ఇక ప్లాస్టిక్ పూర్తిగా నిషిద్ధం
మానవాళి మనుగడకు సవాల్ విసురుతున్న వాటిల్లో ప్లాస్టిక్ భూతం ఒకటి. ఇది కుళ్లకుండా.. భూమిలో కలవకుండా ఏళ్ల తరబడి ఉండటంతో కాలుష్యం పెరిగిపోతోంది. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని జులై ఒకటో తేదీ నుంచి పూర్తిగా నిషేధించాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశించింది.
జులై నుంచి అమలు
ప్రత్యామ్నాయంగా జొన్న సంచులు
మానవాళి మనుగడకు సవాల్ విసురుతున్న వాటిల్లో ప్లాస్టిక్ భూతం ఒకటి. ఇది కుళ్లకుండా.. భూమిలో కలవకుండా ఏళ్ల తరబడి ఉండటంతో కాలుష్యం పెరిగిపోతోంది. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని జులై ఒకటో తేదీ నుంచి పూర్తిగా నిషేధించాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశించింది.
ఇప్పటికే గుంటూరు నగరపాలకసంస్థ ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దటానికి గతేడాది నవంబరు 9 నుంచి ప్లాస్టిక్ సంచుల వినియోగంపై దశల వారీ నిషేధం విధిస్తూ అమలుపరుస్తోంది. తొలి దశలో 20, ఆతర్వాత 40 మైక్రాన్లకు లోపు బరువు కలిగినవి ప్రస్తుతం 70 మైక్రాన్లకు లోపు బరువు కలిగిన సంచుల వాడకంపై నిషేధాన్ని అమలు చేస్తోంది. అదే సమయంలో వాటి విక్రేతలకు వాటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, జూలై ఒకటినాటికి పూర్తిస్థాయిలో విక్రయాలకు స్వస్తి పలకాలని సూచించటంతో ఇప్పటికే చాలా షాపుల్లో నిలిచిపోయాయి. మార్కెట్లో వాటి నిల్వలు అంతగా లేవు. జూలై ఒకటో తేదీ నుంచి అసలు ప్లాస్టిక్ సంచుల వినియోగం, విక్రయాలకు తావు లేకుండా చేయటానికి సన్నద్దమైంది. ఆ గడువుకు మరో ఆరు రోజులు మాత్రమే వ్యవధే ఉంది. ఈ వ్యవధిలో ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయం ఏమిటో తెలియజేయటంతో పాటు దాని వినియోగం వల్ల కాలుష్యం ఎలా పెరిగిపోతోంది? ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడి ఉండటం వల్ల మానవాళికి సంభవిస్తున్న నష్టాన్ని వాడవాడలా తెలియజేసి ప్రజలను చైతన్యపరచటానికి శనివారం నుంచి గుంటూరు నగరపాలక అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. శనివారం తొలుత హిమని సెంటర్వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుపతి నగరంలో ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా వాడుతున్న జొన్న పిండి సంచులను నగరానికి తీసుకొస్తున్నారు. సంబంధిత కంపెనీ తయారీదారుని నగరానికి రప్పించి ఆ సంచులు విక్రయాలు నగరంలో ఇకమీదట కొనసాగించేలా అనుమతులు ఇచ్చారు. నగరంలోని ప్రధాన రహదారుల వెంబడి ఆ సంచుల విక్రయాలకు కౌంటర్లు తెరవబోతున్నారు.
తయారీదారులకు నోటీసులు
మరోవైపు గుంటూరు ఆటోనగర్ కేంద్రంగా ప్లాస్టిక్ సంచులు తయారుచేసే యూనిట్లు 10 వరకు ఉన్నాయి. ఇక్కడి నుంచే ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తానికి అవి సరఫరా అవుతున్నాయి. వాటి తయారీదారులకు కాలుష్య నియంత్రణమండలి ద్వారా నోటీసులు జారీ చేశారు. మరోవైపు నగరపాలక నుంచి వాటి తయారీదారులు, విక్రేతలతో జూలై ఒకటి నుంచి వాటి అమ్మకాలు జరపబోమని అండర్ టేకింగ్ లేఖలు తీసుకున్నారు. అందుకు భిన్నంగా ఎవరైనా వ్యవహరిస్తే భారీగా అపరాధ రుసుములు విధించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నగరంలో సగటున రోజుకు 450 టన్నుల పైబడి చెత్త వెలువడుతోంది. అందులో సుమారు 100 టన్నుల పైబడి ప్లాస్టిక్ సంచులు, డబ్బాలు వంటివి ఉంటున్నాయని గుర్తించారు. వాడి కాల్వల్లో, రహదారులపై పడేయటం వంటివి చేయటంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు ఇళ్లల్లో మిగిలిన ఆహార పదార్థాలను సంచుల్లో పెట్టి రహదారులపై పడేయటంతో వాటిని మూగజీవాలు తింటూ గొంతుకు అడ్డుపడి చనిపోవటం వంటి సంఘటనలు అనేకం.
నేటి నుంచి తనిఖీలు
శనివారం నుంచే నగరంలోని 207 సచివాలయాల పరిధిలో ఉద్యోగులతో ప్రతి షాపును తనిఖీ చేయించటానికి కార్యాచరణ రూపొందించారు. వాలంటీర్లను దీనిలో భాగస్వాములను చేయనున్నారు. సచివాలయాల్లో ఉండే పర్యావరణ కార్యదర్శులు, బయో ఇంజినీర్లు ఈ చర్యలకు శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. ఏ షాపులో అయినా కవర్లు గుర్తిస్తే వాటిని వెంటనే స్వాధీనం చేసుకుని తగులబెట్టాలని మేయర్ కావటి మనోహర్నాయుడు ఆదేశించారు.
ఉల్లంఘిస్తే జరిమానాలు ఇలా..
తయారీదారులకు రూ.50 వేలు
చిల్లర వర్తకులకు రూ.2500-15000
వినియోగదారులకు రూ.250-500
తిరుపతిలో విక్రయాలు చేస్తున్నవారికి ఆహ్వానం
తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదాలను ప్రస్తుతం మొక్కజొన్న పిండితో తయారుచేసిన సంచుల్లో పెట్టి భక్తులకు అందజేస్తోంది. ఆ సంచి మందం బాగానే ఉంది. పిండి రుబ్బుకునే గ్రైండర్లలో పడేస్తే చాలు ఆ సంచి ఇట్టే పిండైపోతోంది. దీనివల్ల మానవాళికి నష్టం లేదని కొన్ని ఇళ్లల్లో వాడిచూశాం. ఐదు కిలోల బరువు వరకు వాటిల్లో పెట్టుకోవచ్ఛు ఈ సంచులను నగరవాసులకు పరిచయం చేయటానికి నగరంలోని ప్రధాన కూడళ్లలో రహదారి వెంబడి స్టాల్స్ పెట్టుకుని విక్రయించడానికి అనుమతులిచ్చాం. జనపనార సంచులు,. క్లాత్ బ్యాగ్ల తయారీదారులు కూడా విక్రయించుకోవచ్చని సూచించాం. - కావటి మనోహర్నాయుడు, మేయర్, నగరపాలక సంస్థ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?