ, అంబేడ్కర్ కోనసీమ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నయ్యా.. బైకు అమ్మి అప్పులు తీర్చండి
[ 30-04-2024]
‘అన్నయ్యా అమ్మా, నాన్నలను జాగ్రత్తగా చూసుకో.. నేను వెళ్తున్నా’ అంటూ చరవాణిలో తన అన్నకు ఓ యువకుడు చివరి మాటలు చెప్పి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్లజర్ల మండలం అనంతపల్లి సైఫాన్ వంతెనపై పోలవరం కుడికాలువ వద్ద సోమవారం చోటుచేసుకుంది. -
పవన్ రోడ్షో.. 6 గంటలు.. 40 కి.మీ.
[ 30-04-2024]
భగభగమండే ఎండలో పూల జల్లులు కురిశాయి.. బాణసంచా కాల్పులతో పట్టపగలే ధగధగ మెరుపులు మెరిశాయి.. -
నాడు ఊదరగొట్టారు.. నేడు ఉసురు తీస్తున్నారు
[ 30-04-2024]
సామాజిక భద్రత పింఛన్లు తీసుకునే విషయంలో ఈసారి కూడా లబ్ధిదారులు ఇబ్బందులు పడే పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. గతనెల గంటల తరబడి సచివాలయాల వద్ద వారిని పడిగాపులు పడేలా చేసిన విషయం తెలిసిందే. -
పోలీసులపైనా కపట ప్రేమే
[ 30-04-2024]
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ పోలీసు సంక్షేమాన్ని అటకెక్కించారు. నిత్యం పోలీసు బందోబస్తు మధ్య తిరిగే ఆయన వారి కష్టాన్ని పట్టించుకోలేదు. -
వైకాపా పాలనలో 20 ఏళ్లు వెనక్కు
[ 30-04-2024]
మోదీకి దత్తపుత్రుడిగా వ్యవహరిస్తున్న సీఎం జగన్.. వైఎస్ రాజశేఖర్రెడ్డి రాజకీయ వారసుడు ఎలా అవుతారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలి
[ 30-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమని, ప్రతిఒక్క ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ హక్కును వినియోగించుకునే వాతావరణ కల్పించేలా చూడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందని రాష్ట్ర ఎన్నికల పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా అన్నారు. -
గాలికొదిలేశారు.. అయిదేళ్లు గడిపేశారు
[ 30-04-2024]
పేదలే ప్రాణమంటారు. వైద్య సేవల్లో ప్రభుత్వం పెద్ద పీట వేసిందంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రగల్భాలు చెబుతారు. -
ప్రజల కష్టాలు తీరేది కూటమితోనే..
[ 30-04-2024]
బటన్లు నొక్కే జగన్మోహన్రెడ్డిని ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కి ఇంటికి సాగనంపాలని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. -
రూ.6 కోట్ల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
[ 30-04-2024]
రావులపాలెం మండలం గోపాలపురం చెక్ పోస్టు వద్ద సోమవారం ఎటువంటి పత్రాలు లేకుండా లాజిస్టిక్ వాహనంలో తరలిస్తున్న 9.530 కేజీల బంగారం, 1.871 కేజీల వెండి వస్తువులను ఎస్ఎస్టీ బృందం, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
భట్నవిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
[ 30-04-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం భట్నవిల్లిలో ఆదివారం రాత్రి 11.50 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
అతివే నిర్ణేత.. నేతలరాత..!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలు 2024లో నాయకుల తలరాతను అతివలే నిర్ణయించనున్నారు. ఇంతులు మెచ్చినవారికే పదవులు దక్కనున్నాయి. -
ఓడించలేమా ఒంటి చేత..!
[ 30-04-2024]
అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా దినోత్సవం ముందురోజే వైఎస్ఆర్ చేయూత ద్వారా సాయం అందించడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. -
సర్కారు జాగా.. ప్రైవేటు పాగా..!
[ 30-04-2024]
ప్రభుత్వ భూములను సంరక్షించాల్సిన అధికారులు వాటిని విస్మరించడంతో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు అమలాపురం మండలం ఈదరపల్లిలో చోటుచేసుకుంటోంది. -
ప్రగల్భాలే.. పైసా విదల్చలే..
[ 30-04-2024]
అర్థ దశాబ్దంగా ఎదురూచూస్తు వచ్చిన ఏలేరు ఆధునికీకరణ పనులకు జగన్ ప్రభుత్వం మోకాలడ్డింది. గత ప్రభుత్వంలో ఏలేరుపై సాగునీటి నిర్మాణాలకు ఖర్చుచేసిన సుమారు రూ.97 కోట్లు నిష్ప్రయోజనంగా మారాయి. -
గుర్తుల గందరగోళం
[ 30-04-2024]
జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఇతర పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులకు సైతం కేటాయించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు