తీరని నష్టం
తీర ప్రాంతంలో శుక్రవారం ఉదయం మూడు గంటలకు పైగా వర్షం పడింది. ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయింది. బయటకు తీసుకురాలేక పట్టలు కప్పిన ధాన్యం కూడా తడిసిపోయింది. బాపట్ల, రేపల్లె నియోజవర్గాల్లో రెండు వేల ఎకరాల్లో వరి పనలు నీటిలో తేలుతున్నాయి.
కల్లంలో ఉన్న ధాన్యంపై కప్పిన పట్ట
బాపట్ల, న్యూస్టుడే : తీర ప్రాంతంలో శుక్రవారం ఉదయం మూడు గంటలకు పైగా వర్షం పడింది. ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయింది. బయటకు తీసుకురాలేక పట్టలు కప్పిన ధాన్యం కూడా తడిసిపోయింది. బాపట్ల, రేపల్లె నియోజవర్గాల్లో రెండు వేల ఎకరాల్లో వరి పనలు నీటిలో తేలుతున్నాయి. ధాన్యం పూర్తిగా రంగుమారి మొలకలు వస్తాయని, ఎవరూ కొనుగోలు చేయరని రైతులు వాపోతున్నారు. మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో సాగుదారులు పంటలు ఎలా కాపాడుకోవాలని తలలు పట్టుకుంటున్నారు. మూడు వేల ఎకరాల్లో పైరు నేలవాలింది. ప్రభుత్వం స్పందించి అకాల వర్షాల వల్ల నష్టపోయిన తమను ఆదుకోవాలని, రంగు మారిన ధాన్యం కొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నగరం, న్యూస్టుడే : నగరం మండల పరిధిలోని మంత్రిపాలెం, బొడ్డువారిపాలెం, గుర్నాథనగర్, అల్లపర్రు శివారు గ్రామాల్లో వందల ఎకరాల్లో వరి కోతలు కోశారు. పూడివాడ, నగరం, ధూళిపూడి, మట్లపూడి, పెదపల్లి, బెల్లంవారిపాలెం తదితర గ్రామాల్లో కుప్పలు నూర్పిడి చేశారు. ఎడతెరిపిలేని వర్షాలకు కల్లాల్లోని ధాన్య రాశులు, కోతలు కోసిన వరి పనలు నీటిలో మునిగాయి.
చెరుకుపల్లిలో మినుము పైరులో నిలిచిన వాన నీరు
ఆందోళనలో రైతులు..
చెరుకుపల్లి, న్యూస్టుడే : అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చెరుకుపల్లి మండలంలో మినుము సాగులో ఉంది. మరోవైపు 200 హెక్టార్లలో ఇప్పటికే వేరుశనగ విత్తనం వేయగా.., మరో 500 హెక్టార్లలో విత్తేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ దశలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. మినుము వేసిన పొలాల్లో అంగుళం లోతు నీళ్లు కుదురుకొన్నాయి. 15-20 రోజుల క్రితం వేసిన వేరుశనగ మొలక బాగా వచ్చి రెండంగుళాల ఎత్తు ఎదిగింది. మొలకెత్తిన వేరుశనగ పొలాల్లో పెద్దగా నీళ్లు నిలవకపోయినా నాలుగైదు రోజుల క్రితం విత్తనం వేసి మొలకరాని పొలాల్లో మాత్రం అధిక తేమ వల్ల విత్తనం కుళ్లిపోయే ప్రమాదముంటుందని ఆందోళన చెందుతున్నారు. వేరుశనగ సాగులో విత్తనం ఖర్చే ఎకరానికి రూ.25 వేలకు పైగా ఉంటుంది. దీంతో విత్తనం ఏమవుతోందనే భయంతో సాగుదారులు దిగాలు చెందుతున్నారు. వాన ఇంతటితో ఆగితే మినుము సాగు చేస్తున్న వారికి పెద్దగా నష్టం ఉండకపోవచ్చని, వర్షం కొనసాగితే మాత్రం వేరుశనగ, మినుము పైర్లు రెండూ దెబ్బతినే ప్రమాదముందని వాపోతున్నారు.
నిజాంపట్నంలో 15 మి.మీ. వర్షపాతం
నిజాంపట్నం, న్యూస్టుడే : నిజాంపట్నం మండలంలో గురువారం రాత్రి 15 మి.మీ. వర్షపాతం నమోదైంది. వర్షానికి మండలంలో ప్రధాన, అంతర్గత రహదారులు జలమయమయ్యాయి. పొలాల్లో పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?