రూ. వందల కోట్లు ఏమయ్యాయ్..!
సేకరించిన రూ.కోట్లకు లెక్కలు లభించడం లేదు. ఖాతాలు సరిగా లేవు. కొంతమందికి క్యాష్బ్యాక్ రూపంలో ఆదాయం వచ్చినట్లు చెబుతున్నారు.
కనిగిరిలో 150 ఎకరాల భూమి మాత్రమే గుర్తింపు
‘సంకల్ప సిద్ధి’ స్కామ్ దర్యాప్తుపై రాజకీయ ప్రభావం
ఈకార్ట్ వస్తువుల స్వాధీనం
ఈనాడు, అమరావతి
సేకరించిన రూ.కోట్లకు లెక్కలు లభించడం లేదు. ఖాతాలు సరిగా లేవు. కొంతమందికి క్యాష్బ్యాక్ రూపంలో ఆదాయం వచ్చినట్లు చెబుతున్నారు. దీనికి సొమ్ములు ఎక్కడి నుంచి చెల్లించారో వివరాలు లేవు. ప్రకాశం జిల్లా కనిగిరిలో కొనుగోలు చేసినట్లు చెబుతున్న భూమి మినహా ఇతర చర, స్థిర ఆస్తులు దుర్భిణి వేసి వెతికినా కనిపించడం లేదు. సంకల్పసిద్ది ఈకార్ట్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ తీరు ఇది. మల్టీ లెవల్ మార్కెటింగ్ విధానంలో తక్కువ కాలంలో పెట్టుబడి ఆరు రెట్లు అవుతుందని నమ్మించి వసూలు చేసిన సొమ్ము ఎటువైపు వెళ్లిందో పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. గన్నవరం కేంద్రంగా ఆవిర్భవించిన ఈ సంస్థపై ఫిర్యాదు రావడంతో విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టాస్క్ఫోర్సు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం లేదా మంగళవారం విజయవాడ పోలీసుల కమిషనర్ కాంతిరాణాటాటా మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు పోలీసు దర్యాప్తుపై ఉన్నత స్థాయిలో రాజకీయ ఒత్తిడి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థకు సూత్రధారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులేనని తెదేపా నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా పోలీసు బృందాలు పలుచోట్ల విచారణ జరిపారు. కానీ ఒక్క కనిగిరిలో మినహా ఎక్కడా ఎలాంటి ఆస్తులు కనిపెట్టలేదు. నిడమనూరు, విజయవాడ దుర్గా అగ్రహారంలో ఏర్పాటు చేసిన ఈ మార్ట్లో ఉన్న గృహోపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టోర్లు సీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాటి విలువను గణిస్తున్నారు. సంస్థ ఎండీ గుత్తా వేణుగోపాలకృష్ణ, డైరెక్టర్గా ఉన్న ఆయన తనయుడు కిరణ్కుమార్లు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరితో పాటు పలువురు ఉద్యోగులను విచారణ చేస్తున్నారు. దర్యాప్తు అంత ఆశాజనకంగా సాగడం లేదని తెలిసింది.
స్టోర్లలో తనిఖీలు
స్కీంలో భాగంగా సభ్యులకు విలువైన గృహోపకరాలు క్యాష్బ్యాక్ రూపంలో విక్రయిస్తారు. ఒక వస్తువు ధర రూ.10వేలు ఉంటే ముందుగా ఖాతాదారుడు రూ.10వేలు చెల్లించాలి. తిరిగి పది నెలల్లో నెలకు రూ.వెయ్యి చొప్పున ఖాతాదారుడిని క్యాష్బ్యాక్ రూపంలో తిరిగి వస్తాయని నమ్మించారు. అలా ఆ వస్తువు ఉచితంగా లభించినట్లు అవుతుంది. దీని కోసం నిడమానూరులో ఒక స్టోరు, దుర్గాగ్రహారంలో ఒకటి ఏర్పాటు చేశారు. నిడమానూరులోనే గోదాము ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఉన్న గృహోపకరణాలను పోలీసులు లెక్కిస్తున్నారు. ఆదివారం రూ.15లక్షల విలువైన వివిధ రకాల వస్తువులు ఉన్నట్లు తేలింది. వీటిని పంచనామా చేసి సీజ్ చేయనున్నారు.
లంచాలపై ఆరా..: ఈ సంస్థ నుంచి కొంత మంది పోలీసులకు, మీడియా వ్యక్తులకు అందిన లంచాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక ప్రముఖ మీడియా ఛానల్ ప్రతినిధి సూత్రధారుడిగా పంపకాలు జరిగినట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన చిత్రాలు లభించాయని తెలిసింది. గత 20 రోజుల క్రితమే ఈ పంపిణీ జరిగినట్లు సంస్థ ప్రతినిధులు పోలీసులకు తెలిపారు. ఆ జాబితాను పోలీసులు బయట పెడతారా లేదా అనేది తేలాల్సి ఉంది. కొంతమంది పోలీసులతో డీల్ కుదుర్చుకుని భారీ మొత్తం అందజేసినట్లు విచారణలో తెలిపినట్లు తెలిసింది. సరిగ్గా నెల క్రితం ఓ విభాగానికి చెందిన పోలీసులకు చందా రూపంలో పెద్ద మొత్తమే అందించారని అంటున్నారు. ఇవన్నీ వెలుగుచూస్తే సంచలనమే. కానీ మరోవైపు రాజకీయ ప్రభావం ఉండటంతో దర్యాప్తు ఏ మేరకు జరుగుతుందనేది అనుమానాస్పదంగా ఉందని తెదేపా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆగ్రోస్ సంస్థతో ఒప్పందం..?
ప్రకాశం జిల్లా కనిగిరిలో కొనుగోలు చేసిన 150 ఎకరాల్లో ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలు పెంచే విధంగా ఒక ఆగ్రోస్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. మూడు పోలీసు బృందాలు కనిగిరి వెళ్లి విచారణ చేశాయి. ఇక్కడ మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి రూ.కోట్లలో ఉంటుంది. అక్కడే మరో 50 ఎకరాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. దీనికి సొమ్ములు చెల్లించలేదు. కొనుగోలు చేసిన భూమిలో మొక్కలు పెంచే బాధ్యత ఒక ఆగ్రోస్ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం వచ్చే ఆదాయంలో తమకు, ఆగ్రోస్ సంస్థకు 60:40 నిష్పత్తి ప్రకారం ఒప్పందం చేసుకున్నారు. సంస్థ తరఫున కాకుండా యజమాని గుత్తా వేణుగోపాలకృష్ణతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. బెంగళూరులోనూ స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ పోలీసుల విచారణలో తేలలేదు. స్థిరాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది స్పష్టంగా తేలలేదు. ఎక్కువ మొత్తం నగదు రూపంలోనే తరలించినట్లు తెలిసింది.
రూ.250 కోట్లు ఏవీ..?
ఈ ఏడాది మే నెలలో ప్రారంభించిన ఈ సంకల్పసిద్ధి సంస్థ సుమారు రూ.250 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనధికార అంచనా ప్రకారం ఇవి దాదాపు రూ.1100 కోట్ల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కొంతమంది ప్రజాప్రతినిధుల సిఫార్సులతో భారీగా డిపాజిట్లు సేకరించినట్లు స్పష్టమైంది. ప్రధానంగా గన్నవరం, గుడివాడ విజయవాడలలో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. వీటిని ప్రస్తుతం ఎత్తేశారు. ప్రత్యేక యాప్ ఒకటి రూపొందించి దాని ద్వారానే లావాదేవీలు అన్నీ నిర్వహించినట్లు తెలిసింది. దీని ప్రకారం సభ్యులకు ప్రతినెలా క్యాష్బ్యాక్ రూపంలో కొనుగోలు చేసిన వస్తువు విలువ ఆధారంగా సొమ్ములు జమ అవుతున్నట్లు చూపిస్తుంది. కానీ ఆ బ్యాలెన్సు విత్డ్రా చేసేందుకు అవకాశం ఉండదు. అలా సొమ్ములు జమ అయిన తర్వాత ఒకానొక సమయంలో ఆ ఖాతా ఖాళీ అవుతుందని తెలిసింది. మరో మూడు నెలల్లో బోర్డు తిప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు పోలీసుల విచారణలోనే ఎండీ వెల్లడించినట్లు తెలిసింది. ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా చేసుకుని భారీగా సేకరించి ఎత్తేసేందుకు ప్రణాళికతోనే ఏర్పాటు చేసినట్లు అంగీకరించినట్లు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..