ప్రేమ పేరుతో.. కత్తులు దూశారు..
ముక్కు మొహం తెలియకుండానే ఇన్స్టాగ్రాంలో పరిచయాలు. ఆపై ప్రేమ చిగురింపులు. కొన్నాళ్లు ప్రేమ పేరుతో స్నేహాలు.. ఆ తర్వాత కొంతకాలానికి వారి మధ్య అనుమానాలు.. అపోహలు ఏర్పడి చివరకు కత్తులు దూసుకునే వరకు వెళుతున్నాయి.
నాడు రమ్య.. నేడు తపస్వి ఉదంతాలు
ఈనాడు, అమరావతి
ముక్కు మొహం తెలియకుండానే ఇన్స్టాగ్రాంలో పరిచయాలు. ఆపై ప్రేమ చిగురింపులు. కొన్నాళ్లు ప్రేమ పేరుతో స్నేహాలు.. ఆ తర్వాత కొంతకాలానికి వారి మధ్య అనుమానాలు.. అపోహలు ఏర్పడి చివరకు కత్తులు దూసుకునే వరకు వెళుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన బీడీఎస్ విద్యార్థిని తపస్వి పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో తన స్నేహితురాలి ఇంట్లోనే ప్రేమోన్మాది జ్ఞానేశ్వర్ చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఇలాంటి ఘటనే ఏడాది కిందట గుంటూరు నగరంలో జరిగింది. బీటెక్ విద్యార్థిని రమ్య కూడా అప్పట్లో ప్రేమికుడు శశికృష్ణ చేతిలో దారుణంగా హత్యకు గురైంది. ఈ రెండు ఉదంతాల్లోనూ పెళ్లికి నిరాకరించడంతోనే ప్రేమికులు ఉన్మాదుల్లా మారి ఏకంగా ప్రాణాలు తీసేశారు.
తపస్వి (పాతచిత్రం)
వదిలేయాలని ప్రాధేయపడినా..
మనం ఎవరితో స్నేహం చేస్తున్నామనేది ముఖ్యం. దాన్ని గమనించకుండా వ్యవహరిస్తే సమాజంలో ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంజినీరింగ్ ఫెయిలై నేర స్వభావానికి అలవాటుపడిన జ్ఞానేశ్వర్తో తపస్వికి తొలుత ఇన్స్టాగ్రాంలో స్నేహం మొదలైంది. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమికులుగా మారారు. కొంతకాలం కలిసి ఉన్నారు. కారణాలేమైనా వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో తనను పట్టించుకోవడం లేదని, దూరం పెడుతోందని అక్కసుతో ఏకంగా తపస్విపై సర్జికల్ బ్లేడ్తో దాడికి తెగబడి నరరూప రాక్షసుడిలా వ్యవహరించారు. ఇకనైనా తనను వదిలేయాలని ఆ యువతి ప్రాధేయపడినా ఏమాత్రం లెక్కపెట్టలేదు. కొన ఊపిరితో ఉంటే ఒక గది నుంచి మరో గదిలోకి లాక్కెళ్లి మరీ గొంతుకోసి చంపేయడం చూస్తుంటే ప్రేమోన్మాదులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థమౌతోంది. పదో తరగతి కూడా పాస్కాని శశికృష్ణ అనే యువకుడి ప్రేమలో రమ్య పడింది. తర్వాత అతడి గురించి తెలుసుకుని దూరం పెట్టింది. దాన్ని తట్టుకోలేక ఏకంగా నడిరోడ్డుపైనే కత్తితో దాడి చేశాడు.
ఎవరితో స్నేహం చేస్తున్నామో తెలుసుకోవాలి
ప్రేమించడం తప్పు కాదు. అయితే ఎవరితో ప్రేమలో పడ్డాం. వారి స్వభావం ఏమిటి? వారి గత నేపథ్యం వంటివి తెలుసుకుని వ్యవహరిస్తే ఇలాంటి దారుణాలు చోటుచేసుకోవని పోలీసు వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం యువతి, యువకుల్లో ఇది లోపిస్తోందని, గుడ్డిగా నమ్మేస్తున్నారని, చివరకు వారేమిటో తెలుసుకునేలోపే ఘోరం జరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి యువతీ, యువకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమించిన వ్యక్తి స్వభావం, వారి ప్రవర్తన, వారి వ్యవహారశైలిపై అమ్మాయిలకు స్పష్టమైన అవగాహన ఉండాలి.
* ప్రేమించినంత మాత్రాన పెళ్లి చేసుకోలేదని హత్యలకు పాల్పడటం, హతమార్చటం సరికాదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే మహిళా సంఘాలు, రాజకీయ పక్షాలు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తుంటాయి. సమాజంలో ప్రేమ పేరుతో జరిగే అఘాయిత్యాలను ధైర్యంగా ఎదిరించాలి. తక్కెళ్లపాడులో తపస్విపై ప్రేమోన్మాది దాడి చేస్తున్న సమయంలో స్నేహితురాలు సహాయం కోసం కేకలు వేసినా కొందరు స్పందించలేదు. మరికొందరు విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకుని ప్రేమోన్మాది దాడి నుంచి ఆ యువతిని తప్పించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పంట పొలాలతో ప్రశాంత వాతావరణం ఉండే తమ గ్రామంలో ప్రేమోన్మాది చేతిలో ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి దారుణంగా హత్యకు గురికావడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్