logo

భర్త వేధింపులు తాళలేక వాలంటీరు ఆత్మహత్య

భర్త, అత్త వేధింపులు తాళలేక ఓ వాలంటీరు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కేసు నమోదు చేసినట్లు గురువారం సీఐ బండారు సురేష్‌బాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మందడం గ్రామానికి చెందిన

Published : 20 May 2022 04:15 IST

ఉప్పలపాడు(పెదకాకాని), న్యూస్‌టుడే: భర్త, అత్త వేధింపులు తాళలేక ఓ వాలంటీరు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కేసు నమోదు చేసినట్లు గురువారం సీఐ బండారు సురేష్‌బాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మందడం గ్రామానికి చెందిన కె.ముత్తయ్య తన కుమార్తె జ్యోతిని ఉప్పలపాడుకు చెందిన పెద్దిపాగ చిరంజీవికి ఇచ్చి 14 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ముగ్గురు సంతానం. తరచూ భార్యాభర్తలు గొడవ పడేవారు. అత్త సైతం కోడలిని వేధింపులకు గురిచేసేది. రెండు రోజుల క్రితం వీరు గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన జ్యోతి బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని