రూ.50 లక్షలు పైబడిన డాక్యుమెంట్పై టీడీఎస్
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలట్లేదు. తాజాగా రూ.50లక్షల విలువ కలిగిన డాక్యుమెంట్ ఏదైనా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తే దానిపై తొలుత టీడీఎస్ మినహాయించుకుని ఆ తర్వాతే రిజిస్ట్రేషన్కు ఉపక్రమించాలని
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలట్లేదు. తాజాగా రూ.50లక్షల విలువ కలిగిన డాక్యుమెంట్ ఏదైనా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తే దానిపై తొలుత టీడీఎస్ మినహాయించుకుని ఆ తర్వాతే రిజిస్ట్రేషన్కు ఉపక్రమించాలని స్టాంపులు-రిజిస్ట్రేషన్ శాఖ సబ్రిజిస్ట్రార్లను ఆదేశించింది. ఈ నిర్ణయంతో చాలా మంది అంత విలువ కలిగిన డాక్యుమెంట్లు సమర్పించడానికి భయపడుతున్నారు. ఆస్తిని ముక్కలుగా విభజించి సాధ్యమైనంత వరకు రూ.50లక్షల లోపే డాక్యుమెంట్ విలువ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
టీడీఎస్ అనేది ఆదాయపన్ను శాఖకు వెళ్తుంది. కేంద్రం తిరిగి కొంత రాష్ట్రానికి చెల్లిస్తుంది. దీంతో ఈ ఆదాయంపై ప్రభుత్వం దృష్టి పెట్టి టీడీఎస్ కచ్చితంగా మినహాయించాలని ఆదేశించడంతో గడిచిన కొద్ది రోజుల నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయని దస్తావేజు లేఖర్లు చెబుతున్నారు. గతంలో వ్యవసాయ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ అధికారులు టీడీఎస్ కట్టించేవారు. ప్రస్తుతం దాన్ని ఇళ్లు, భవనాలు, ఖాళీ స్థలాలకు అమలు చేస్తున్నారు. దీంతో చాలా మంది టీడీఎస్ నుంచి ఎలా తప్పించుకోవాలని అన్వేషిస్తూ విక్రయించే ఆస్తిని ఒకే డాక్యుమెంట్లో కాకుండా రెండు, మూడు డాక్యుమెంట్లుగా సమర్పించి ఆ మేరకు దాని విలువ రూ.50లక్షల లోపే ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది. కారణాలేమైనా రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయని అధికారులు సైతం అంటున్నారు. రిజిస్ట్రేషన్కు వచ్చిన సమయంలోనే టీడీఎస్ చెల్లించాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేస్తుండడంతో పెద్ద పార్టీలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆసక్తి కనబరచటం లేదని, కేవలం అత్యవసరాలకు ఆస్తులు అమ్ముకునేవారు, పిల్లల పెళ్లిళ్లకు ఆస్తులు బదలాయించుకునే డాక్యుమెంట్లు, తనఖా రుణాలకు సంబంధించినవే ఎక్కువుగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని రిజిస్ట్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఎప్పుడైతే టీడీఎస్ మినహాయించారో సంబంధిత చెల్లింపుదారుడి వివరాలు ఆన్లైన్లో వెంటనే ఐటీ శాఖకు తెలిసిసోతాయని భయపడుతున్నారు. ఈ నిబంధన రాక మునుపు ఏడాదికి ఒకసారి రిజిస్ట్రేషన్ అధికారులు టీడీఎస్ మినహాయించిన డాక్యుమెంట్ల వివరాలను ఐటీ అధికారులకు తెలియజేసేవారు. ఈ ప్రకారం పక్కాగా వివరాలు రావడం లేదని, రిజిస్ట్రేషన్ వర్గాలు టీడీఎస్ చెల్లించినా చెల్లించకపోయినా ప్రభుత్వ ఖజానాకు రావల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములు కట్టించుకుని రిజిస్ట్రేషన్కు ఉపక్రమించేవారన్న అభిప్రాయం ఉండేది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పైసా ఆదాయం కీలకంగా మారడంతో ఈ టీడీఎస్ వసూలు అనేది వ్యవసాయ భూముల విషయంలోనే కాదు ఇల్లు, ఖాళీ స్థలాలకు అమలు చేయాలని ఆదేశిస్తూ ఇటీవలే ఉత్తర్వులు వెలువరించింది. దాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నామని రిజిస్ట్రేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఆదాయపన్నుశాఖకు ఆదాయం ఎగ్గొట్టకుండా ఉండటానికి ఈ నిబంధనను ఆస్తి రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే అమలు చేయాలని నిర్ణయించామని, ఇందులో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి టీడీఎస్ కూడా రిజిస్ట్రేషన్ శాఖ వసూలు చేసి దాన్ని తిరిగి ఐటీశాఖ పద్దులో ఆన్లైన్లో బదిలీ చేస్తున్నామని అధికారులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూపర్-6తో భవిష్యత్తు గ్యారెంటీ
[ 10-05-2024]
‘అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఇక్కడ నివసిస్తున్న వివిధ వృత్తుల వారు చేసే పనికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఆదాయం పెరిగేలా చేస్తాం. ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసి అక్కడ పని చేసుకోవడానికి అన్ని వసతులు.. -
ఈ అరాచకాల్ని.. ఆపేదెవరు..?
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు మూడు రోజుల సమయమే ఉంది. శనివారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. సోమవారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పల్నాడులో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కత్తిమీదసాములా మారింది. -
అన్నవి హామీలే.. కర్షకులకు కష్టాలే
[ 10-05-2024]
జిల్లాలో పంటలు చేతికొచ్చే వేళ మిగ్జాం తుపానుతో రైతులు సర్వం కోల్పోయారు. కోత కోసి ఓదెల మీద ఉన్న వరి పనలు తడిచిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలకొరిగి నష్టం జరిగింది. -
ప్రతీ నెలా నిరీక్షణే.. జీవితకాలం నష్టమే..
[ 10-05-2024]
2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2022లో పీఆర్సీని ప్రకటించారు. 11వ పీఆర్సీలో ఫిట్మెంట్ 23 శాతానికి ప్రభుత్వం తగ్గించడంతో విశ్రాంత ఉద్యోగుల పింఛన్లో 4 శాతం కోత పడింది. -
బరితెగించిన వైకాపా
[ 10-05-2024]
గుంటూరు నగరంలో వైకాపా తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి బరి తెగించారు. ప్రజల నుంచి మద్దతు లేదని గుర్తించిన సదరు వ్యక్తులు అడ్డదారుల్లోనైనా గెలవాలనే లక్ష్యంతో సామ, దాన, దండోపాయాలు అవలంబిస్తున్నారు. -
నా సోదరి మాధవిని గెలిపించండి
[ 10-05-2024]
గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన నా సోదరి గళ్లా మాధవిని గెలిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. జనసేన కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె పవన్ కల్యాణ్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. -
ఐఎఫ్ఎస్కు నడింపల్లి యువతి ఎంపిక
[ 10-05-2024]
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో చెరుకుపల్లి మండలం నడింపల్లికి చెందిన వెన్నం అనూష 73వ ర్యాంక్ సాధించారు. ఎన్నో ప్రయత్నాల తరువాత ఆమె ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. -
అంతర్ జిల్లాల బ్యాలట్లు గల్లంతు
[ 10-05-2024]
పోస్టల్ బ్యాలట్ మొదలైనప్పటి నుంచి అంతర్ జిల్లాల ఉద్యోగుల విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. తొలి రోజు నుంచి బ్యాలట్ల కొరత ఉందని చెబుతూనే.. -
మంగళగిరి ప్రజలూ నా కుటుంబ సభ్యులే
[ 10-05-2024]
మంగళగిరి ప్రజలు తనకు సొంత కుటుంబ సభ్యులతో సమానమని కూటమి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి మండలం కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తల్లి నారా భువనేశ్వరితో కలసి గురువారం ‘రచ్చబండ’ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
దోశలో ఇనుప వాషర్ బోల్ట్
[ 10-05-2024]
గుంటూరులోని కొందరు హోటల్స్ నిర్వాహకులు ఆహార పదార్థాల తయారీలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గురువారం కొరిటెపాడులోని ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లిన వినియోగదారుడికి ఎదురైన సంఘటనే తార్కాణం. -
రోశయ్య, ఆళ్ల మాట తప్పారు
[ 10-05-2024]
పెదకాకాని హజరత్ సయ్యద్ బాజిషహీద్ అవులియా బాబా దర్గా నిర్వహణ బాధ్యతల విషయంలో ఎమ్మెల్యేలు రోశయ్య, ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట తప్పారు. ఈ కారణంగా ముత్తవల్లీ, ముజావర్ల వంశాలకు చెందిన 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. -
‘వైకాపా అభ్యర్థులను అన్ని చోట్లా ఓడించండి’
[ 10-05-2024]
దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ దళితుల్ని నిలువునా వంచించారని ప్రభుదా రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావ్,
తాజా వార్తలు (Latest News)
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..