తలూపినా తలోదారే!
రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు.
వైకాపా నాయకుల మధ్య కుదరని సయోధ్య
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్టుడే: రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సైతం నేరుగా రంగంలోకి దిగి సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా షరామాములే. అర్బన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ప్రస్తుత ఎంపీ భరత్ నామినేషన్కు వీరంతా డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. సీఎం కొద్ది రోజుల క్రితమే నగరంలో బస్సు యాత్ర చేపట్టిన సందర్భంలో అందరితో మాట్లాడినా ఆయన ముందు తలూపి.. ఆ తర్వాత షరామామూలే అన్నట్లు వ్యవహరించారనే మాట ఆ పార్టీ నాయకుల నోటే వినిపిస్తోంది. నామినేషన్లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో భరత్రామ్తో పాటు కుటుంబ సభ్యులు మాత్రమే కనిపించారు. వైకాపా నాయకులు ఎవరూ వెంట రాలేదు.
గూడూరి ర్యాలీకి సై.. భరత్కు నై..
ఈసారి ఎలాగైనా రాజమహేంద్రవరంలో పాగా వేయాలని అధికార పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. స్థానిక నేతలు మాత్రం ఎవరికి వారు.. తలో దిక్కు అన్నట్లు వ్యవహరించడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. అంతర్గత విభేదాలతో రగిలిపోతున్న పార్టీ స్థానిక నేతలు ఇప్పట్లో ఒక్కటయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అంతా కలిసి సాగాలని అధినేత చెప్పినా ఆ ప్రయత్నం పెద్దగా ఫలించనట్లు తెలుస్తోంది. ప్రధానంగా పార్టీలో ముందు నుంచి ఉన్నవారిలో పలువురు భరత్రామ్ నామినేషన్ ర్యాలీలో కనబడలేదు. వీరంతా కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన గూడూరి శ్రీనివాస్ నామినేషన్ ప్రక్రియలో మాత్రం పాల్గొనడం గమనార్హం. వాస్తవానికి నగరానికి చెందిన వీరంతా కలెక్టరేట్ వరకు వెళ్లారు గానీ.. కూతవేటు దూరంలో నామినేషన్ వేస్తున్న మున్సిపల్ కార్యాలయానికి మాత్రం రాలేకపోవడం వైకాపా శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.
కారెక్కి జారిపోయారు..
ఒకపక్క సొంతపార్టీ అభ్యర్థి ర్యాలీ జరుగుతుండగా.. వైకాపాలో మరో వర్గం మాత్రం ర్యాలీలో పాల్గొనే నేతలపై కన్నేసింది. ఆ వర్గానికి చెందిన నేతలు ఎవరెవరు పాల్గొంటున్నారనే దానిపై గట్టిగా ఆరాతీసింది. ఇప్పటికే ఎంపీ వర్గానికి దగ్గరగా ఉన్నట్టుగా నటిస్తూ.. నేరుగా వేరే వర్గానికి ఉప్పందిస్తున్న నేతలు సైతం ర్యాలీలో పాల్గొనేందుకు పూర్తిస్థాయిలో ఆసక్తి కనబర్చలేదు. పైగా కొంతమంది మున్సిపల్ కార్యాలయానికి మొహమాటంగా వచ్చి వెంటనే అక్కడ్నుంచి కారెక్కి జారిపోయారు. కనీసం నామినేషన్ ప్రక్రియ పూర్తయి, భరత్ బయటకు వచ్చేంత వరకూ కూడా ఆగకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధాన్యపు రాశులకు నిప్పు పెట్టిన దుండగులు
[ 06-05-2024]
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవలలో అర్ధరాత్రి ఏడు ఎకరాల్లో ఆరబెట్టిన ధాన్యపు రాశులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
రానున్న ఎన్నికల్లో కూటమిదే విజయం
[ 06-05-2024]
రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి కూటమిగా ఏర్పాడ్డాయని, -
భవిష్యత్తు మనదే
[ 06-05-2024]
‘ఎన్నికలకు సరిగ్గా వారం ఉంది. మా ప్రసంగాలు వినండి. కూటమి మ్యానిఫెస్టో చదవండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అని పవన్కల్యాణ్ కోరారు. కాకినాడ జిల్లా తునిలోని గొల్ల అప్పారావు కూడలిలో వారాహి విజయభేరి బహిరంగ సభలో ఆదివారం సాయంత్రం ఆయన ప్రసంగించారు. -
అధర్మకర్తల మండలి
[ 06-05-2024]
జగనన్న పాలనలో పాలకవర్గాల(ధర్మకర్తల మండలి) సభ్యులు దేవస్థానం శ్రేయస్సు, భక్తుల సౌకర్యాలు కల్పించేలా పనిచేసింది అంతంతమాత్రమే. ఆలయ పాలకవర్గాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. -
ప్రజాగళం.. సర్వం సన్నద్ధం
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరుతోంది. సోమవారం అగ్రనేతల సభతో రాజమహేంద్రవరం కళకళలాడనుంది. కడియం మండలం వేమగిరిలో జరిగే ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ, -
ఇక్కడైనా గందరగోళం లేకుండా చూస్తారా?
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, అత్యవసర సేవలు అందించే ఉద్యోగులకు సోమవారం నుంచి మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ నిర్వహించనున్నారు. -
నూతన భూహక్కు చట్టంపై జగన్ సర్కారునే ప్రశ్నించాలి
[ 06-05-2024]
ఏపీ నూతన భూహక్కు చట్టం అమలుపై జగన్మోహన్రెడ్డి సర్కారును ప్రశ్నించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి ఫురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ నీతిఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కేవలం సూచించిందన్నారు. -
పవన్ కల్యాణ్ను అసెంబ్లీకి పంపిద్దాం
[ 06-05-2024]
జనసేన అధినేత పవన్కల్యాణ్పై తన తండ్రి ముద్రగడ పద్మనాభం విమర్శలు చేయడాన్ని ఖండించిన ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి తాజాగా మరో వీడియో సందేశం విడుదల చేశారు. -
పోస్టల్ బ్యాలెట్లపై కాకినాడలో గందరగోళం
[ 06-05-2024]
కాకినాడలోని పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ వినియోగ కేంద్రం వద్ద ఆదివారం గందరగోళం నెలకొంది. పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసినా జాబితాలో పేర్లు లేకపోవడంతో ఎన్నికల విధుల్లో ఉన్న చాలామంది ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
ఓటేశాక.. వృద్ధులను వదిలేశారు..
[ 06-05-2024]
ఎన్నికల ముందు ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేసిన జగన్ ఎన్నో హామీలు గుప్పించారు. అన్ని వర్గాలను మాటలతో మెప్పించి.. అనంతరం నిండా ముంచారు. -
మొదటి రోజు ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియలో భాగంగా ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులకు నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదటి రోజు ఆదివారం చిన్నపాటి సంఘటన మినహా ప్రశాంతంగా జరిగింది. -
అగ్నిసాక్షిగా.. పరిహారానికి ఎగనామం..!
[ 06-05-2024]
అనుకోకుండా అగ్ని ప్రమాదాలతో రోడ్డునపడుతున్న కుటుంబాలకు వైకాపా ప్రభుత్వం మొండిచేయే చూపుతోంది. బహిరంగ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు పేదలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. -
జీవితాలు మార్చేవారికీ జీతాల్లేవ్..!
[ 06-05-2024]
వైకాపా పాలనలో ప్రభుత్వ ఉద్యోగులేకాదు.. ఒప్పంద, పొరుగు సేవల్లో విధులు నిర్వహిస్తున్న చిరుద్యోగులు కూడా వేతనాలు సకాలంలో అందక, కుటుంబ పోషణ జరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
జగన్ జమానాలో.. అంపశయ్యపై ఆరోగ్యశ్రీ
[ 06-05-2024]
క్షేత్రస్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం పరిస్థితి దయనీయంగా ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం లేదు. రూ.కోట్లల్లో బకాయిలు నెలల తరబడి ఇవ్వకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. -
విపత్కర పాలనను సాగనంపడానికే కూటమి: పురందేశ్వరి
[ 06-05-2024]
రాష్ట్రంలోని విపత్కర పాలనను విచ్ఛిన్నం చేయడానికి కూటమి ఆవిర్భవించిందని కూటమి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
జగన్ తెచ్చిన నల్లచట్టంపై తిరుగుబాటు చేయాలి: ముప్పాళ్ల
[ 06-05-2024]
రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలు తిరుగుబాటు చేయాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు పిలుపునిచ్చారు. -
మీడియా ప్రతినిధులకూ పోస్టల్ బ్యాలట్ అవకాశం
[ 06-05-2024]
జిల్లాలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలట్ ద్వారా వినియోగించుకునే వెసులుబాటును రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత ఆదివారం
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు