logo

వివాహం.. ఆలోపే విషాదం

వివాహం నేపథ్యంలో దైవ దర్శనానికి వెళుతున్న యువతిని  మృత్యువు కబళించింది.  పోలీసుల కథనం ప్రకారం.. చిలకలూరిపేటకు చెందిన రాచుమల్లు సాయి లక్ష్మీరత్న (24)బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలోని ఆధార్‌ సెంటర్‌లో పని చేసేది.

Published : 10 Aug 2022 04:19 IST

యువతిని బలి తీసుకున్న ప్రమాదం


సాయి లక్ష్మీరత్న (పాతచిత్రం)

యడ్లపాడు, చిలకలూరిపేట పట్టణం: వివాహం నేపథ్యంలో దైవ దర్శనానికి వెళుతున్న యువతిని  మృత్యువు కబళించింది.  పోలీసుల కథనం ప్రకారం.. చిలకలూరిపేటకు చెందిన రాచుమల్లు సాయి లక్ష్మీరత్న (24)బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలోని ఆధార్‌ సెంటర్‌లో పని చేసేది. ఆమె తన అమ్మ నాగలక్ష్మితో కలసి మంగళవారం ద్విచక్ర వాహనంపై బోయపాలెం బయలుదేరారు. అదే సమయంలో తిమ్మాపురం వసంత నూలుమిల్లుకు చెందిన బస్సు కూలీలను తీసుకు రావటానికి యడ్లపాడు వైపు వెళుతూ.. డ్రైవర్‌ మూత్ర విసర్జనకు జాతీయ రహదారిపై  నక్కవాగు వద్ద బస్సు నిలిపాడు. దీన్ని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో వాహనం నడుపుతున్న సాయి లక్ష్మీరత్న అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన నాగలక్ష్మిని 108లో గుంటూరు తరలించారు. మృతురాలి తండ్రి  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

వివాహం జరగనుండగా..

సాయిలక్ష్మీరత్నకు  ఇటీవల ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. బుధవారం రాత్రి  వివాహం జరగనుంది. కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  బంధుమిత్రులను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో  ప్రమాదం జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని